అన్వేషించండి

Revanth On President appointment: రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం తెలంగాణ ప్రజల్ని అవమానించడమే - రేవంత్ కీలక ఆరోపణలు

Telangana CM: రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ దొరకకుండా మోదీ, షా అడ్డుకున్నారని రేవంత్ ఆరోపించారు. ఇలా చేయడం తెలంగాణ ప్రజల్ని అవమానించడమేనన్నారు.

Telangana CM Revanth:   బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను ఆమోదించకుండా అడ్డుకుంటోందని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కోసం అపాయింట్‌మెంట్ కోరినా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒత్తిడి కారణంగా అది దక్కలేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఈ అంశంపై  మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ దొరకకపోవడం తెలంగాణ ప్రజల్ని అవమానించడమేనన్నారు.  బీజేపీ తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ అన్యాయం చేస్తోందని, రిజర్వేషన్ల విషయంలో వితండవాదం చేస్తోందని విమర్శించారు. 

తెలంగాణలో నిర్వహించిన కులగణన సంపూర్ణమైన మరియు పారదర్శకమైన విధానంలో జరిగిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లోపభూయిష్టంగా జరిగిందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు.  కులగణనలో 66.39 లక్షల గ్రామీణ ఇళ్లు,  45.15 లక్షల పట్టణ  ఇళ్ల నుంచి  డేటా సేకరించామన్నారు.  ఈ గణన ఫలితాల ప్రకారం, బీసీలు ముస్లిం బీసీలు మినహా  46.2 శాతం, ముస్లిం బీసీలతో కలిపితే 56 శాతం జనాభాను కలిగి ఉన్నారని తేలిందన్నారు.ఈ డేటా ఆధారంగా 42 శాతం రిజర్వేషన్ల నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. జంతర్ మంతర్ ధర్నాకు రాహుల్ గాంధీ ,  మల్లికార్జున్ ఖర్గే హాజరు కాకపోవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ఖండించారు. రాహుల్ గాంధీ..ఇటీవలే తండ్రిని కోల్పోయిన హేమంత్ సోరెన్ ను పరామర్శించడానికి వెళ్లారని అన్నారు.  కిషన్ రెడ్డి “గల్లీ లీడర్”లా మాట్లాడటం సరికాదని, కులగణన సర్వే గురించి ఆయనకు అనుమానాలు ఉంటే, డేట్, టైమ్, ప్లేస్ ఫిక్స్ చేస్తే అధికారులు ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తారని సవాల్ విసిరారు.

 బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్  శిఖండి పాత్ర పోషిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జంతర్ మంతర్ ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొనకపోవడమే కాక, అవహేళన చేస్తూ మాట్లాడారని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్లను 50 శాతంగా పరిమితం చేసిన చట్టాన్ని రూపొందించిందని, దాన్ని అధిగమించేందుకే తాము ఆర్డినెన్స్ తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాలో  100 మందికి పైగా ఎంపీలు, అలాగే డీఎంకే, ఎన్సీపీ, సమాజవాదీ పార్టీ, లెఫ్ట్ పార్టీలు వంటి ఇండియా కూటమి పార్టీలు మద్దతు ప్రకటించాయని రేవంత్ తెలిపారు. వారందరికీ ధన్యవాదాలుతెలిపారు. 

 రాష్ట్రపతి ఆమోదం ఆలస్యమైతే, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ బిల్లులు ఆమోదం పొందకపోతే, బీజేపీ వెనుకబాటు తరగతులకు వ్యతిరేకమని నిరూపితమవుతుందని ఆయన హెచ్చరించారు. బీజేపీ నాయకుడు ఎన్. రామచందర్ రావు 42 శాతం ఓబీసీ రిజర్వేషన్‌ను సమర్థిస్తూనే, అందులో 10 శాతం ముస్లింలకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ, బీజేపీ ముస్లిం రిజర్వేషన్ల పేరుతో బీసీ కోటాను అడ్డుకుంటోందని ఆరోపించారు.

టాప్ హెడ్ లైన్స్

Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
Asifabad News: ఆసిఫాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ
ఆసిఫాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ
Hyderabad Food Adulteration: లొట్టలేసుకుంటూ తింటున్నారా.. హైదరాబాద్‌లో 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్
లొట్టలేసుకుంటూ తింటున్నారా.. హైదరాబాద్‌లో 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Monsoon Foods To Avoid : వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
టైర్‌పై 91, 94, XL అని ఎందుకు ఉంటుంది? టైర్ లోడ్ రేటింగ్ గురించి ప్రతి డ్రైవర్ తెలుసుకోవాల్సిన విషయాలు
మీ కారు టైర్‌పై ఉన్న లోడ్ రేటింగ్‌ను ఎప్పుడైనా గమనించారా? దీని అర్థం తెలిస్తే షాక్ అవుతారు!
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Embed widget