అన్వేషించండి

NCRB Report Telangana: సైబర్ క్రైమ్‌లో తెలంగాణ నెంబర్ వన్, ఆహార కల్తీలోనూ అగ్రస్థానం !

Crime Rate Details: తెలంగాణలో రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ క్రైమ్ తో పాటు ఆహార కల్తీలోనూ దేశ వ్యాప్తంగా మనమే ముందున్నామని జాతీయ నేర గణాంక సంస్థ తెలిపింది. 

Crime Rate Details: తెలంగాణ రాష్ట్రంలో నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని జాతీయ నేర గణాంక సంస్థ (NCRB Report 2021) విడుదల చేసిన నివేదిక చూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో సైబర్ నేరాలు గణనీంగా పెరిగాయి. 2019వ సంవత్సరంలో 2,691 సైబర్ నేరాలు జరగ్గా..  2020లో ఆ సంఖ్య 5,024కు పెరిగింది. 2021లో అయితే ఈ సంఖ్య 10,303కు చేరిపోయింది. దేశ వ్యాప్తంగా 52,430 కేసులు నమోదు అవ్వగా అందులో తెలంగాణలో 10 వేలకు పైగా కేసులు ఉండడం గమనార్హం. మొత్తం 40 శాతం సైబర్ నేరాలు మన రాష్ట్రంలోనే నమోదై మొదటి స్థానంలో నిలవగా.. ఉత్తర ప్రదేశ్ 8,829 కేసులతో రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణలో ఆన్ లైన్ బ్యాంకింగ్ మోసాలు 2,180, ఓటీపీ మోసాలు 1,377, మార్ఫింగ్ కేసులు 18, ఫేక్ ప్రొఫైల్ తయారీ కేసులు 37, ఏటీసీ కేసులు 443 నమోదు అయినట్లు జాతీయ నేర గణాంక సంస్థ వివరిస్తోంది. 

రైతు ఆత్మహత్యల్లో నాలుగో స్థానం.. 
ఆర్థిక మోసాల కోణంలో జరిగే సైబర్ నేరాలు కూడా తెలంగాణలోనే ఎక్కువగా నమోదు అయ్యాయి. మొత్తం 8693 కేసులు నమోదు అవ్వగా.. 2019లో 11,465, 2020లో 12,985, 2021లో 20,759కి చేరుకున్నాయి. ఈ తీరు చూస్తే రాష్ట్రంలో సైబర్ నేరాల తీవ్రత ఏ రేంజ్ లో ఉందో తెలుస్తుంది. దేశవ్యాప్తంగా నమోదైన ఈ కేసుల్లో మన రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. అలాగే రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. 2021లో దేశ వ్యాప్తంగా 1,64,033 మంది ఆత్మహత్యలు చేస్కున్నారు. వీటిలో 4,806 మంది రైతులు, 5,121 మంది కౌలు రైతులు ఉన్నారు. అలాగే 5 వేల 563 మంది రైతు కూలీలు బలవన్మరణానికి పాల్పడ్డట్లు నివేదికలు చెబుతున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 2,429 మంది రైతులు, 1,329 మంది కౌలు రైతులు, 1,424 మంది రైలు కూలీలు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. కర్ణాటక, ఏపీ రెండు, మూడు స్థానాల్లో నిలవగా.. తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. మన దగ్గర 303 మంది రైతులు, 49 మంది కౌలు రైతులు, ఏడుగురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. 

వృద్ధులపై దాడుల్లో మూడో స్థానంలో..! 
వృద్ధులపై దాడుల్లో కూడా మన రాష్ట్రం ముందంజలోనే ఉంది. 1952 కేసులతో మూడో స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర 6,190 కేసులతో మొదటి స్థానంలో నిలవగా... మధ్య ప్రదేశ్ 5,273 కేసులతో రెండో స్థానంలో నిలిచింది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో దళిత మహిళలను అవమానించిన కేసులు కూడా అధికంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 151 కేసులు నమోదు కాగా.. అందులో ఏపీవి 83, తెలంగాణవి 21 కేసులు ఉండడం గమనార్హం. లైంగిక అక్రమ రవాణా కేసుల్లో కూడా తెలంగాణ ముందు వరుసలోనే ఉంది. దేశ వ్యాప్తంగా మొత్తం 2083 కేసులు నమోదు అవ్వగా.. తెలంగాణలోనే 347 కేసులు నమోదయ్యాయి.

