అన్వేషించండి

BRS Meeting: మరాఠా గడ్డమీద మరో సభకు ప్లాన్ చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరబోతున్న మరాఠా నేతలు

నాందేడ్‌ సభ తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ మరో సభను మరాఠా గడ్డమీద తలపెట్టాలని నిర్ణయించింది. నాందేడ్ సభ సక్సెస్ కావడంతో అదే ఊపులో మరో సభకు ప్లాన్ చేశారు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌. ఈసారి కంధర్ లోహ ఏరియాలో సభ ఉంటుందని పార్టీ తెలిపింది. ఈ నెల 26న డేట్ ఫిక్స్ చేశారు. ఈసారి కూడా నాందేడ్ జిల్లాలోనే ప్లాన్ చేశారు. కంధర్ లోహ అసెంబ్లీ నియోజకవర్గంలో సభ ఉంటుందని, ఈ సందర్భంగా మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉంటాయని పార్టీ తెలిపింది.

జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది! ఖమ్మం డిక్లరేషన్ తర్వాత మొదటిసారిగా తెలంగాణ వెలుపల మరాఠా గడ్డమీద శంఖారావం పూరించారు ఆ పార్టీ అధినేత కేసీఆర్! ఫిబ్రవరి మొదటివారంలో జరిగిన ఈ మీటింగ్‌ని పార్టీ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. రెండో  మీటింగ్‌ని కూడా సరిహద్ధున ఉన్న మరాఠా జిల్లాలోనే పెట్టాలని నిర్ణయించారు. మరికొంతమంది మరాఠా నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకే ఈ బహిరంగసభను తలపెట్టారని తెలుస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రలోనే రెండో సభను జరపాలనే నిర్ణయం వెనుక కేసీఆర్ వ్యూహంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.    

ఈ క్రమంలో మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపి)కి చెందిన పలువురు సీనియర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరేందుకు ముందుకు  వచ్చారు.  మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపి కిసాన్ సెల్ అధ్యక్షుడు శంకరన్న ధోంగే, మాజీ ఎమ్మెల్యే నాగనాథ్ గిసేవాడ్ పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశాడు. నాగనాథ్‌- భోకర్ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం అశోక్ చౌహాన్ మీద వెయ్యి వోట్ల  తేడాతో  ఓడిపోయాడు. మరో ఎన్సీపీ నాందేడ్ జిల్లా అధ్యక్షుడు దత్తా పవార్, మహారాష్ట్ర ఎన్సీపి యూత్ సెక్రటరీ శివరాజ్ ధోంగే, శివదాస్ ధర్మపురికర్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు మనోహర్ పాటిల్ భోసికర్, ఎన్సీపి అధికార ప్రతినిధి డాక్టర్ సునీల్ పాటిల్, ఎన్సీపి లోహ అధ్యక్షుడు సుభాష్ వాకోరే, ఎన్సీపి కంధర్ నియోజకవర్గ అధ్యక్షుడు దత్తా కరమాంగే, జిల్లా పరిషత్ సభ్యులు అడ్వొకేట్ విజయ్ ధోండగే, ఎన్సీపి యూత్ ప్రెసిడెంట్ హన్మంత్ కళ్యాంకర్, ప్రవీణ్ జాతేవాడ్, సంతోష్ వార్కాడ్, స్వాప్నిల్ ఖీరే  తదితరులు సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి సీఎం కేసీఆర్ తో సుదీర్ఘంగా చర్చించారు. భారీ  బహిరంగ సభ నేపథ్యంలో పెద్ద ఎత్తున తమ అనుచరులు, కార్యకర్తలతో పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.

నాందేడ్ సభకంటే ముందు జనవరి నెలలో ఒడిషా నేతలు బస్సుల్లో తరలివచ్చి కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. మాజీ సీఎం గిరిధర్‌ గమాంగ్‌తో పాటు ఆయన కుమారుడు శిశిర్‌ గమాంగ్‌, భార్య హేమ గమాంగ్‌ కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. వారితో పాటు ఒడిషా మాజీమంత్రి జయరాం పాంగి, మాజీ ఎమ్మెల్యే నబిన్ నందా సహా మొత్తం 12 మంది మాజీ శాసనసభ్యులు, నలుగురు మాజీ ఎంపీలు పార్టీలో చేరారు. మహారాష్ట్ర సహా, ఉత్తర భారత ప్రజలు తమ పార్టీ విధానాలను అర్థం చేసుకున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.    

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Crime News: మహా కుంభమేళా యాత్రలో తీవ్ర విషాదం, రోడ్డు ప్రమాదంలో 7 మంది ఏపీ వాసులు మృతి
Crime News: మహా కుంభమేళా యాత్రలో తీవ్ర విషాదం, రోడ్డు ప్రమాదంలో 7 మంది ఏపీ వాసులు మృతి
Ramarajyam Raghav Reddy: చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన
చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన "రామరాజ్యం " రాఘవ రెడ్డి, అతడి లక్ష్యం ఇదే!
Rana Daggubati: తెలుగులో రిలీజ్ కాని రానా దగ్గుబాటి మూవీ... సమంత నటించిన ఆ ఫ్లాప్ సినిమా పేరేంటో తెలుసా?
తెలుగులో రిలీజ్ కాని రానా దగ్గుబాటి మూవీ... సమంత నటించిన ఆ ఫ్లాప్ సినిమా పేరేంటో తెలుసా?
New Ration Cards: మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Attack on Chilkur Balaji Temple Rangarajan | రామరాజ్యం స్థాపించటానికి వచ్చాం అంటూ దాడి | ABP DesamVishwak sen on Prudhviraj Controversy | 11 గొర్రెలు కాంట్రవర్సీపై విశ్వక్ సారీ | ABP DesamAllu Aravind on Ram Charan | రామ్ చరణ్ పై వ్యాఖ్యల వివాదం మీద అల్లు అరవింద్ | ABP DesamPresident Murmu in Maha kumbh 2025 | మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Crime News: మహా కుంభమేళా యాత్రలో తీవ్ర విషాదం, రోడ్డు ప్రమాదంలో 7 మంది ఏపీ వాసులు మృతి
Crime News: మహా కుంభమేళా యాత్రలో తీవ్ర విషాదం, రోడ్డు ప్రమాదంలో 7 మంది ఏపీ వాసులు మృతి
Ramarajyam Raghav Reddy: చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన
చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన "రామరాజ్యం " రాఘవ రెడ్డి, అతడి లక్ష్యం ఇదే!
Rana Daggubati: తెలుగులో రిలీజ్ కాని రానా దగ్గుబాటి మూవీ... సమంత నటించిన ఆ ఫ్లాప్ సినిమా పేరేంటో తెలుసా?
తెలుగులో రిలీజ్ కాని రానా దగ్గుబాటి మూవీ... సమంత నటించిన ఆ ఫ్లాప్ సినిమా పేరేంటో తెలుసా?
New Ration Cards: మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Allu Aravind: 'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
Brahma Anandam Trailer: ప్రభాస్ వదిలిన ‘బ్రహ్మా ఆనందం’ ట్రైలర్... తండ్రీకొడుకులు, తాతామనవళ్లులా ఏడిపించేశారు కదయ్యా!
ప్రభాస్ వదిలిన ‘బ్రహ్మా ఆనందం’ ట్రైలర్... తండ్రీకొడుకులు, తాతామనవళ్లులా ఏడిపించేశారు కదయ్యా!
Chilkuru Balaji Rangarajan Attack case: చిలుకూరు అర్చకులు రంగరాజన్‌పై దాడి, ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
చిలుకూరు అర్చకులు రంగరాజన్‌పై దాడి, ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Embed widget