అన్వేషించండి

PV Narasimha Rao: గుండెలు ఉప్పొంగే క్షణం - పీవీకి భారతరత్నపై ప్రముఖుల స్పందన

PV Narasimha Rao: మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వడం పట్ల ప్రముఖులు స్పందించారు.

Bharat Ratna PV Narasimha Rao: తెలుగుజాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని, ఆర్థిక మేధావి, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి వ్యక్తికి భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయం అని కొనియాడారు. ఆయనకు ఈ అత్యున్నత పురస్కారం దక్కడం.. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణం అని అన్నారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎల్ కె అద్వానీ, కర్పూరీ ఠాకూర్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాధన్ కు కూడా భారతరత్న రావడం సంతోషకరం అని అన్నారు.

పీవీకి భారతరత్న ప్రకటించడంపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. పీవీ నరసింహారావు రాజనీతిజ్ఞుడు అని, నైతిక విలువలు కలిగిన పండితుడని గుర్తు చేశారు. ఆయనకు భారతరత్న ఇవ్వడం తెలుగు ప్రజలందరికీ గౌరవం అని అన్నారు. రైతుల కోసం పాటుపడిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కూడా భారతరత్న ప్రదానం చేయడం జాతి గర్వించదగ్గ విషయం అని సీఎం జగన్‌ స్పందించారు.

ఆ సంస్కరణలే నడిపించాయి - చంద్రబాబు
‘‘మాజీ ప్రధాన మంత్రి పీవీకి భారత రత్న ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ గర్వకారణం. ఆయన తిరుగులేని లీడర్, ఆర్థిక వేత్త, రచయిత, రాజనీతిజ్ఞుడు, బహుభాషావేత్త, మానవతావాది. పీవీ నాయకత్వం, మార్గదర్శకత్వం, ఆర్థిక సంస్కరణలు భారతదేశాన్ని కష్ట సమయాల్లో నడిపించాయి. మన గొప్ప దేశాన్ని ప్రపంచ వేదికపై ప్రత్యేకంగా చూపాయి’’ అని చంద్రబాబు స్పందించారు.

మోదీకి ధన్యవాదాలు - కేసీఆర్

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అత్యున్నత జాతీయ పురస్కారం భారత రత్న ప్రకటించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. పీవీకి భారత రత్న పురస్కారం ఇవ్వాలనే ప్రధాని నిర్ణయం తెలంగాణ ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగించింది’’ అని కేసీఆర్ అన్నారు. 

మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా - పురందేశ్వరి
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా దీనిపై స్పందించారు. ‘‘పీవీ నరసింహారావు, ఎంఎస్ స్వామినాథన్ కి మరణానంతరం భారతరత్న ప్రదానం చేశారు. నేను దానిని మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాను’’ అని అన్నారు. నిజమైన రాజనీతిజ్ఞుడు, నేల పుత్రుడు ఈ గౌరవానికి అర్హుడు పీవీ నరసింహారావు అని కొనియాడారు. భారతీయ వ్యవసాయ విధానంలో మెరుగైన ఫలితాలకు స్వామినాథన్ కృషి మరువలేనిదని పురందేశ్వరి అన్నారు. వీరికి భారతరత్న ప్రకటించడం పట్ల ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల సృష్టి కర్త, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహ రావుకి కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించడం పట్ల రాష్ట్ర ఐటి పరిశ్రమలు మరియు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తంచేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Embed widget