అన్వేషించండి

Kaleshwaram Project: ఇప్పుడే ఎలా కుంగిపోయింది? కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై విచారణకు రేవంత్ డిమాండ్

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలపై టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Kaleshwaram Project: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ వంతెన కుంగిన ఘటన కలకలం రేపుతోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు బయటపడటం ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు తలనొప్పిని తెచ్చిపెడుతోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని పార్టీలన్నీ ఎప్పటినుంచో ఆరోపిస్తుండగా.. ఇప్పుడు వంతెన కుంగిపోవడంతో విమర్శల దాడి మరింత పెంచారు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పగా కట్టామని ఇంగ్లీష్ పత్రికల్లో కూడా ప్రచారం చేసుకున్న కేసీఆర్.. ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నిస్తోన్నారు.

మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిన ఘటనపై ఆదివారం రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్.. కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ విజిలెన్స్ కూడా దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు వరదలు లేవని, అయినా ఎందుకు కుంగిపోయిందని ప్రశ్నించారు. కాళేశ్వరం డిజైన్ రూపొందించానని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పుకున్నారని, కుంగిన తర్వాత మాత్రం తమకు సంబంధం లేదని అంటున్నారని విమర్శించారు. నాణ్యతలోపం వల్ల మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందని, కేసీఆర్ గొప్ప ఇంజినీరుగా చెప్పుకుని రూ.లక్ష కోట్లు వృథా చేశారని రేవంత్ ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసిపోయాయని, బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయినందునే కాళేశ్వరంపై కేంద్రం స్పందించట్లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాకపోతే కాళేశ్వరంపై కేంద్రం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్బుతమని గొప్పలు చెప్పారని, కేసీఆర్ ధనదాహానికి ఇప్పుడు ప్రాజెక్టు బలైపోయిందన్నారు. వరదలు లేకుండా ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయిందనేది కేసీఆర్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ ఎప్పటినుంచో చెబుతున్నారని, ప్రాజెక్టు డొల్లతనం, నిజస్వరూపం ఇప్పటికైనా బయటపడిందన్నారు.  ఇప్పటికైనా కేంద్రం స్పందించి విచారణ జరిపించాలని కోరుతున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

అటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు అద్బుతమని కేసీఆర్, కేటీఆర్ పదే పదే అన్నారని, గత ఏడాది వరదల్లో పంపుహౌస్‌లు మునిగి భారీగా నష్టం జరిగిందని తెలిపారు. రూ.30 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారని, కేసీఆర్ చేసిన రీడిజైనింగ్ వల్లే కాళేశ్వరం నష్టదాయకంగా మారిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి గుదిబండగా మారిందని, డిజైన్లు తానే రూపొందించానన్న కేసీఆర్.. ఇప్పుడు మాట్లాడరెందుకని ప్రశ్నించారు. అందరూ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు చూడాలంటూ ఆహ్వానించారని, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించాలన్నారు. ప్రాజెక్టులోని లోపాలేంటో తాము చెప్తామని, అద్బుతమేమిటో బీఆర్ఎస్ నేతలు చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఆదేశించాలని గవర్నర్, సీఈసీని కోరుతున్నామన్నారు. నిపుణులతో కూడిన సీవీసీ వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు తెలుస్తాయని, ప్రాజెక్టు వద్దకు ఎవరూ వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. 

కాగా ఎన్నికల వేళ కాళేశ్వరం ప్రాజెక్టులో బయటపడ్డ లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తోన్నాయి. దీని వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో మరింత వ్యతిరేకత వస్తుందని భావిస్తన్నాయి. మరి ప్రతిపక్షాల ఆరోపణలను బీఆర్ఎస్ ఎలా తిప్పికొడుతుందో చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress Internal Rebellion: రేవంత్ రెడ్డి - ప్రత్యర్థులపై బలవంతుడు .. సొంత ఇంట్లో బలహీనుడు !?
రేవంత్ రెడ్డి - ప్రత్యర్థులపై బలవంతుడు .. సొంత ఇంట్లో బలహీనుడు !?
Minister Konda Surekha: కొండా సురేఖ వర్సెస్ కాంగ్రెస్ అగ్రనాయకత్వం - రేవంత్ ఆట ముగిస్తారా!?
కొండా సురేఖ వర్సెస్ కాంగ్రెస్ అగ్రనాయకత్వం - రేవంత్ ఆట ముగిస్తారా!?
Breaking News: బహిరంగ విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలపై కఠిన చర్యలు: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
బహిరంగ విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలపై కఠిన చర్యలు: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
Auto Drivers Strike: తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో ఆటో కార్మికుల సమ్మె విరమణ
తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో ఆటో కార్మికుల సమ్మె విరమణ

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
"నా గొంతు నొక్కేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు" కుటుంబ వివాదాలపై స్పందించిన జోగి రమేష్‌ 
Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
Chennai Suitcase Murder Case: చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
Mahakali Glimpse : పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్
పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్
Triumph Speed 400 కోసం కనీసం ఎంత డౌన్‌పేమెంట్‌ కట్టాలి? ప్రతి నెలా EMI ఎంత పడుతుంది?
కేవలం రూ.29,000కే ట్రయంఫ్ స్పీడ్ 400 మీ సొంతం - ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్లు ఉన్నాయ్‌!
Brydon Carse Arrest: నైట్‌క్లబ్‌లో రచ్చతో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండ‌ర్ అరెస్ట్.. చేతులకు బేడీలతో దొరికిన ప్లేయర్
నైట్‌క్లబ్‌లో రచ్చతో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండ‌ర్ అరెస్ట్.. చేతులకు బేడీలతో దొరికిన ప్లేయర్
Reservation Hatao Andolan: కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
Embed widget