అన్వేషించండి

Revanth Reddy On Banakacharla: చంద్రబాబును భూతంగా చూపించడానికి కేసీఆర్ క్షుద్ర పూజలు - రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Telangana Banakacharla: ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. బనకచర్ల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరగకుండా పోరాడతామన్నారు.

CM Revanth:  బనకచర్ల వివాదంతో చంద్రబాబును భూతంగా చూపించడానికి కేసీఆర్ ఫామ్ హౌస్‌‌లో క్షుద్రపూజలు చేస్తున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. బనకచర్ల అంశంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రానికి "మరణ శాసనం"గా మారాయని ఆరోపించారు. ముఖ్యంగా, కేసీఆర్ మరియు హరీష్ రావు సంతకాలతో ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన ఒప్పందాలు రాష్ట్ర జల వనరులను దెబ్బతీశాయన్నారు. 

రాయలసీమకు నాలుగు వందల టీఎంసీల జలాలను తరలించడానికి 2016లో కేసీఆర్ , చంద్రబాబు మధ్య చర్చలు జరిగాయని.. జగన వచ్చాక పెన్నాకు తరలించడంపై చర్చలు జరిగాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత పోలవరం-బనకచెర్ల ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం గట్టిగా నిలబడిందని, ఈ ప్రాజెక్ట్ గోదావరి నది నీటి వాటాపై తెలంగాణ హక్కులను కాలరాస్తుందని పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ యొక్క ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ (EAC) తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ విజయంగా ఆయన వర్ణించారు.  తెలంగాణ జల హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. గోదావరి నది నీటి వాటాపై ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత బనకచెర్ల ప్రాజెక్ట్‌కు వ్యతిరే కంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో జూన్ 19న ఢిల్లీలో సమావేశమై, ఈ ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలని కోరినట్లు తెలిపారు.                                

గోదావరి నదీ జలాల ఒప్పందం (GWDT-1980)లో వరద నీటి లేదా అదనపు నీటి గురించి ప్రస్తావన లేదని, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాజెక్ట్‌ను ఆధారం చేసుకుని తెలంగాణ హక్కులను కాలరాయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 2016లో కేసీఆర్, హరీష్ రావు చేసుకున్న ఒప్పందాలతోనే  బనకచర్ల ప్రాజెక్టుకు పునాది వేశారని ఇది గోదావరి జలాలను రాయలసీమకు తరలించే ప్రయత్నంగా ఉందని విమర్శించారు.కేసీఆర్‌ను "శకుని మామ"గా, హరీష్ రావును "శనీశ్వరుడు"గా అభివర్ణించారు, ఈ ఇద్దరి నిర్ణయాలు తెలంగాణకు అన్యాయం చేశాయని ఆరోపించారు.   కృష్ణా నదీ జలాల విషయంలో, బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఏకీకృత ఆంధ్రప్రదేశ్‌కు 811 TMC అడుగుల నీటిలో తెలంగాణకు 66% ఉండగా, కేసీఆర్ కేవలం 299 TMC అడుగులకు సంతకం చేశారని, దీనివల్ల తెలంగాణకు 512 TMC నీటిని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చారని ఆరోపించారు.

బనకచర్ల ప్రాజెక్టును తిరస్కరించడం తెలంగాణ ప్రజల విజయమని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర హక్కుల కోసం చేస్తున్న పోరాటానికి నిదర్శనమని రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఈ అంశంపై ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీకి నీటి వివాదంతో ఊపిరి పోసుకుందామని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని రేవంత్ ఆరోపించారు.  అబద్దాలు చెప్పడం వల్లనే 2023లో  ఆ పార్టీ ఓడిపోయిందన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలేదని  .. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అసలు అభ్యర్థులే దొరకలేదన్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget