అన్వేషించండి

Revanth On President appointment: రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం తెలంగాణ ప్రజల్ని అవమానించడమే - రేవంత్ కీలక ఆరోపణలు

Telangana CM: రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ దొరకకుండా మోదీ, షా అడ్డుకున్నారని రేవంత్ ఆరోపించారు. ఇలా చేయడం తెలంగాణ ప్రజల్ని అవమానించడమేనన్నారు.

Telangana CM Revanth:   బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను ఆమోదించకుండా అడ్డుకుంటోందని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కోసం అపాయింట్‌మెంట్ కోరినా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒత్తిడి కారణంగా అది దక్కలేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఈ అంశంపై  మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ దొరకకపోవడం తెలంగాణ ప్రజల్ని అవమానించడమేనన్నారు.  బీజేపీ తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ అన్యాయం చేస్తోందని, రిజర్వేషన్ల విషయంలో వితండవాదం చేస్తోందని విమర్శించారు. 

తెలంగాణలో నిర్వహించిన కులగణన సంపూర్ణమైన మరియు పారదర్శకమైన విధానంలో జరిగిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లోపభూయిష్టంగా జరిగిందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు.  కులగణనలో 66.39 లక్షల గ్రామీణ ఇళ్లు,  45.15 లక్షల పట్టణ  ఇళ్ల నుంచి  డేటా సేకరించామన్నారు.  ఈ గణన ఫలితాల ప్రకారం, బీసీలు ముస్లిం బీసీలు మినహా  46.2 శాతం, ముస్లిం బీసీలతో కలిపితే 56 శాతం జనాభాను కలిగి ఉన్నారని తేలిందన్నారు.ఈ డేటా ఆధారంగా 42 శాతం రిజర్వేషన్ల నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. జంతర్ మంతర్ ధర్నాకు రాహుల్ గాంధీ ,  మల్లికార్జున్ ఖర్గే హాజరు కాకపోవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ఖండించారు. రాహుల్ గాంధీ..ఇటీవలే తండ్రిని కోల్పోయిన హేమంత్ సోరెన్ ను పరామర్శించడానికి వెళ్లారని అన్నారు.  కిషన్ రెడ్డి “గల్లీ లీడర్”లా మాట్లాడటం సరికాదని, కులగణన సర్వే గురించి ఆయనకు అనుమానాలు ఉంటే, డేట్, టైమ్, ప్లేస్ ఫిక్స్ చేస్తే అధికారులు ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తారని సవాల్ విసిరారు.

 బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్  శిఖండి పాత్ర పోషిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జంతర్ మంతర్ ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొనకపోవడమే కాక, అవహేళన చేస్తూ మాట్లాడారని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్లను 50 శాతంగా పరిమితం చేసిన చట్టాన్ని రూపొందించిందని, దాన్ని అధిగమించేందుకే తాము ఆర్డినెన్స్ తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాలో  100 మందికి పైగా ఎంపీలు, అలాగే డీఎంకే, ఎన్సీపీ, సమాజవాదీ పార్టీ, లెఫ్ట్ పార్టీలు వంటి ఇండియా కూటమి పార్టీలు మద్దతు ప్రకటించాయని రేవంత్ తెలిపారు. వారందరికీ ధన్యవాదాలుతెలిపారు. 

 రాష్ట్రపతి ఆమోదం ఆలస్యమైతే, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ బిల్లులు ఆమోదం పొందకపోతే, బీజేపీ వెనుకబాటు తరగతులకు వ్యతిరేకమని నిరూపితమవుతుందని ఆయన హెచ్చరించారు. బీజేపీ నాయకుడు ఎన్. రామచందర్ రావు 42 శాతం ఓబీసీ రిజర్వేషన్‌ను సమర్థిస్తూనే, అందులో 10 శాతం ముస్లింలకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ, బీజేపీ ముస్లిం రిజర్వేషన్ల పేరుతో బీసీ కోటాను అడ్డుకుంటోందని ఆరోపించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Modi congratulates Pawan Kalyan: కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
YSRCP Latest News:
"ఇరుసుమండ బ్లో అవుట్ వెనుక కుట్ర- కోట్లు చేతులు మారాయి" వైసీపీ సంచలన ఆరోపణలు 
Bhogi Mantalu 2026: ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
Digital Arrest Scams: డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం

వీడియోలు

Anil Ravipudi on Social Media Trolls | మీమర్స్ ట్రోల్స్ వేసుకుంటే వేసుకోండి..నేను ఎంజాయ్ చేస్తా |ABP
Rohit Sharma Records Ind vs NZ ODI | క్రిస్ గేల్ రికార్డును అధిగమించిన హిట్‌మ్యాన్
RCB vs UP WPL 2026 | ఆర్సీబీ సూపర్ విక్టరీ
Washington Sundar Ruled Out | గాయంతో బాధ‌ప‌డుతున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్
Devdutt Padikkal record in Vijay Hazare Trophy | దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi congratulates Pawan Kalyan: కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
YSRCP Latest News:
"ఇరుసుమండ బ్లో అవుట్ వెనుక కుట్ర- కోట్లు చేతులు మారాయి" వైసీపీ సంచలన ఆరోపణలు 
Bhogi Mantalu 2026: ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
Digital Arrest Scams: డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
Nara Vari Palle Sankranti: ముఖ్యమంత్రి కుటుంబం అంతా నారా వారి పల్లెలోనే - హుషారుగా సంక్రాంతి సంబరాలు !
ముఖ్యమంత్రి కుటుంబం అంతా నారా వారి పల్లెలోనే - హుషారుగా సంక్రాంతి సంబరాలు !
Adilabad Latest News: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
Jaggannathota Prabhala Teertham : సంక్రాంతి సంబరాలకు గోదావరి వెళ్తున్నారా? ఈ వేడుక చూడకుండా అసలు రావద్దు!
సంక్రాంతి సంబరాలకు గోదావరి వెళ్తున్నారా? ఈ వేడుక చూడకుండా అసలు రావద్దు!
PM Modi New Office: త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
Embed widget