అన్వేషించండి

BRS MLC Kavitha: పసుపు బోర్డును స్వాగతించిన ఎమ్మెల్సీ కవిత, గాలి మాటలు మానేయాలని ఎంపీ అర్వింద్‌కు చురకలు

Nizamabad News | పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతించిన ఎమ్మెల్సీ కవిత మద్దతు ధర రూ.15 వేలు ప్రకటించడంతో పాటు దిగుమతులపై ఆంక్షలు విదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Nizamabad Turmeric Board | నిజామాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతించారు. క్వింటాలు పసుపుకు రూ. 15 వేల కనీస మద్ధతు ధర ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. పసుపు దిగుమతులపై నియంత్రణ విధించాలని, మరోవైపు మద్దతు ధర పెంచాలి. ఈ రెండు జరిగినప్పుడే పసుపు బోర్డుకు సార్థకత వస్తుంది. అప్పుడే పసుపు రైతులకు సంపూర్ణ న్యాయం లభిస్తుందన్నారు. ఏదో తూతూమంత్రంగా పసుపు బోర్డును ఏర్పాటు చేయడం సరికాదని, వారికి తగిన సౌకర్యాలు, పరిశోధన సమర్థ్యాన్ని సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

మేం ఒత్తిడి తెచ్చినందుకే పసుపు బోర్డు

స్పైసిస్ బోర్డు కాదు, మాకు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. పసుపు బోర్డు కావాలని డిమాండ్ చేసినప్పుడు బీజేపీ ఎంపీ అర్వింద్ అప్పుడు రాజకీయాల్లో కూడా లేరని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. పసుపు బోర్డు Turmeric Board) ఏర్పాటు ప్రకటించిన విధానంపై అభ్యంతరాలున్నాయి. పసుపు బోర్డు ప్రారంభోత్సవాన్ని కేవలం బీజేపీ కార్యక్రమంలా చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను కార్యక్రమానికి ఆహ్వానించలేదు. కనీసం ప్రొటొకాల్ ను పాటించలేదు. ఇది ప్రభుత్వ నియమనిబంధనలకు పూర్తి విరుద్ధం. కేవలం బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీ వేదికమీద కూర్చొని ప్రారంభించుకున్నారు. కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోవడం బాధాకరం. 

2014లో నేను ఎంపీగా ఎన్నికైన నెల రోజుల్లోనే పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని అప్పటి వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశాను. దీనిపై మద్దతు కోరుతూ పలువురు ముఖ్యమంత్రులను కలిసి వారి నుంచి లేఖలు సేకరించాను. ప్రధాని నరేంద్ర మోదీని రెండు సార్లు కలిసి బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశా. పార్లమెంటులో పలుమార్లు మాట్లాడడమే కాకుండా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టాను. అయితే కేవలం పసుపు బోర్డు ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా కనీస మద్ధతు ధరను ప్రకటించాలి. పసుపు దిగుమతులపై నియంత్రణ విధించాలని కేంద్రానికి వినతులు అందించా. ఇలా గతంలో నేను త్రిముఖ వ్యూహంతో అలుపెరగని పోరాటం చేశానని’ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.

పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి పెంచుతూనే, పసుపు ఆధారిత పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించాం. ఇతర దేశాల నుంచి నాణ్యతలేని పసుపు దిగుమతి వల్ల మన రైతులు నష్టపోతున్నారు. కనుక దిగుమతులను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. 2014లో 8 లక్లల క్వింటాళ్లు దిగుమతి కాగా,  ఇప్పుడు రెట్టింపు అయింది. దిగుమతులు పెరుగుతున్నా మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కవిత విమర్శించారు.

Also Read: BRS Supreme Court: ఇంకా ఎమ్మెల్యేలు పార్టీ మారకుండానే సుప్రీంకోర్టులో పిటిషన్ - బీఆర్ఎస్ వ్యూహం ఇదే !

బెంజ్ కారు కొంటే అంబాసిడర్ ఎందుకిచ్చారు ?

బీజేపీ ఎంపీ అర్వింద్ పై ఎమ్మెల్సీ కవిత విరుచుకుపడ్డారు. గాలి మాటలు మాట్లాడడం మానేసి పసుపుకు మద్ధతు ధర సాధించాలని ఎంపీకి సూచించారు. స్పైసెస్ బోర్డు బెంజ్ కారు లాంటిదని, పసుపు బోర్డు అంబాసిడర్ కారు అని అర్వింద్ గతంలో అన్నారు. మరి పసుపును అంత అవహేళన చేసిన అర్వింద్ కు ఇప్పుడు పసుపు బోర్డు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. మేం పసుపు బోర్డు డిమాండ్ చేసే నాటికి అర్వింద్ అసలు రాజకీయాల్లోకి రాలేదని, కాంగ్రెస్ పార్టీలో తండ్రిచాటు బిడ్డగా ఉన్నారని విమర్శించారు. “ఎంపీగా గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ పై రాసిచ్చిన అర్వింద్... గెలిచిన తర్వాత పసుపు బోర్డు కంటే స్పైసెస్ బోర్డే బెటర్ అన్నారు. స్పైసెస్ బోర్డు బెంజ్ కారు అని, పసుపు బోర్డు అంబాసిడర్ కారు అనడంపై ఎద్దేవా చేశారు. ఒకవేళ బెంజ్ కారు ఉంటే... అంబాసిడర్ కారు ఎందుకు ఇచ్చారు? ఎంపీ అర్వింద్ గాలి మాటలు మానేసి, మద్దతు ధర సాధించాలని కవిత సూచించారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Venezuela : వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
Hyundai Creta నుంచి Tata Sierra వరకు - కొత్త Seltos ముందు బలంగా నిలబడే కారు ఏది?
కొత్త Kia Seltos - ధర, స్పెసిఫికేషన్లలో ఇతర కార్ల కంటే బెటర్‌గా ఉందా?
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Embed widget