అన్వేషించండి

Nizamabad News : ఎల్లారెడ్డిలో అభ్యర్థులు రెడీ - ఏ పార్టీ తరపున పోటీ చేస్తారో మాత్రం సీక్రెట్ !

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో హీటెక్కుతున్న పాలిటిక్స్. కాంగ్రెస్ పార్టీలో ట్రయాంగిల్ వార్. బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థిపై ఇంకా నో క్లారిటీ.. ఈ సారి గెలుపెవరిది ?

Nizamabad News :  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పొలిటికల్ హీట్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది.  ఇంకా సాధారణ ఎన్నికలకు 6 నెలల గడువు ఉండటంతో.. ఇప్పటి నుంచే బరిలోకి నిలవాలనుకుంటున్న అభ్యర్థులు చాప కింద నీరులా తమ పని చక్కబెట్టుకుంటున్నారు.  గత ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జాజుల సురేందర్ గెలుపోందారు. ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాల్లో 8 అప్పటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే... కాంగ్రెస్ నుంచి ఒక్కరే జాజుల సురేంధర్ గెలిచి ఔరా అనిపించారు. ఆ తర్వాత జాజుల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కారెక్కారు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి మంచిపట్టుంది. క్యాడర్ బలంగా ఉన్నారు. 

కాంగ్రెస్ వ్యవహారాలు చూసుకున్న సుభాష్  రెడ్డి 

జాజుల సురేందర్ రెడ్డి  పార్టీ మారటంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ వ్యవహారాలు సుభాష్ రెడ్డి చూస్తున్నారు. అయితే ఇతర నేతలూ బలంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు.  ఈ నియోజకవర్గంలో హస్తం పార్లీలో ప్రస్తుతం ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మధుసూధన్ రావు... ఈ సారి ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. స్టార్టింగ్ నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మధుసూధన్ రావు పార్టీ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఇది మింగుడు పడక మాజీ మంత్రి షబ్బీర్ అలీ, సుభాష్ రెడ్డి ఇతర కాంగ్రెస్ లీడర్లు మదుసూధన్ రావు  వైఖరిని వ్యతిరేకిస్తున్నారు. 

మదన్ మోహన్ రావు జోక్యంతో కాంగ్రెస్‌లో కల్లోలం

మదన్ మోహన్ రావు పై గతంలో పీసీసీకి ఫిర్యాదులు కూడా చేశారు. ఓవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి షబ్బీర్ అలీ కొడుకును ఎల్లారెడ్డి నుంచి బరిలోకి దింపాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. షబ్బీర్ అలీ కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ ఒక్క నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీలోనే ముగ్గురు నాయకులు టికెక్ తమకంటే తమకే ఇవ్వాలంటూ అటు అధిష్టానంపై కూడా ఒత్తిడి తీసుకోస్తున్నట్లు సమాచారం. సుభాష్ రెడ్డి రేవంత్ వర్గంగా ముద్రపడింది. ఎలాగైనా టికెట్ తనకే లభిస్తుందన్న ధీమాలో ఆయన ఉన్నారు. మరోవైపు మధుసూధన్ రావు గత ఎంపీ ఎన్నికల్లో కేవలం 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ అధిష్టానం తనకే టికెట్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారాయన. ఇటు మాజీ మంత్రి షబ్బీర్ అలీ తన సీనియారిటీ ఉపయోగించి కొడుక్కు ఎల్లారెడ్డి నుంచి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ లో గ్రూపులుగా ఏర్పడి నాయకులు పోటాపోటీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ లో ట్రయాంగిల్ వార్ కొనసాగుతోంది. 

బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ 

బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో జాజుల బీఆర్ ఎస్ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.  గతంలో బీఆర్ ఎస్ నుంచి గెలిచిన ఏనుగు రవీంధర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నారు. బీజేపీ లో ఎల్లారెడ్డి నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో బాణాల లక్ష్మారెడ్డి, ఏనుగు రవీందర్   రెడ్డి ఉన్నారు. బాణాల లక్ష్మారెడ్డి గత ఎన్నికల్లో  బీజేపీ తరపున జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి ఆయన ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈటెల రాజేందర్ తో బీజేపీలోకి వెళ్లిన ఏనుగు తనకే టికెట్ కావాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. 

పార్టీ మారి అయినా  పోటీ చేసే ఉద్దేశంలో నేతలు 

ఒక వేళ ఏనుగు రవీందర్ రెడ్డికి బీజేపీలో టికెట్ ఇవ్వకుంటే బీఆర్ఎస్ లో చేరి అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకూ వెనకాడరంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు మధుసూధన్ రావుకు కూడా ఒక వేళ కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కకుంటే బీజేపీలో చేరి పోటీ చేసేందుకు సైతం స్కెచ్ వేస్తున్నట్లు ఎల్లారెడ్డి నియోజకవర్గం పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మూడు ప్రధాన పార్టీలు ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లో అభ్యర్థులు ఎవరన్నదానిపై జోరుగా చర్చ మొదలైంది. ఇటు ఆయా పార్టీల క్యాడర్ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ప్రధాన పార్టీలు సైతం ఈ నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కాళేశ్వరం బ్యారేజీలకు మరమ్మత్తులు వేగంగా చేసి వినియోగంలోకి - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం బ్యారేజీలకు మరమ్మత్తులు వేగంగా చేసి వినియోగంలోకి - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Jeevan Reddy:రెండు సార్లు కేసీఆర్‌పై పోటీ చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఆయన పార్టీలోకే !
రెండు సార్లు కేసీఆర్‌పై పోటీ చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఆయన పార్టీలోకే !
Adilabad Airport: ఆదిలాబాద్ జిల్లా వాసులకు గుడ్ న్యూస్! ఎయిర్ పోర్టు నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన!
ఆదిలాబాద్ జిల్లా వాసులకు గుడ్ న్యూస్! ఎయిర్ పోర్టు నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన!
Telangana News : జనగామ ఎమ్మెల్యేలకు సైబర్ నేరగాళ్ల టోకరా! వికసిత్ భారత్ పథకం పేరుతో లక్షలు స్వాహా!
జనగామ ఎమ్మెల్యేలకు సైబర్ నేరగాళ్ల టోకరా! వికసిత్ భారత్ పథకం పేరుతో లక్షలు స్వాహా!

వీడియోలు

Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ
Gujarat Victory Over Delhi IPL 2026 | ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
Delhi Capitals Bowlers Come Back IPL 2026 | ఢిల్లీ బౌలర్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్
Reason for CSK Failures in IPL 2026 | సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు
IPL 2026 DC vs GT Highlights | ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada - Hyderabad Flight Service: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
AP SMAM 2026 Applications : ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్రాలు.. దరఖాస్తు విధానం ఇలా!
ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్రాలు.. దరఖాస్తు విధానం ఇలా!
Hyderabad Drug Tests: హైదరాబాద్‌లో 75 శాతం రౌడీషీటర్లకు డ్రగ్స్ పాజిటివ్.. పోలీస్ అధికారులు షాక్!
హైదరాబాద్‌లో 75 శాతం రౌడీషీటర్లకు డ్రగ్స్ పాజిటివ్.. పోలీస్ అధికారులు షాక్!
Nara Lokesh: టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
Whatsapp మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
వాట్సాప్ మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
TDP Rajya Sabha seat race: టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?
టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?
EVM Checking: భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి
భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి
Chia Seeds Side Effects : చియా సీడ్స్ సరిగ్గా తీసుకోకుంటే ప్రమాదకర సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు.. ఎప్పుడు, ఎలా తీసుకోవాలంటే
చియా సీడ్స్ సరిగ్గా తీసుకోకుంటే ప్రమాదకర సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు.. ఎప్పుడు, ఎలా తీసుకోవాలంటే
Embed widget