By: ABP Desam | Updated at : 28 Jun 2022 01:12 PM (IST)
డిచ్ పల్లి మండలం సుద్దులం గ్రామంలో దొంగల బీభత్సం
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామంలో గత కొన్ని రోజులుగా వరుస చోరీలు భయపెడుతున్నయి. ఏం చేయాలో అర్థం కాని గ్రామస్థులు ఓ ప్లాన్ వేశారు. వాళ్ల ప్లాన్ వర్కౌట్ అయింది. నిన్న రాత్రి దొంగలు దొరికారు. వెంటనే వారిని గ్రామంలో బంధించారు.
దొంగలు దొరికారని పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. సుద్దులం గ్రామ ప్రజల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వచ్చి దొంగలను స్టేషన్ తరలించేందుకు ప్రయత్నించారు. అక్కడే గ్రామస్థులు అడ్డుపడ్డారు. వాళ్లను స్టేషన్కు తరలించడానికి వీల్లేదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
తాము పట్టుకున్న దొంగలను గ్రామంలోనే విచారించాలంటూ డిమాండ్ చేశారు సుద్దులం గ్రామ ప్రజలు. గ్రామంలో గత నెల నుంచి సుమారుగా 12 ఇళ్లల్లో చోరీలు జరిగాయని తెలిపారు. ప్రజల ముందు విచారణ చేపట్టాలని, పోలీస్ జీపును స్థానిక మహిళలు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.
దొంగలను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ మహిళలు పోలీస్ వాహనానికి అడ్డుగా కూర్చుని ఆందోళన చేశారు. గ్రామంలో ఉన్న సీసీ కెమెరా డాటాను గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారని మహిళలు ఆరోపించారు. కొన్ని రోజులుగా వరుసగా చోరీలు జరుతుండటంపై గ్రామస్థులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని కొందరు వ్యక్తుల ప్రమేయంతోనే చోరీలు జరుగుతున్నాయని డౌట్ పడుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటివి జరగలేదన్నారు.
సిసి కెమెరాల ఫుటేజ్ ఎలా డిలీట్ చేస్తారని గ్రామంలోని మహిళలు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలోని వారే ఇలా దొంగతనాలు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందుకే గ్రామ ప్రజల సమక్షంలోనే విచారణ జరిపిస్తే అసలు దొంగలు ఎవరనే విషయం బయట పడుతుందని మహిళలు పట్టుపట్టారు. అయితే గ్రామంలోని సర్పంచ్, ఇతర పెద్దలు సముదాయించటంతో మహిళలు వెనుదిరిగారు. నిందితులను పోలీసులు స్టేషన్కు తరలించారు.
Mobile Hospital: ఏజెన్సీ గ్రామాల్లో మొబైల్ ఆస్పత్రి, గిరిజనుల కోసం మెగా వైద్య శిబిరం!
TU Students Dharna: తెలంగాణ యూనివర్శిటీ విద్యార్థుల రెండో రోజు నిరసన
Weather Updates: మరో అల్పపీడనం ముప్పు, ఏపీలో ఎఫెక్ట్ ఇలా - తెలంగాణలో 2 రోజులు IMD ఎల్లో అలర్ట్
పసుపు బోర్డు చిన్నదవుద్దని స్పైస్ బోర్డుకు ట్రై చేస్తున్నాం: ఎంపీ అర్వింద్
నిజామాబాద్లో సినిమాటిక్ చోరీలు- బైక్పై వచ్చి సెల్ఫోన్లు ఎత్తుకెళ్తున్న దుండగులు
Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!
AP High Court: జగన్ సర్కార్ డేంజర్ జోన్లో ఉందన్న ఏపీ హైకోర్టు, ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు
రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్న్యూస్, తెలంగాణ సర్కార్కు షాక్ - కీలక తీర్పు
Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ లీడర్ హత్య కేసులో నిందితుల అరెస్టు