అన్వేషించండి

Nizamabad News : ఎల్లారెడ్డిలో అభ్యర్థులు రెడీ - ఏ పార్టీ తరపున పోటీ చేస్తారో మాత్రం సీక్రెట్ !

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో హీటెక్కుతున్న పాలిటిక్స్. కాంగ్రెస్ పార్టీలో ట్రయాంగిల్ వార్. బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థిపై ఇంకా నో క్లారిటీ.. ఈ సారి గెలుపెవరిది ?

Nizamabad News :  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పొలిటికల్ హీట్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది.  ఇంకా సాధారణ ఎన్నికలకు 6 నెలల గడువు ఉండటంతో.. ఇప్పటి నుంచే బరిలోకి నిలవాలనుకుంటున్న అభ్యర్థులు చాప కింద నీరులా తమ పని చక్కబెట్టుకుంటున్నారు.  గత ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జాజుల సురేందర్ గెలుపోందారు. ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాల్లో 8 అప్పటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే... కాంగ్రెస్ నుంచి ఒక్కరే జాజుల సురేంధర్ గెలిచి ఔరా అనిపించారు. ఆ తర్వాత జాజుల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కారెక్కారు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి మంచిపట్టుంది. క్యాడర్ బలంగా ఉన్నారు. 

కాంగ్రెస్ వ్యవహారాలు చూసుకున్న సుభాష్  రెడ్డి 

జాజుల సురేందర్ రెడ్డి  పార్టీ మారటంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ వ్యవహారాలు సుభాష్ రెడ్డి చూస్తున్నారు. అయితే ఇతర నేతలూ బలంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు.  ఈ నియోజకవర్గంలో హస్తం పార్లీలో ప్రస్తుతం ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మధుసూధన్ రావు... ఈ సారి ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. స్టార్టింగ్ నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మధుసూధన్ రావు పార్టీ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఇది మింగుడు పడక మాజీ మంత్రి షబ్బీర్ అలీ, సుభాష్ రెడ్డి ఇతర కాంగ్రెస్ లీడర్లు మదుసూధన్ రావు  వైఖరిని వ్యతిరేకిస్తున్నారు. 

మదన్ మోహన్ రావు జోక్యంతో కాంగ్రెస్‌లో కల్లోలం

మదన్ మోహన్ రావు పై గతంలో పీసీసీకి ఫిర్యాదులు కూడా చేశారు. ఓవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి షబ్బీర్ అలీ కొడుకును ఎల్లారెడ్డి నుంచి బరిలోకి దింపాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. షబ్బీర్ అలీ కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ ఒక్క నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీలోనే ముగ్గురు నాయకులు టికెక్ తమకంటే తమకే ఇవ్వాలంటూ అటు అధిష్టానంపై కూడా ఒత్తిడి తీసుకోస్తున్నట్లు సమాచారం. సుభాష్ రెడ్డి రేవంత్ వర్గంగా ముద్రపడింది. ఎలాగైనా టికెట్ తనకే లభిస్తుందన్న ధీమాలో ఆయన ఉన్నారు. మరోవైపు మధుసూధన్ రావు గత ఎంపీ ఎన్నికల్లో కేవలం 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ అధిష్టానం తనకే టికెట్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారాయన. ఇటు మాజీ మంత్రి షబ్బీర్ అలీ తన సీనియారిటీ ఉపయోగించి కొడుక్కు ఎల్లారెడ్డి నుంచి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ లో గ్రూపులుగా ఏర్పడి నాయకులు పోటాపోటీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ లో ట్రయాంగిల్ వార్ కొనసాగుతోంది. 

బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ 

బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో జాజుల బీఆర్ ఎస్ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.  గతంలో బీఆర్ ఎస్ నుంచి గెలిచిన ఏనుగు రవీంధర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నారు. బీజేపీ లో ఎల్లారెడ్డి నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో బాణాల లక్ష్మారెడ్డి, ఏనుగు రవీందర్   రెడ్డి ఉన్నారు. బాణాల లక్ష్మారెడ్డి గత ఎన్నికల్లో  బీజేపీ తరపున జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి ఆయన ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈటెల రాజేందర్ తో బీజేపీలోకి వెళ్లిన ఏనుగు తనకే టికెట్ కావాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. 

పార్టీ మారి అయినా  పోటీ చేసే ఉద్దేశంలో నేతలు 

ఒక వేళ ఏనుగు రవీందర్ రెడ్డికి బీజేపీలో టికెట్ ఇవ్వకుంటే బీఆర్ఎస్ లో చేరి అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకూ వెనకాడరంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు మధుసూధన్ రావుకు కూడా ఒక వేళ కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కకుంటే బీజేపీలో చేరి పోటీ చేసేందుకు సైతం స్కెచ్ వేస్తున్నట్లు ఎల్లారెడ్డి నియోజకవర్గం పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మూడు ప్రధాన పార్టీలు ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లో అభ్యర్థులు ఎవరన్నదానిపై జోరుగా చర్చ మొదలైంది. ఇటు ఆయా పార్టీల క్యాడర్ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ప్రధాన పార్టీలు సైతం ఈ నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. 

 

టాప్ హెడ్ లైన్స్

కాగజ్‌నగర్ గురుకుల స్కూల్లో దారుణం.. టెన్త్ క్లాస్ స్టూడెంట్ కాళ్లు, చేతులు కట్టేసి క్లాస్‌మేట్స్ దాష్టీకం
గురుకుల స్కూల్లో దారుణం.. టెన్త్ క్లాస్ స్టూడెంట్ కాళ్లు, చేతులు కట్టేసి క్లాస్‌మేట్స్ దాష్టీకం
Adilabad Modified Silencers Road Roller: బైక్ సైలెన్సర్లు మారిస్తే రోడ్డు రోలరే! ఆదిలాబాద్‌లో 121 మోడిఫైడ్ సైలెన్సర్లను తొక్కించిన ఎస్పీ అఖిల్ మహాజన్!
బైక్ సైలెన్సర్లు మారిస్తే రోడ్డు రోలరే! ఆదిలాబాద్‌లో 121 మోడిఫైడ్ సైలెన్సర్లను తొక్కించిన ఎస్పీ అఖిల్ మహాజన్!
Nizamabad Crime News: నిజామాబాద్ జిల్లాలో భర్తను భవనంపై నుంచి తోసేసిన భార్య! చనిపోలేదని హార్పిక్‌ ఇంజెక్ట్ చేసి దారుణహత్య! 
నిజామాబాద్ జిల్లాలో భర్తను భవనంపై నుంచి తోసేసిన భార్య! చనిపోలేదని హార్పిక్‌ ఇంజెక్ట్ చేసి దారుణహత్య! 
Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Dalit Christian Vote Bank Politics: వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
Cumin Water : జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
Maharashtra Heavy Rain Red Alert: మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
Sanju Samson Dropped: జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
Embed widget