అన్వేషించండి

Nizamabad News 2022: ఈ ఏడాది నిజామాబాద్ జిల్లాలో పెరిగిన నేరాలు, ఆ కేసు మాత్రం ఇప్పటికీ సంచలనమే!

2022లో పోలీస్ శాఖ సాధించిన ప్రగతేంటీ. జిల్లాలో క్రైం ఏ మేరకు అదుపులోకి వచ్చింది. ప్రేండ్లీ పోలీస్ శాంతిభద్రతలు ఏలా ఉన్నాయ్. జిల్లాలో ఈ ఏడాది క్రైం రేట్ పెరిగిందా... జిల్లా పోలీస్ శాఖ పనితీరుపై రౌండప్

గతేడాదితో పోల్చితే ఈ ఏడాది క్రైం రేట్ పెరిగిందని నిజామాబాద్ సీపీ నాగరాజు తెలిపారు. 2022 ఏడాదికి సంబంధించి నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఇయర్ ఎండ్ రిపోర్ట్ ను సీపీ నాగరాజు మీడియా సమావేశంలో విడుదల చేశారు. గతేడాది ఈ కేసుల సంఖ్య 826 కాగా, ఈ ఏడాది 985 కేసులు నమోదయ్యాయని తెలిపారు.  అంటే గతేడాదితో పోలిస్తే 159 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఆస్తి తగాదాలు, ఇతర దొంగతనాలు ఇలా నేరాలకు సంబంధించి ఈ ఏడాది 1022 కేసులు నమోదయ్యాయి. 2021లో వీటి సంఖ్య 676 గా ఉంది. ఈ ఏడాది 346 కేసులు పెరిగాయి. ఇందులో ఎక్కువగా వాహనాల చోరీ కేసులే 417 నమోదయ్యాయి. 2022లో జిల్లా వ్యాప్తంగా దొంగిలించిన సొత్తు విలువ 6 కోట్ల 75 లక్షల 54 వేల 285 రూపాయలు (రూ.6.75 కోట్లు) కాగా ఇందులో రికవరీ చేసింది 2 కోట్ల 22 లక్షల 897 రూపాయలని (రూ. 2.22 కోట్లు) సీపీ నాగరాజు తెలిపారు. చోరీ అయిన సొత్తులో 32.86 శాతం మాత్రమే రికవరీ చేశారు. 

సంచలనంగా మారిన బ్యాంక్ చోరీ 
ప్రధానంగా బుస్సాపూర్ బ్యాంక్ లో చోరీ సంచలనం అయ్యింది. జిల్లాలో ఇది పెద్ద చోరీ. బ్యాంకు నుంచి నగదు, బంగారు నగలు మొత్తం 4 కోట్ల 46 లక్షల రూపాయల సొత్తు చోరీకి గురైంది. ఈ బ్యాంక్ రాబరీకి పాల్పడిన వారు మొత్తం యూపీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఇందులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 8,50,000 మాత్రమే రికవరీ చేశారు. ఇందులో 30 కేజీల బంగారం చోరీకి గురైంది. అయితే ఇప్పటి వరకు పోలీసులు కేవలం 18 తులాల బంగారం మాత్రమే రికవరీ చేశారు. చోరీ జరిగి 6 నెలలు కావస్తున్నా పూర్తి స్థాయిలో దొంగలను అరెస్ట్ చేయలేకపోయారు పోలీసులు. యూపీ పోలీసులు వీరికి సహకరించటమే అందుకు కారణమని చెప్పారు. ఈ కేసులో ముగ్గురు దొంగలను పట్టుకున్న పోలీసులు మిగతా వారి విషయంలో ఎందుకు ఆలస్యం అవుతుందన్న దానిపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, 320 మంది మృతి
2022లో రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 320 మంది చనిపోయినట్లు, 291 కేసులు నమోదైనట్లు సీపీ నాగరాజు తెలిపారు. ఈ ఏడాదిలో వరకట్నంపు హత్యలు 4, వరకట్న వేధింపుల కింద నమోదైన కేసులు 340, ఇతర వేధింపులు 166, ఈవ్ టీజింగ్ కింద 40 కేసులు నమోదయ్యాయి. గతేడాది వీటి సంఖ్య 388 గా ఉంది. ఈ ఏడాది మహిళలపైన దాడులు గతేడాదితో పోలిస్తే 41.75 శాతం పెరిగిందన్నారు సీపీ నాగరాజు.

ప్రత్యేక, స్థానిక చట్టాల కింద ఈ ఏడాది 485 కేసులు నమోదయ్యాయి. గతేడాది వీటి సంఖ్య 460 గా ఉంది. ఈ చలాన్, డ్రంక్ అండ్ డ్రైవ్ కింద ఈ ఏడాది మొత్తం 3,88,374 కేసులు నమోదవగా... 12 కోట్ల 30 లక్షల 95 వేల 500 రూపాయలు జరిమానా విధించింది జిల్లా పోలీస్ శాఖ. గతేడాదితో పోలిస్తే ఈ చలాన్లలో 16.46 శాతం తగ్గింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు గతేడాదితో పోలిస్తే 176.47 శాతం కేసులు పెరిగాయి. ఇక జూదం ఆడుతూ దొరికిన వారిపై మొత్తం 384 కేసులు నమోదు కాగా, మట్కా అడిన వారిపై 47 కేసులు నమోదయ్యాయి. మొత్తం రూ. 56,55,477 నగదును జూదం అడుతూ పట్టుకున్నారు. మట్కా అడగా రూ. 4,92,646 స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గుట్కా అక్రమ రవాణాలో ఈ ఏడాది 38 కేసులు నమోదు కాగా రూ. 87,99,138 విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయి అక్రమ రవాణా కింద ఈ ఏడాది 19 కేసులు నమోదయ్యాయి. 272.761 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై 60 కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పోలీస్తే ఈ కేసులు 18.91 శాతం తగ్గిందని తెలిపారు సీపీ నాగరాజు. 

లోక్ అదాలత్ కింద ఈ ఏడాది 19,110 కేసులు పరిష్కారమయ్యాయ్. జిల్లాలో ఈ ఏడాది ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కింద 114 కేసులు నమోదయ్యాయి. గతేడాది ఈ సంఖ్య 64గా ఉంది. 78.12 శాతం కేసులు పెరిగాయి. ఈ ఏడాది మిస్సింగ్ కేసులు 684 నమోదయ్యాయి. ఇందులో 547 కేసులు విజయంతంగా ఛేదించగా, ఇంకా 137 కేసుల ట్రేస్ కాలేదని తెలిపారు సిపి నాగరాజు. గతేడాదితో పోలిస్తే ఈ కేసులు 6.37 శాతం మిస్సింగ్ కేసులు పెరిగాయ్. 18 ఏళ్లలోపు తప్పిపోయిన చిన్నారుల సంఖ్య ఈ ఏడాది 56 ఉంటే 52 మంది ఆచూకీని పోలీసులు గుర్తించగా ఇంకా ఇద్దరు చిన్నారుల ఆచూకీ తెలియలేదు. ఆపరేషన్ ముస్కాన్ కింద ఈ ఏడాది జిల్లాలో 38 మందిని పోలీసులు గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. గతేడాది 155 మంది చిన్నారులను గుర్తించి 153 మందిని వారి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఏడాది డయల్ 100 కింద 53,376 కాల్స్ వచ్చినట్లు కమిషనర్ నాగరాజు తెలిపారు. 

 అయితే జిల్లాలో ప్రధానంగా మెండోరా మండలం బుస్సాపూర్ ఎస్బీఐ బ్యాంక్ లో చోరీ కలకలం సృష్టించింది. భారీగా నగదు, బంగారం అపరహణకు గురైంది. ఈ కేసులు పోలీసులు చోరీ అయిన సొత్తును రికవరీ చేసింది చాలా తక్కువే. ఇంకా నిందితులను పట్టుకునే పనిలో కొన్ని పోలీస్ బృందాలు ఉన్నట్లు సీపీ నాగరాజు తెలిపారు. ఈ ఏడాది ఓవరాల్ గా చూస్తే క్రైం సంఖ్య జిల్లాలో పెరిగిందనే చెప్పవచ్చు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
Telangana EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Balka Suman Arrested: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టు- సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో చర్యలు
బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టు- సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో చర్యలు

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
Embed widget