అన్వేషించండి

Revanth Reddy : చెరువుపక్కన భూమి అప్పగించి నాగార్జున హీరో అయ్యాడు - పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

PJR Flyover: నాగార్జున చెరువు భూమిని ప్రభుత్వానికి అప్పగించారని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన హీరో అయ్యాడన్నారు. పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

CM Revanth reddy: ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను ప్రభుత్వం తొలగించింది..   హీరో నాగార్జున స్వయంగా ఎన్ కన్వెన్షన్ కు చెందిన  రెండెకరాలు అప్పగించి నగరాభివృద్ధి కి సహకరించారని రియల్ హీరో అయ్యారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొండాపూర్  - ఓఆర్ఆర్ ఫ్లైఓవర్ ను ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత ప్రసంగించారు.  

హైదరాబాద్ కు వలస వచ్చిన వారిపై దౌర్జన్యాలు జరిగితే పీజేఆర్ అండగా నిలిచారుని... సీఎల్పీ నేత గా పీజేఆర్ పోరాటం అందరికీ తెలుసన్నారు.   పీజేఆర్ ఇల్లు ఒక జనతా గ్యారేజ్ లా ఉండేదన్నారు.  పీజేఆర్ పోరాటం వల్లనే నగరానికి కృష్ణా జలాలు వచ్చాయని..  నగర ప్రజలు మంచి నీటి అవసరాలు తీరాయంటే అది పీజేఆర్ చలువనే అన్నారు.  హైటెక్ సిటీ మహారాష్ట్ర కు తరలి పోకుండా పీజేఆర్ పోరాటం చేశారన్నారు.  తెలంగాణ లో 65 శాతం ఆదాయం హైదరాబాద్ నగరం నుంచే వస్తుందని..   
హైదరాబాద్ కు ఢిల్లీ,చెన్నై,బెంగళూరు,ముంబై పోటీ కాదు…న్యూయర్,టోక్యో,సింగపూర్ లతో మనం పోటీ పడాలన్నారు.   నగరాభివృద్ధి కి కొందరు అవాంతరాలు,అడ్డంకులు సృష్టిస్తున్నారని.. తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. 

కోర్ అర్బన్ రీజియన్,సేమీ అర్బన్ రీజియన్,రూరల్ తెలంగాణ గా విభజించి ముందుకు అడుగులు వేస్తున్నామని..  ఢిల్లీ నగరం కాలుష్యం కారణంగా నివసించ లేని పరిస్థితిలో ఉందన్నారు.  చెన్నై లో వరద కష్టాలు,బెంగుళూరు లో ట్రాఫిక్ కష్టాలు ఉన్నాయి..  ముంబై,చెన్నై,బెంగళూరు నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలని సూచించారు.  రాజకీయాల ముసుగులో ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకునే వారిని క్షమించ వద్దు..గచ్చిబౌలిలో భూముల్లో ఐటీ కంపెనీలు తీసుకువచ్చి లక్షలాది మంది ఉపాధి కల్పించాలని ప్రయత్నిస్తే అడ్డుకున్నారని మండిపడ్డారు.   గచ్చిబౌలి భూములపైన న్యాయపోరాటం చేసి సాధించుకుని లక్షల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు.  ఎన్ని అవాంతరాలు ఎదురైనా మేం ఆగబోమన్నారు.  

రాబోయే 100 యేళ్లకు సరిపోయేలా నగరాభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.. రోడ్ల వెడల్పు, అండర్ పాస్ లు, ప్లై ఓవర్లు నిర్మించబోతున్నామని తెలిపారు.  డీజిల్ బస్సు ల వల్ల హైదరాబాద్ లో కాలుష్యం పెరుగుతుందని వాటిని జిల్లాలకు తరలించామన్నారు.  నగరంలోకి 3 వేల ఎలక్ట్రిక్ బస్సు లసు తీసుకు వస్తున్నాం.. ఆటో ల కొనుగోలు పైన నిషేధాన్ని తొలగించి ఎలక్ట్రికల్, సీఎన్ జీ ఆటోలకు అనుమతి ఇస్తున్నామన్నారు.  నగరంలో నాలాల కబ్జాల కారణంగా వర్షపు నీరు రోడ్ల పైకి వస్తోంది..  హైడ్రా తో ఆక్రమణలు తొలగిస్తున్నామని గుర్తుచేశారు. 

40 ఏళ్లుగా బీఆర్ఎస్ నాయకుల ఆక్రమణలో ఉన్న బతుకమ్మ కుంట ను అభివృద్ధి చేస్తున్నాం..  డిసెంబర్ 9 లోపు విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేస్తామన్నారు.   30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ ని నిర్మిస్తున్నాం..  ప్రపంచం అంతా భారత్ ఫ్యూచర్ సిటీ వైపు చూస్తోంది.. 2029 లో శేరిలింగంపల్లి నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు విడిపోయే అవకాశం ఉందన్నారు.  మన్మోహన్ సింగ్,  జైపాల్ రెడ్డి వల్ల హైదరాబాద్ కు మెట్రో వచ్చింది.. పీవీ నరసింహారావు వల్ల ఐటీ వచ్చింది.. ప్రధాని మోదీ వల్ల హైదరాబాద్ నగరానికి ఇప్పటివరకు ఏం వచ్చిందో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. బెంగళూరు, చెన్నై, ఏపీ కి మెట్రో రైల్ ఇచ్చారు.. గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు..  గుజరాత్ కు సబర్మతి, ఢిల్లీ కి యమునా, ఉత్తర ప్రదేశ్ కు గంగా ఇచ్చారు..మరీ మన మూసీ రివర్ ఫ్రంట్ కు ఎందుకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 

తెలంగాణ పైన ఎందుకు ఈ వివక్ష ఎందుకో చెప్పాలన్నారు.  అభివృద్ధి లో భేషజాలు లేవు..మీ వెంట వస్తామని స్వయంగా కిషన్ రెడ్డి ఇంటికి వెళ్లి నేను అడిగాను..  నగరానికి వస్తున్న అమిత్ షా ను కలిసి మా మెట్రో కు, త్రిబుల్ ఆర్ కు, మూసీ కి అనుమతులు ఇవ్వాలని కోరతామన్నారు.  మెట్రోలో తెలంగాణ తొమ్మిదో స్థానానికి దిగజారింది.. ఇది కిషన్ రెడ్డి కి కనిపించడం లేదా..?  ఎవరు కుట్ర లు చేస్తున్నారో, ఎవరు అభివృద్ధి చేస్తున్నారో ప్రజలు గమనించాలనికోరారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget