అన్వేషించండి

BRS MLC Kavitha: పసుపు బోర్డును స్వాగతించిన ఎమ్మెల్సీ కవిత, గాలి మాటలు మానేయాలని ఎంపీ అర్వింద్‌కు చురకలు

Nizamabad News | పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతించిన ఎమ్మెల్సీ కవిత మద్దతు ధర రూ.15 వేలు ప్రకటించడంతో పాటు దిగుమతులపై ఆంక్షలు విదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Nizamabad Turmeric Board | నిజామాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతించారు. క్వింటాలు పసుపుకు రూ. 15 వేల కనీస మద్ధతు ధర ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. పసుపు దిగుమతులపై నియంత్రణ విధించాలని, మరోవైపు మద్దతు ధర పెంచాలి. ఈ రెండు జరిగినప్పుడే పసుపు బోర్డుకు సార్థకత వస్తుంది. అప్పుడే పసుపు రైతులకు సంపూర్ణ న్యాయం లభిస్తుందన్నారు. ఏదో తూతూమంత్రంగా పసుపు బోర్డును ఏర్పాటు చేయడం సరికాదని, వారికి తగిన సౌకర్యాలు, పరిశోధన సమర్థ్యాన్ని సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

మేం ఒత్తిడి తెచ్చినందుకే పసుపు బోర్డు

స్పైసిస్ బోర్డు కాదు, మాకు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. పసుపు బోర్డు కావాలని డిమాండ్ చేసినప్పుడు బీజేపీ ఎంపీ అర్వింద్ అప్పుడు రాజకీయాల్లో కూడా లేరని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. పసుపు బోర్డు Turmeric Board) ఏర్పాటు ప్రకటించిన విధానంపై అభ్యంతరాలున్నాయి. పసుపు బోర్డు ప్రారంభోత్సవాన్ని కేవలం బీజేపీ కార్యక్రమంలా చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను కార్యక్రమానికి ఆహ్వానించలేదు. కనీసం ప్రొటొకాల్ ను పాటించలేదు. ఇది ప్రభుత్వ నియమనిబంధనలకు పూర్తి విరుద్ధం. కేవలం బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీ వేదికమీద కూర్చొని ప్రారంభించుకున్నారు. కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోవడం బాధాకరం. 

2014లో నేను ఎంపీగా ఎన్నికైన నెల రోజుల్లోనే పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని అప్పటి వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశాను. దీనిపై మద్దతు కోరుతూ పలువురు ముఖ్యమంత్రులను కలిసి వారి నుంచి లేఖలు సేకరించాను. ప్రధాని నరేంద్ర మోదీని రెండు సార్లు కలిసి బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశా. పార్లమెంటులో పలుమార్లు మాట్లాడడమే కాకుండా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టాను. అయితే కేవలం పసుపు బోర్డు ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా కనీస మద్ధతు ధరను ప్రకటించాలి. పసుపు దిగుమతులపై నియంత్రణ విధించాలని కేంద్రానికి వినతులు అందించా. ఇలా గతంలో నేను త్రిముఖ వ్యూహంతో అలుపెరగని పోరాటం చేశానని’ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.

పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి పెంచుతూనే, పసుపు ఆధారిత పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించాం. ఇతర దేశాల నుంచి నాణ్యతలేని పసుపు దిగుమతి వల్ల మన రైతులు నష్టపోతున్నారు. కనుక దిగుమతులను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. 2014లో 8 లక్లల క్వింటాళ్లు దిగుమతి కాగా,  ఇప్పుడు రెట్టింపు అయింది. దిగుమతులు పెరుగుతున్నా మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కవిత విమర్శించారు.

Also Read: BRS Supreme Court: ఇంకా ఎమ్మెల్యేలు పార్టీ మారకుండానే సుప్రీంకోర్టులో పిటిషన్ - బీఆర్ఎస్ వ్యూహం ఇదే !

బెంజ్ కారు కొంటే అంబాసిడర్ ఎందుకిచ్చారు ?

బీజేపీ ఎంపీ అర్వింద్ పై ఎమ్మెల్సీ కవిత విరుచుకుపడ్డారు. గాలి మాటలు మాట్లాడడం మానేసి పసుపుకు మద్ధతు ధర సాధించాలని ఎంపీకి సూచించారు. స్పైసెస్ బోర్డు బెంజ్ కారు లాంటిదని, పసుపు బోర్డు అంబాసిడర్ కారు అని అర్వింద్ గతంలో అన్నారు. మరి పసుపును అంత అవహేళన చేసిన అర్వింద్ కు ఇప్పుడు పసుపు బోర్డు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. మేం పసుపు బోర్డు డిమాండ్ చేసే నాటికి అర్వింద్ అసలు రాజకీయాల్లోకి రాలేదని, కాంగ్రెస్ పార్టీలో తండ్రిచాటు బిడ్డగా ఉన్నారని విమర్శించారు. “ఎంపీగా గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ పై రాసిచ్చిన అర్వింద్... గెలిచిన తర్వాత పసుపు బోర్డు కంటే స్పైసెస్ బోర్డే బెటర్ అన్నారు. స్పైసెస్ బోర్డు బెంజ్ కారు అని, పసుపు బోర్డు అంబాసిడర్ కారు అనడంపై ఎద్దేవా చేశారు. ఒకవేళ బెంజ్ కారు ఉంటే... అంబాసిడర్ కారు ఎందుకు ఇచ్చారు? ఎంపీ అర్వింద్ గాలి మాటలు మానేసి, మద్దతు ధర సాధించాలని కవిత సూచించారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Nirmal Supari Murder Case: సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Second Marriage OTT : ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - రియల్‌ రోడ్‌ టెస్ట్‌లో ఏ కారు పికప్‌ చూపించింది?
Embed widget