అన్వేషించండి

Revant Vs TRS : నిన్నటి దాకా టీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యర్థి.. ఇప్పుడు కాంగ్రెస్‌.. ఫలిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ ప్లాన్..!

తెలంగాణ టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని గట్టిగా చెప్పుకునే బీజేపీని కొత్త పీసీసీ చీఫ్ మెల్లగా సైడ్ చేస్తున్నారు. టీఆర్ఎస్‌ను టార్గెట్‌ చేసి.. ఆ పార్టీ ఫోకస్ కాంగ్రెస్‌పైన ఉండేలా చూసుకుంటున్నారు.

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన మొదటి టాస్క్‌ను చాలా సక్సెస్‌ఫుల్‌గా అమల్లో పెట్టేశారు. ఇంద్రవెల్లి సభలో ఆయన టీఆర్ఎస్‌పై చేసిన విమర్శలు.. సీఎం కేసీఆర్‌పై దూకుడుగా అన్న మాటలు ఊహించిన దాని కన్నా ఎక్కువ రియాక్షన్స్ ఇచ్చాయి. చివరికి టీఆర్ఎస్ నేతలు సహనం కోల్పోయి... కాళ్లు , చేతులు నరుకుతాం అనే దాకా వచ్చారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఈ ఎమోషన్‌నే ఆశించారు. ఆ విషయంలో ఆయన సక్సెస్ అయ్యారు. 

నిన్నామొన్నటి వరకూ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరాటం..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చాలా కాలం నుంచి దుర్భర పరిస్థితుల్లో ఉంది.  ఎలాంటి ఎన్నిక జరిగినా కనీసం పోటీలో లేని పరిస్థితి ఉండేది. దానికి కారణం బీజేపీ వ్యూహం. అటు దుబ్బాకలో కానీ.. ఇటు గ్రేటర్ ఎన్నికల్లో కానీ బీజేపీ వ్యూహాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపించదు.. ఆ పార్టీకి సరైన నాయకత్వం లేదు.. బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నట్లుగా ప్రచారం చేశారు. దుబ్బాకలో బీజేపీ ఎప్పుడూ బలంగా లేదు. కానీ అక్కడ టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే ప్రచారాన్ని బలంగా చేయడం... టీఆర్ఎస్ కూడా ఆ పార్టీని టార్గెట్ చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్లిపోయింది. అదే వ్యూహాన్ని గ్రేటర్‌లోనూ అమలు చేశారు. టీఆర్ఎస్‌ను నేరుగా .. దూకుడుగా ఢీకొట్టడంతో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సీన్ మారిపోయింది. ఫలితాలు కూడా అలానే వచ్చాయి. రాజకీయ చిత్రం మెల్లగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. 

ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్..!

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత మొదట ఇదే సమస్యను గుర్తించారు. పరిష్కరించాలని అనుకున్నారు. అప్పట్నుంచి సీన్ ను టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మార్చాలని నిర్ణయిచుకున్నారు. టీఆర్ఎస్ పాలనపై ఘాటుగా విరుచుకుపడుతున్నారు. సీఎం కేసీఆర్‌పై అవసరమైనప్పుడల్లా వ్యక్తిగత విమర్శలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. మొదట్లో టీఆర్ఎస్ పెద్దగా కౌంటర్లు ఇవ్వలేదు కానీ.. ఆయన మాటలు ప్రజల్లోకి బాగా వెళ్తూండటంతో  గట్టిగా కౌంటర్లు ఇవ్వక తప్పడం లేదు. ఇప్పుడు అది తారస్థాయికి చేరింది. రేవంత్ తో.. కాంగ్రెస్‌తో తేల్చుకుంటామని టీఆర్ఎస్ అనే పరిస్థితి వచ్చింది. 

బీజేపీని వ్యూహాత్మకంగా  లైట్ తీసుకుంటున్న రేవంత్..! 

రేవంత్ వ్యూహాత్మకంగా బీజేపీని సైడ్ చేస్తున్నారు. ఆ పార్టీపై పెద్దగా విమర్శలు చేయడం లేదు. దీనికి కారణం ఆ పార్టీకి అనవసరంగా ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండటమేనని అంచనా వేస్తున్నారు. రాజకీయం మొత్తం టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా సాగితే... టీఆర్ఎస్ ప్రత్యామ్నాయాన్ని ప్రజలు కాంగ్రెస్‌లో చూస్తారని ..అప్పుడు బీజేపీకి కనీస ఓటు బ్యాంక్ కూడా ఉండదని విశ్లేషిస్తున్నారు. అందుకే  ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సభలో బీజేపీపై కనీస విమర్శలు కూడా రేవంత్ రెడ్డి చేయలేదు. బీజేపీతో కుమ్మక్కయ్యారని కొంతమంది విమర్శలు చేయవచ్చు కానీ.. రేవంత్ రెడ్డి మాత్రం వ్యూహాత్మకంగా బీజేపీని సైడ్ చేస్తున్నారనేది అసలు రాజకీయం అని భావిస్తున్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget