అన్వేషించండి

Secunderabad Fire Accident : మంటలు అదుపులోకి, ఇద్దరి ఆచూకీ మాత్రం తెలియడంలేదు - హోంమంత్రి మహమూద్ అలీ

Secunderabad Fire Accident : రాంగోపాల్ పేట అగ్ని ప్రమాద ఘటనాస్థలిని హోంమంత్రి మహమూద్ అలీ పరిశీలించారు. ఈ ఘటనపై సమీక్షిస్తామన్నారు.

Secunderabad Fire Accident : సికింద్రాబాద్‌ రాంగోపాల్ పేట డెక్కన్‌ స్టోర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న హోంమంత్రి మహమూద్‌ అలీ ఘటనాస్థలిని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. అగ్ని ప్రమాదానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని హోంమంత్రి తెలిపారు. ప్లాస్టిక్‌ వస్తువులు, రసాయనాల కారణంగా మంటల ఉద్ధృతి ఎక్కువగా ఉందన్నారు.  80 శాతం మంటలు అదుపుచేశారని తెలిపారు. మరో గంటలో మంటలు పూర్తిగా అదుపులోకి వస్తాయన్నారు. అయితే అగ్నిప్రమాదంలో ఎవరూ చనిపోలేదని హోంమంత్రి స్పష్టం చేశారు. ఇద్దరి ఆచూకీ మాత్రం తెలియడం లేదని తెలిపారు. మంటలు పక్క భవనాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మంటలు అదుపులోకి వచ్చాక ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అగ్ని ప్రమాదంలో కాలనీ వాసులు నష్టపోతే వారిని ఆదుకుంటామన్నారు.  బిల్డింగ్ యజమానిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు.  

క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం 

"సికింద్రాబాద్ ప్రమాదంలో మంటలు అదుపులోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది. ఐదు డిపార్ట్మెంట్ ల తోటి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రెస్క్యూ చేసే క్రమంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది తీవ్ర గాయాలు పాలయ్యారు. వారిని కిమ్స్ హాస్పిటల్లో వైద్య చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. మొదటి అంతస్తులో ముందుగా మంటలు వ్యాపించినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చాం. ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరినీ రెస్క్యూ చేశాం. ఈ ప్రమాదంలో భవనం మొత్తం కూడా డామేజ్ అయింది. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత DRF సిబ్బంది కూల్చివేతలపై నిర్ణయం తీసుకుంటారు. ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రమాదంలో ఎవరిది తప్పుంటే విచారణ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. "- నాగి రెడ్డి , అడిషనల్ డీజీ, ఫైర్ డిపార్ట్మెంట్ 

భవనం కూలిపోయే ప్రమాదం 

ఉదయం పది గంటల ప్రాంతంలో మొదలైన మంటలు కాసేపటి వరకు పెరుగుతూనే ఉన్నాయి. పక్కన ఉన్న రెసిడెన్సియల్ భవనాలకు కూడా మంటలు వ్యాపించాయి. ఇది మరింత ప్రమాదకరంగా మారుతుందన్న టైంలో అధికారులు తీవ్రంగా శ్రమించి ప్రమాద తీవ్రతను చాలా వరకు తగ్గించారు. భవనానికి మూడు వైపుల మంటలు వ్యాపించాయి. పొగ విపరీతంగా వస్తోంది. దీని వల్ల అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. అసలు రెస్క్యూ ఆపరేషన్ ఎంత వరకు వచ్చిందో అన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ పొగ, మంటలు కారణంగా చుట్టుపక్కల ఉండే ప్రజల్లో చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. వాళ్లను స్థానిక ఆసుపత్రికి తరలించారు.  ముందు జాగ్రత్తగా స్థానికంగా ఉండే ప్రజలను ఖాళీ చేయించారు. విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపేశారు. నెట్‌ సేవలను బంద్ చేశారు. ఆ ప్రాంతమొత్తాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి అటువైపు ఎవరూ రాకుండా చర్యలు తీసుకున్నారు. సంఘటనా స్థలంలోనే అంబులెన్స్‌ సర్వీసులు ఉంచారు. అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మంటల ధాటికి భవనం చాలా వరకు దెబ్బతిన్నట్టు అధికారులు భావిస్తున్నారు. గోడలకు పగుళ్లు ఉన్నట్టు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ భవనం ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని అంచా వేస్తున్నారు. అందుకే అటువైపు ఎవరూ వెళ్లకుండా గట్టి చర్యలు చేపట్టారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Rythu Bharosa Scheme Update: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
Kaleshwaram Politics: కాళేశ్వరంపై రేవంత్ వాదననే వినిపిస్తున్నకేంద్రం - బీఆర్ఎస్‌ ఉక్కిరిబిక్కిరి -ఎదురుదాడి ఎలా?
కాళేశ్వరంపై రేవంత్ వాదననే వినిపిస్తున్నకేంద్రం - బీఆర్ఎస్‌ ఉక్కిరిబిక్కిరి -ఎదురుదాడి ఎలా?
Aspiring acto tragedy: సినిమా అవకాశాల కోసం తిరిగి తిరిగి అలసిపోయాడు - సినీ ఆఫీసులోనే కన్నుమూసిన ఔత్సాహిక నటుడు
సినిమా అవకాశాల కోసం తిరిగి తిరిగి అలసిపోయాడు - సినీ ఆఫీసులోనే కన్నుమూసిన ఔత్సాహిక నటుడు
BRS MLA Sudheer Reddy: దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !

వీడియోలు

Arjun Tendulkar Comments on Mumbai Indians | ముంబై ఇండియన్స్ పై అర్జున్ టెండూల్కర్ కామెంట్స్ | ABP Desam
Jadeja Breaks Silence on MS Dhoni | ధోనీపై జడేజా సంచలన వ్యాఖ్యలు | ABP Desam
IPL 2026 DC VS LSG Highlights | ఆల్ రౌండ్ షోతో బోణీ కొట్టిన ఢిల్లీ | ABP Desam
Rishabh Pant LSG vs Delhi Capitals IPL 2026 | లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి కారణం అదేనా | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raghav Chadha: ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
Telangana Rythu Bharosa Scheme Update: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
YSRCP No friends: మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
Tamil Nadu Elections 2026: విజయ్ డబుల్ రోల్ వ్యూహం - తమిళనాడు రాజకీయాల్లో సాహసమా లేక తప్పిదమా?
విజయ్ డబుల్ రోల్ వ్యూహం - తమిళనాడు రాజకీయాల్లో సాహసమా లేక తప్పిదమా?
Biker Movie Review - 'బైకర్' రివ్యూ: తండ్రీ కుమారుల కథ ఎలా ఉంది? 'నారీ నారీ...' తర్వాత శర్వానంద్ మరో సక్సెస్ కొట్టారా?
'బైకర్' రివ్యూ: తండ్రీ కుమారుల కథ ఎలా ఉంది? 'నారీ నారీ...' తర్వాత శర్వానంద్ మరో సక్సెస్ కొట్టారా?
Kaleshwaram Politics: కాళేశ్వరంపై రేవంత్ వాదననే వినిపిస్తున్నకేంద్రం - బీఆర్ఎస్‌ ఉక్కిరిబిక్కిరి -ఎదురుదాడి ఎలా?
కాళేశ్వరంపై రేవంత్ వాదననే వినిపిస్తున్నకేంద్రం - బీఆర్ఎస్‌ ఉక్కిరిబిక్కిరి -ఎదురుదాడి ఎలా?
Mrithyunjay OTT : ఆ మర్డర్స్ చేసింది ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్
ఆ మర్డర్స్ చేసింది ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్
Palasa- Ichchapuram: ఉద్దానం ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్‌! దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో పలాస- ఇచ్చాపురం సెక్షన్‌ విలీనం!
ఉద్దానం ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్‌! దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో పలాస- ఇచ్చాపురం సెక్షన్‌ విలీనం!
Embed widget