రోడ్డు ప్రమాదాల్లో తమిళనాడు నెంబర్ వన్.. 
అక్రమ రవాణా కేసుల్లో 1050 మంది నిందితుల అరెస్టుతో తెలంగాణ తొలి స్థానంలో ఉంది. కుటుంబ సమస్యలతో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేస్కున్న కేసులు ఒడిశాలో ఎక్కువ ఉడగా.. ఇందులో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. అలాగే 2020తో పోలిస్తే 2021లో రోడ్డు ప్రమాదాలు 58 శాతం పెరిగి తొలి స్థానంలో ఉంది. యూపీలో 15.2, తెలంగాణ 10.8, ఏపీ 9.5, పంజాబ్ 9.1 శాతం రోడ్డు ప్రమాదాలు పెరిగినట్లు జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసిన నివేదిక వెల్లడిస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MP Candidates List: ఏపీలో 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వీళ్లే
ఏపీలో 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వీళ్లే
IPL 2024: కోల్‌కతా చేతిలో బెంగళూరు చిత్తు, ఈ సీజన్‌లో అలా తొలిసారి!
కోల్‌కతా చేతిలో బెంగళూరు చిత్తు, ఈ సీజన్‌లో అలా తొలిసారి!
RS Praveen Kumar: పార్టీ మారుతున్న కడియం, కేకే - తాను మాత్రం గొర్రెను కాదన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
పార్టీ మారుతున్న కడియం, కేకే - తాను మాత్రం గొర్రెను కాదన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Hero Nikhil: టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ - కండువా కప్పి ఆహ్వానించిన నారా లోకేశ్
టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ - కండువా కప్పి ఆహ్వానించిన నారా లోకేశ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RCB vs KKR Highlights | Virat Kohli Hugs Gautam Gambhir | గంభీర్ ను హగ్ చేసుకున్న కోహ్లీ| ABP DesamRCB vs KKR Match Highlights | ఆర్సీబీ కి చిన్నస్వామిలో కేకేఆర్ పెద్దషాక్ | IPL 2024 | ABP DesamDil Raju Trolls Tamil Trollers | Family Star తమిళ్ ప్రమోషన్స్ లో దిల్ రాజు ఫన్ | ABP DesamCM Revanth Reddy on Phone Tapping | ఫోన్ ట్యాపింగు కేసులో KTR పై CM Revanth Reddy సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Candidates List: ఏపీలో 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వీళ్లే
ఏపీలో 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వీళ్లే
IPL 2024: కోల్‌కతా చేతిలో బెంగళూరు చిత్తు, ఈ సీజన్‌లో అలా తొలిసారి!
కోల్‌కతా చేతిలో బెంగళూరు చిత్తు, ఈ సీజన్‌లో అలా తొలిసారి!
RS Praveen Kumar: పార్టీ మారుతున్న కడియం, కేకే - తాను మాత్రం గొర్రెను కాదన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
పార్టీ మారుతున్న కడియం, కేకే - తాను మాత్రం గొర్రెను కాదన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Hero Nikhil: టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ - కండువా కప్పి ఆహ్వానించిన నారా లోకేశ్
టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ - కండువా కప్పి ఆహ్వానించిన నారా లోకేశ్
Banking: ఆదివారం కూడా బ్యాంక్‌లు పని చేస్తాయి, సెలవు లేదు
ఆదివారం కూడా బ్యాంక్‌లు పని చేస్తాయి, సెలవు లేదు
Tummala Nageswararao: 'వ్యవసాయ పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది' - రూ.2 లక్షల రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన
'వ్యవసాయ పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది' - రూ.2 లక్షల రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన
Kia EV9: ఈ కియా కారుకు ప్రత్యేక ఘనత - వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత!
ఈ కియా కారుకు ప్రత్యేక ఘనత - వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత!
Paruchuri Gopala Krishna: ‘హనుమాన్’లో రొమాన్స్ పెంచి ఉంటే బాగుండు, శివుడిని ఎందుకు చూపించారో అర్థం కాలేదు: పరుచూరి రివ్యూ
‘హనుమాన్’లో రొమాన్స్ పెంచి ఉంటే బాగుండు, శివుడిని ఎందుకు చూపించారో అర్థం కాలేదు: పరుచూరి రివ్యూ
Embed widget