అన్వేషించండి

Money Sieze: పోలీస్ తనిఖీల్లో నగదు సీజ్ చేశారా.? - ఆధారాలు సమర్పిస్తే 48 గంటల్లో డబ్బు వాపస్

Money Sieze: తెలంగాణలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు భారీగా నగదు సీజ్ చేస్తున్నారు. అయితే, సరైన పత్రాలు చూపించి 48 గంటల్లోనే మీ సొమ్ము తిరిగి తీసుకోవచ్చని ఈసీ పేర్కొంది.

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. సరైన పత్రాలు లేని అక్రమ నగదు, బంగారాన్ని భారీగా సీజ్ చేస్తున్నారు. ఎవరి వద్దనైనా రూ.50 వేలకు పైగా నగదు, 10 గ్రాములకు పైగా బంగారం కనిపిస్తే స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే, ఈ తనిఖీలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సంఘం, పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈసీ స్పందించింది. బాధితులు సదరు సొమ్మును తిరిగి పొందేందుకు ప్రతి జిల్లాలోనూ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసింది. పోలీసుల తనిఖీల్లో చిక్కిన నగదు, బంగారు ఆభరణాల యజమానులు ఈ సెల్ ఛైర్మన్ ను సంప్రదించి సరైన ఆధారాలు సమర్పిస్తే 48 గంటల్లోనే మీ నగదును తిరిగి ఇచ్చేస్తారు. అయితే, వీటి విలువ రూ.10 లక్షల్లోపు మాత్రమే ఉండాలి. అంతకు మించితే ఆదాయపు పన్ను శాఖ అధికారులకు వివరాలు వెల్లడించాలి. వారు చట్టపరమైన అంశాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్ సెల్ లో రోజుకు పదికి పైగా సమస్యలను అధికారులు పరిష్కరిస్తున్నారు.

డబ్బులు ఇలా తిరిగి పొందండి

  •  తనిఖీల్లో మీ బంగారం, నగదును పోలీసులు పట్టుకుంటే సంబంధిత ఠాణాలో భద్రపరిచి కేసు నమోదు చేస్తారు. ఆ సమాచారాన్ని సంబంధిత యజమానులకు తెలియజేస్తారు. 
  • ఈ వివరాలను సంబంధిత నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్, ఆదాయపు పన్ను అధికారులకు పంపిస్తారు.
  • వీటిని తిరిగి పొందాలనుకునేవారు పోలీస్ కేసు వివరాల పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో చూపించాలి. అక్కడి అధికారులు గ్రీవెన్స్ సెల్ కు బదిలీ చేస్తారు. 
  • అనంతరం కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్ ను కలిస్తే కేసు వివరాలు, ఆధారాలు స్వీకరిస్తారు. దీనికి సంబంధించిన ఓ రశీదు ఇస్తారు. అనంతరం తమ సెల్ అధికారులు ఫోన్ చేసినప్పుడు రావాలని సూచిస్తారు.
  • 48 గంటల్లోపు సదరు బాధితులను పిలిచి వారు సమర్పించిన ఆధారాలను పూర్తిగా పరిశీలిస్తారు. అన్నీ సరిగ్గా ఉంటే రిటర్నింగ్ అధికారికి వివరాలు తెలియజేస్తారు.
  • ఈ మేరకు రిటర్నింగ్ అధికారి సీజ్ చేసిన సొమ్మును తిరిగిచ్చేయాలని సంబంధిత ఠాణాకు ఆదేశాలిస్తారు. బాధితులు అక్కడికి వెళ్లి మీ నగదు తీసుకోవాల్సి ఉంటుంది.
  • అయితే, ఎన్నికల కోడ్ నేపథ్యంలో రూ.50 వేల కన్నా ఎక్కువ నగదును ప్రజలు తమ వెంట తీసుకెళ్లొద్దని, అత్యవసరమై తీసుకెళ్లాల్సి వస్తే తగిన ఆధారాలు, సరైన పత్రాలు వెంట ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

రూ.243 కోట్లకు పైగా సొత్తు స్వాధీనం

మరోవైపు, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రూ.243 కోట్లకు పైగా విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2018 ఎన్నికల్లో మొత్తంగా రూ.103 కోట్ల విలువైన నగదు సీజ్ చేయగా, ఈసారి కేవలం 10 రోజుల్లోనే అంతకు రెట్టింపు సొమ్ము పట్టుకోవడం గమనార్హం. గురువారం ఒక్క రోజే తనిఖీల్లో రూ.78.03 కోట్ల సొత్తు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో రూ.120.40 కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువులు పట్టుబడ్డాయి. గత 24 గంటల్లో 83 కిలోల బంగారం, 213 కిలోల వెండి, 113 క్యారెట్ల వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget