అన్వేషించండి

BRS MLC Kavitha: పసుపు బోర్డును స్వాగతించిన ఎమ్మెల్సీ కవిత, గాలి మాటలు మానేయాలని ఎంపీ అర్వింద్‌కు చురకలు

Nizamabad News | పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతించిన ఎమ్మెల్సీ కవిత మద్దతు ధర రూ.15 వేలు ప్రకటించడంతో పాటు దిగుమతులపై ఆంక్షలు విదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Nizamabad Turmeric Board | నిజామాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతించారు. క్వింటాలు పసుపుకు రూ. 15 వేల కనీస మద్ధతు ధర ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. పసుపు దిగుమతులపై నియంత్రణ విధించాలని, మరోవైపు మద్దతు ధర పెంచాలి. ఈ రెండు జరిగినప్పుడే పసుపు బోర్డుకు సార్థకత వస్తుంది. అప్పుడే పసుపు రైతులకు సంపూర్ణ న్యాయం లభిస్తుందన్నారు. ఏదో తూతూమంత్రంగా పసుపు బోర్డును ఏర్పాటు చేయడం సరికాదని, వారికి తగిన సౌకర్యాలు, పరిశోధన సమర్థ్యాన్ని సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

మేం ఒత్తిడి తెచ్చినందుకే పసుపు బోర్డు

స్పైసిస్ బోర్డు కాదు, మాకు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. పసుపు బోర్డు కావాలని డిమాండ్ చేసినప్పుడు బీజేపీ ఎంపీ అర్వింద్ అప్పుడు రాజకీయాల్లో కూడా లేరని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. పసుపు బోర్డు Turmeric Board) ఏర్పాటు ప్రకటించిన విధానంపై అభ్యంతరాలున్నాయి. పసుపు బోర్డు ప్రారంభోత్సవాన్ని కేవలం బీజేపీ కార్యక్రమంలా చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను కార్యక్రమానికి ఆహ్వానించలేదు. కనీసం ప్రొటొకాల్ ను పాటించలేదు. ఇది ప్రభుత్వ నియమనిబంధనలకు పూర్తి విరుద్ధం. కేవలం బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీ వేదికమీద కూర్చొని ప్రారంభించుకున్నారు. కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోవడం బాధాకరం. 

2014లో నేను ఎంపీగా ఎన్నికైన నెల రోజుల్లోనే పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని అప్పటి వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశాను. దీనిపై మద్దతు కోరుతూ పలువురు ముఖ్యమంత్రులను కలిసి వారి నుంచి లేఖలు సేకరించాను. ప్రధాని నరేంద్ర మోదీని రెండు సార్లు కలిసి బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశా. పార్లమెంటులో పలుమార్లు మాట్లాడడమే కాకుండా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టాను. అయితే కేవలం పసుపు బోర్డు ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా కనీస మద్ధతు ధరను ప్రకటించాలి. పసుపు దిగుమతులపై నియంత్రణ విధించాలని కేంద్రానికి వినతులు అందించా. ఇలా గతంలో నేను త్రిముఖ వ్యూహంతో అలుపెరగని పోరాటం చేశానని’ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.

పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి పెంచుతూనే, పసుపు ఆధారిత పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించాం. ఇతర దేశాల నుంచి నాణ్యతలేని పసుపు దిగుమతి వల్ల మన రైతులు నష్టపోతున్నారు. కనుక దిగుమతులను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. 2014లో 8 లక్లల క్వింటాళ్లు దిగుమతి కాగా,  ఇప్పుడు రెట్టింపు అయింది. దిగుమతులు పెరుగుతున్నా మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కవిత విమర్శించారు.

Also Read: BRS Supreme Court: ఇంకా ఎమ్మెల్యేలు పార్టీ మారకుండానే సుప్రీంకోర్టులో పిటిషన్ - బీఆర్ఎస్ వ్యూహం ఇదే !

బెంజ్ కారు కొంటే అంబాసిడర్ ఎందుకిచ్చారు ?

బీజేపీ ఎంపీ అర్వింద్ పై ఎమ్మెల్సీ కవిత విరుచుకుపడ్డారు. గాలి మాటలు మాట్లాడడం మానేసి పసుపుకు మద్ధతు ధర సాధించాలని ఎంపీకి సూచించారు. స్పైసెస్ బోర్డు బెంజ్ కారు లాంటిదని, పసుపు బోర్డు అంబాసిడర్ కారు అని అర్వింద్ గతంలో అన్నారు. మరి పసుపును అంత అవహేళన చేసిన అర్వింద్ కు ఇప్పుడు పసుపు బోర్డు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. మేం పసుపు బోర్డు డిమాండ్ చేసే నాటికి అర్వింద్ అసలు రాజకీయాల్లోకి రాలేదని, కాంగ్రెస్ పార్టీలో తండ్రిచాటు బిడ్డగా ఉన్నారని విమర్శించారు. “ఎంపీగా గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ పై రాసిచ్చిన అర్వింద్... గెలిచిన తర్వాత పసుపు బోర్డు కంటే స్పైసెస్ బోర్డే బెటర్ అన్నారు. స్పైసెస్ బోర్డు బెంజ్ కారు అని, పసుపు బోర్డు అంబాసిడర్ కారు అనడంపై ఎద్దేవా చేశారు. ఒకవేళ బెంజ్ కారు ఉంటే... అంబాసిడర్ కారు ఎందుకు ఇచ్చారు? ఎంపీ అర్వింద్ గాలి మాటలు మానేసి, మద్దతు ధర సాధించాలని కవిత సూచించారు.

 

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kashmir Terror Attack: కశ్మీర్‌లో ఉగ్ర దాడి - టూరిస్టులపై కాల్పులు - ఒకరి మృతి
కశ్మీర్‌లో ఉగ్ర దాడి - టూరిస్టులపై కాల్పులు - ఒకరి మృతి
Glod Price Rs 1 Lakh: బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
UPSC Results : యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
Singer Sunitha: నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Gujarat Titans Winning Strategy IPL 2025 | టాప్ లో ఉంటే చాలు..ఇంకేం అవసరం లేదంటున్న గుజరాత్ టైటాన్స్Trolling on Ajinkya Rahane vs GT IPL 2025 | బ్యాటర్ గా సక్సెస్..కెప్టెన్ గా ఫెయిల్..?GT vs KKR IPL 2025 Match Review | డిఫెండింగ్ ఛాంపియన్ దమ్ము చూపించలేకపోతున్న KKRSai Sudharsan 52 vs KKR IPL 2025 | నిలకడకు మారు పేరు..సురేశ్ రైనా ను తలపించే తీరు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kashmir Terror Attack: కశ్మీర్‌లో ఉగ్ర దాడి - టూరిస్టులపై కాల్పులు - ఒకరి మృతి
కశ్మీర్‌లో ఉగ్ర దాడి - టూరిస్టులపై కాల్పులు - ఒకరి మృతి
Glod Price Rs 1 Lakh: బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
UPSC Results : యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
Singer Sunitha: నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
IPS PSR Anjaneyulu arrested: నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
Musical horn: భారతీయ సంగీతంలోకి వాహనాల హార్న్ - గడ్కరీ వినూత్న ఆలోచన -ఇంటర్నెట్ బ్లాస్ట్
భారతీయ సంగీతంలోకి వాహనాల హార్న్ - గడ్కరీ వినూత్న ఆలోచన -ఇంటర్నెట్ బ్లాస్ట్
Mahesh Babu: మహేష్ బాబు వెనుక డైనోసార్లు పరిగెడితే... మైండ్ బ్లాక్ అయ్యేలా రాజమౌళి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్!
మహేష్ బాబు వెనుక డైనోసార్లు పరిగెడితే... మైండ్ బ్లాక్ అయ్యేలా రాజమౌళి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్!
Inter Results: నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Embed widget