By: ABP Desam | Updated at : 26 Sep 2023 09:16 AM (IST)
కల్వకుంట్ల కవిత (ఫైల్ ఫోటో)
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొద్ది రోజుల క్రితం నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమన్ల రద్దు కోరుతూ సుప్రీంకోర్టుకు కవిత వెళ్లారు. ఈ విచారణ సుప్రీంకోర్టులో నేడు (సెప్టెంబరు 26) జరగనుంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం విచారణ చేయనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితకు నోటీసులు పంపింది. ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని సుప్రీంను ఆశ్రయించారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో గత మార్చి నెలలో కవిత ఈడీ విచారణకు పలుసార్లు హాజరైన సంగతి తెలిసిందే. ఈడీ ఆఫీసులో మహిళల విచారణ సీఆర్సీసీకి విరుద్ధం అంటూ అప్పటి నుంచి కవిత చెబుతూ వస్తున్నారు. దీనిపై అప్పుడే ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నళిని చిదంబరం తరహాలో ఇంటి వద్దే ఈడీ తనను విచారణ చేయాలని కవిత కోరుతున్నారు. ఈ క్రమంలో ఈడీ లాంటి దర్యాప్తు సంస్థల తీరును తప్పుబడుతూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల మళ్లీ ఈడీ ఆఫీసులో విచారణకు రావాలని నోటీసులు జారీ అవడంతో ఆమె సుప్రీంను ఆశ్రయించారు.
అయితే, తాన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విచారణ దశలో ఉండగానే.. నోటీసులు ఎలా జారీ చేస్తారని కవిత ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఈడీ నోటీసులు వెలువడిన వెంటనే తాను విచారణకు రాలేనని కూడా ప్రెస్ మీట్ నిర్వహించి చెప్పేశారు. అయితే, కవిత బిజీగా ఉంటే నోటీసుల విషయంలో పది రోజుల వెసులుబాటు సమయం పొడిగిస్తామని ఈడీ తెలిపింది. ఈ క్రమంలో నేటితో ఆ పది రోజుల గడువు ముగియనుంది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలపై ఉత్కంఠ ఏర్పడింది.
Telangana Power statistics: డిస్కంలకు అప్పులు రూ.80 వేల కోట్లు నిజమే, వాస్తవాలు వెల్లడించిన బీఆర్ఎస్
Breaking News Live Telugu Updates: యశోద హాస్పిటల్లో కేసీఆర్ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
Accident: బైకును ఢీ కొన్న లారీ, మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం
Hyderabad News: పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ అదృశ్యం, మరోచోట ఆటో వదిలి పరారైన దుండగులు! అసలేం జరిగింది!
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్లో క్రేజీ సిక్సర్!
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే
/body>