అన్వేషించండి

Revanth Reddy: తెలంగాణ మొత్తం హైడ్రా లాంటి వ్యవస్థ, ఇక ఎవ్వరైనా వదలం - రేవంత్ రెడ్డి

Telangana News: మహబూబాబాద్ జిల్లాలో జరిగిన వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా చెరువుల ఆక్రమణల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Revanth Reddy Review on Floods: మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి వరదలపై చేసిన సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైడ్రా తరహాలో ప్రతి జిల్లాలోనూ ఒక వ్యవస్థను కలెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించారు. చెరువులను ఆక్రమించుకోవడం క్షమించరాని నేరం అని.. చెరువుల ఆక్రమణలపైన రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపడతామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆక్రమణలకు పాల్పడినది ఎంతటి వారైనా వదిలి పెట్టబోమని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. చెరువుల ఆక్రమణకు సహకరించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

అమెరికాలో మాజీ మంత్రి జల్సా
చెరువులు, నాలాల ఆక్రమణల జాబితా సిద్దం చేయాలి. మాజీ మంత్రి ఆక్రమణ వల్లనే ఖమ్మంలో వరదలు వచ్చాయనే ఫిర్యాదులు వచ్చాయి. అమెరికాలో జల్సాలో మునిగి తేలుతున్న ఆయన.. ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నడు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా హరీష్ రావు ఖమ్మం పర్యటనకు పోయిండు. ఖమ్మం మాజీ మంత్రి ఆక్రమణలపైన తొలగింపునకు హరీష్ రావు సహకరిస్తారా? 

30 వేల ఎకరాల్లో పంట నష్టం
28 సెంటిమీటర్ల వర్షం కురిసినప్పటికీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. అయినా ప్రాణ నష్టం జరగడం బాధాకరం. జిల్లాలో నలుగురు చనిపోయారు. అందులో ఇద్దరు ఈ జిల్లా వాసులు, మరో ఇద్దరు ఖమ్మం జిల్లా వాసులు ఉన్నారు. మహబూబాబాద్ జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 680 మందికి పునరావాసం కల్పించాం. సీతారామ తండాలో వరద సమయంలో ప్రజలకు అండగా నిలబడ్డ ఎస్సై నగేష్ కి అభినందనలు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తాం. ఆకేరు వాగు వరద బారిన పడుతున్న 3 తండాలను ఒకే ప్రాంతానికి తరలించి అదర్శ కాలనీ నిర్మించాలని కలెక్టర్ కు ఆదేశించాం. పంట నష్టం జరిగిన ప్రతి ఎకరానికి రూ.10 వేల సాయం అందిస్తాం. తెలంగాణలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానికి లేఖ రాశాం. జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి రాష్ట్రానికి రావాలని ప్రధాన మంత్రిని కోరుతున్నాం. 

వరదతో చేరిన బురదను తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. దోమల నివారణ చర్యలు తీసుకోవాలి. నష్టం జరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఇతర ప్రాంతాల నుంచి అధికారులను రప్పించుకోవాలి. కూలిపోయిన విద్యుత్ లైన్లను తక్షణమే పునరుద్దరించాలి. వరద ప్రమాద ప్రాంతాలు, ప్రమాదానికి కారణాలు, వాటిని ఎదుర్కొన్న తీరుపై
బ్లూబుక్ ను తయారు చేసుకోవాలి. వాటిని కలెక్టరేట్లలో ఉంచాలి. 

కేసీఆర్ ఏనాడైనా పరామర్శకు వచ్చారా?
వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ పదేళ్లలో ఎప్పుడైనా పరామర్శకు వచ్చారా..? మాసాయిపేటలో పసిపిల్లలు చనిపోతే కేసీఆర్ పరామర్శించలేదు. హైదరాబాద్ శివారులో పశు వైద్యురాలిని హత్యచేస్తే వెళ్లి చూడలేదు. మానవత్వం లేని మనిషి కేసీఆర్. ప్రతిపక్ష నేత ఎక్కడున్నాడు? ఎందుకు మాట్లాడటం లేదు? స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు వరద బాధితులకు సాయం కోసం ముందుకు రావాలి’’ అని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు.

టాప్ హెడ్ లైన్స్

Gift A Smile KTR Birthday: కేటీఆర్ బర్త్ డే.. గిఫ్ట్ ఏ స్మైల్ - వినూత్నంగా పేద రైతులకు ఇన్సూరెన్స్ చేయించిన ఆదిలాబాద్ బీఆర్ఎస్ నేత
కేటీఆర్ బర్త్ డే.. గిఫ్ట్ ఏ స్మైల్ - వినూత్నంగా పేద రైతులకు ఇన్సూరెన్స్ చేయించిన ఆదిలాబాద్ బీఆర్ఎస్ నేత
Adilabad Job Fraud Case: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget