అన్వేషించండి

Cable Bridge: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై తీగల వంతెనకు మోక్షం, డీపీఆర్‌ను ఆమోదించిన కేంద్రం

Cable Bridge: కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 

Cable Bridge on Krishna River: ఎప్పటి నుంచో వేచి చూస్తున్న నిర్మాణానికి తాజాగా కేంద్ర సర్కారు ఆమోదించింది. ఇరు తెలుగు రాష్ట్రాలను కలిపి నిర్మించాలనుకున్న వంతెన నిర్మాణానికి కేంద్రం అనుమతించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సోమశిల వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన (ఐకానిక్ హైబ్రిడ్ కేబుల్ బ్రిడ్జి ) నిర్మాణానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. జాతీయ రహదారుల సంస్థ రూపొందించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్- డీపీఆర్ ను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా ఆమోదం తెలిపింది.
ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు రూ.1,519.47 కోట్లు ఖర్చు చేయాలని కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. బ్రిడ్జి నిర్మాణానికి రూ.1,082.56 కోట్లు, పర్యాటక అభివృద్ధి పనులకు మరో రూ.436.91 కోట్లు కేటాయిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని కల్వకుర్తి నుంచి సోమశిల వరకు మొత్తంగా 79.3 కిలో మీటర్ల మేర రెండు వరుసల రహదారి నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.886.69 కోట్లు కేటాయించింది. దీనిపై కాంట్రాక్టర్లతో రోడ్లు భవనాల శాఖ ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. ఈ ఐకానిక్ హైబ్రిడ్ కేబుల్ బ్రిడ్జి పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని సంబంధిత అధికారులు తెలిపారు.

ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం ఆమోదం 
కృష్ణా నదిపై తెలంగాణలోని సోమశిల, ఆంధ్రప్రదేశ్ లోని సిద్ధేశ్వరం గుట్టల మధ్య 1.08 కిలో మీటర్ల మేరకు ఈ ఐకానిక్ హైబ్రిడ్ కేబుల్ బ్రిడ్జి నిర్మించనున్నారు. దేశంలో ఇప్పటికే ఉన్న తీగల వంతెనల కన్నా మెరుగ్గా ఈ కేబుల్ బ్రిడ్జీని నిర్మించేందుకు పలు నమూనాలను కేంద్రం పరిశీలించింది. అందులో నుంచి ఒకదాన్ని ఎంచుకుని ఆ తరహాలో బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం ఇచ్చింది. ఈ మార్గానికి ఇప్పటికే జాతీయ రహదారి నంబర్ కేటాయించింది కూడా. పనుల పర్యవేక్షణకు ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేసింది కేంద్ర సర్కారు. వంతెన నిర్మాణ పనులను జాతీయ రహదారుల సంస్థ చూసుకుంటుంది. టెండర్లు ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులకు సంస్థ ఆదేశాలు పంపినట్లు తెలుస్తోంది. 

టూరిస్ట్ స్పాట్ గా మారే అవకాశం
వంతెన నిర్మాణంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు మరింత సులువైన మార్గం ఏర్పడటంతో పాటు తెలంగాణ నుంచి తిరుపతికి కనీసం 70-80 కిలో మీటర్ల మేర దూరం తగ్గే అవకాశం ఉంది. చుట్టూ విశాలమైన శ్రీశైలం జలాశయం, నల్లమస అడవి, ఎత్తైన పర్వతాల మధ్య నిర్మించే ఈ వంతెన పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుందని తెలిపారు. తెలంగాణ వైపున లలితాసోమేశ్వర ఆలయం, ఆంధ్రప్రదేశ్ వైపున సంగమేశ్వర ఆలయాన్ని చూడటానికి ఇదో కేంద్రంగా మారుతుందని అన్నారు. కృష్ణానదిపై నిర్మించే వంతెనపై పాదచారులు నడిచేందుకు పొడవైన గ్లాస్‌ వాక్‌వే కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. గ్లాస్‌ వాక్‌ వేతో నిర్మితం కానుండటంతో పర్యాటకంగా ఈ మార్గం టూరిస్ట్‌ డెస్టినేషన్‌ అవుతుందని అధికారులు అంటున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు పనులు అతి త్వరలోనే ప్రారంభం అవుతాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస

వీడియోలు

The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
The Raja Saab Release Trailer : ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది - టైం స్టార్ట్ అయ్యింది డార్లింగ్స్
ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది - టైం స్టార్ట్ అయ్యింది డార్లింగ్స్
JEE Advanced 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల! మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి!
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల! మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి!
Padi Kaushik Reddy: తెలంగాణ అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
తెలంగాణ అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
Embed widget