అన్వేషించండి

Nizamabad News 2022: ఈ ఏడాది నిజామాబాద్ జిల్లాలో పెరిగిన నేరాలు, ఆ కేసు మాత్రం ఇప్పటికీ సంచలనమే!

2022లో పోలీస్ శాఖ సాధించిన ప్రగతేంటీ. జిల్లాలో క్రైం ఏ మేరకు అదుపులోకి వచ్చింది. ప్రేండ్లీ పోలీస్ శాంతిభద్రతలు ఏలా ఉన్నాయ్. జిల్లాలో ఈ ఏడాది క్రైం రేట్ పెరిగిందా... జిల్లా పోలీస్ శాఖ పనితీరుపై రౌండప్

గతేడాదితో పోల్చితే ఈ ఏడాది క్రైం రేట్ పెరిగిందని నిజామాబాద్ సీపీ నాగరాజు తెలిపారు. 2022 ఏడాదికి సంబంధించి నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఇయర్ ఎండ్ రిపోర్ట్ ను సీపీ నాగరాజు మీడియా సమావేశంలో విడుదల చేశారు. గతేడాది ఈ కేసుల సంఖ్య 826 కాగా, ఈ ఏడాది 985 కేసులు నమోదయ్యాయని తెలిపారు.  అంటే గతేడాదితో పోలిస్తే 159 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఆస్తి తగాదాలు, ఇతర దొంగతనాలు ఇలా నేరాలకు సంబంధించి ఈ ఏడాది 1022 కేసులు నమోదయ్యాయి. 2021లో వీటి సంఖ్య 676 గా ఉంది. ఈ ఏడాది 346 కేసులు పెరిగాయి. ఇందులో ఎక్కువగా వాహనాల చోరీ కేసులే 417 నమోదయ్యాయి. 2022లో జిల్లా వ్యాప్తంగా దొంగిలించిన సొత్తు విలువ 6 కోట్ల 75 లక్షల 54 వేల 285 రూపాయలు (రూ.6.75 కోట్లు) కాగా ఇందులో రికవరీ చేసింది 2 కోట్ల 22 లక్షల 897 రూపాయలని (రూ. 2.22 కోట్లు) సీపీ నాగరాజు తెలిపారు. చోరీ అయిన సొత్తులో 32.86 శాతం మాత్రమే రికవరీ చేశారు. 

సంచలనంగా మారిన బ్యాంక్ చోరీ 
ప్రధానంగా బుస్సాపూర్ బ్యాంక్ లో చోరీ సంచలనం అయ్యింది. జిల్లాలో ఇది పెద్ద చోరీ. బ్యాంకు నుంచి నగదు, బంగారు నగలు మొత్తం 4 కోట్ల 46 లక్షల రూపాయల సొత్తు చోరీకి గురైంది. ఈ బ్యాంక్ రాబరీకి పాల్పడిన వారు మొత్తం యూపీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఇందులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 8,50,000 మాత్రమే రికవరీ చేశారు. ఇందులో 30 కేజీల బంగారం చోరీకి గురైంది. అయితే ఇప్పటి వరకు పోలీసులు కేవలం 18 తులాల బంగారం మాత్రమే రికవరీ చేశారు. చోరీ జరిగి 6 నెలలు కావస్తున్నా పూర్తి స్థాయిలో దొంగలను అరెస్ట్ చేయలేకపోయారు పోలీసులు. యూపీ పోలీసులు వీరికి సహకరించటమే అందుకు కారణమని చెప్పారు. ఈ కేసులో ముగ్గురు దొంగలను పట్టుకున్న పోలీసులు మిగతా వారి విషయంలో ఎందుకు ఆలస్యం అవుతుందన్న దానిపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, 320 మంది మృతి
2022లో రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 320 మంది చనిపోయినట్లు, 291 కేసులు నమోదైనట్లు సీపీ నాగరాజు తెలిపారు. ఈ ఏడాదిలో వరకట్నంపు హత్యలు 4, వరకట్న వేధింపుల కింద నమోదైన కేసులు 340, ఇతర వేధింపులు 166, ఈవ్ టీజింగ్ కింద 40 కేసులు నమోదయ్యాయి. గతేడాది వీటి సంఖ్య 388 గా ఉంది. ఈ ఏడాది మహిళలపైన దాడులు గతేడాదితో పోలిస్తే 41.75 శాతం పెరిగిందన్నారు సీపీ నాగరాజు.

ప్రత్యేక, స్థానిక చట్టాల కింద ఈ ఏడాది 485 కేసులు నమోదయ్యాయి. గతేడాది వీటి సంఖ్య 460 గా ఉంది. ఈ చలాన్, డ్రంక్ అండ్ డ్రైవ్ కింద ఈ ఏడాది మొత్తం 3,88,374 కేసులు నమోదవగా... 12 కోట్ల 30 లక్షల 95 వేల 500 రూపాయలు జరిమానా విధించింది జిల్లా పోలీస్ శాఖ. గతేడాదితో పోలిస్తే ఈ చలాన్లలో 16.46 శాతం తగ్గింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు గతేడాదితో పోలిస్తే 176.47 శాతం కేసులు పెరిగాయి. ఇక జూదం ఆడుతూ దొరికిన వారిపై మొత్తం 384 కేసులు నమోదు కాగా, మట్కా అడిన వారిపై 47 కేసులు నమోదయ్యాయి. మొత్తం రూ. 56,55,477 నగదును జూదం అడుతూ పట్టుకున్నారు. మట్కా అడగా రూ. 4,92,646 స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గుట్కా అక్రమ రవాణాలో ఈ ఏడాది 38 కేసులు నమోదు కాగా రూ. 87,99,138 విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయి అక్రమ రవాణా కింద ఈ ఏడాది 19 కేసులు నమోదయ్యాయి. 272.761 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై 60 కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పోలీస్తే ఈ కేసులు 18.91 శాతం తగ్గిందని తెలిపారు సీపీ నాగరాజు. 

లోక్ అదాలత్ కింద ఈ ఏడాది 19,110 కేసులు పరిష్కారమయ్యాయ్. జిల్లాలో ఈ ఏడాది ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కింద 114 కేసులు నమోదయ్యాయి. గతేడాది ఈ సంఖ్య 64గా ఉంది. 78.12 శాతం కేసులు పెరిగాయి. ఈ ఏడాది మిస్సింగ్ కేసులు 684 నమోదయ్యాయి. ఇందులో 547 కేసులు విజయంతంగా ఛేదించగా, ఇంకా 137 కేసుల ట్రేస్ కాలేదని తెలిపారు సిపి నాగరాజు. గతేడాదితో పోలిస్తే ఈ కేసులు 6.37 శాతం మిస్సింగ్ కేసులు పెరిగాయ్. 18 ఏళ్లలోపు తప్పిపోయిన చిన్నారుల సంఖ్య ఈ ఏడాది 56 ఉంటే 52 మంది ఆచూకీని పోలీసులు గుర్తించగా ఇంకా ఇద్దరు చిన్నారుల ఆచూకీ తెలియలేదు. ఆపరేషన్ ముస్కాన్ కింద ఈ ఏడాది జిల్లాలో 38 మందిని పోలీసులు గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. గతేడాది 155 మంది చిన్నారులను గుర్తించి 153 మందిని వారి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఏడాది డయల్ 100 కింద 53,376 కాల్స్ వచ్చినట్లు కమిషనర్ నాగరాజు తెలిపారు. 

 అయితే జిల్లాలో ప్రధానంగా మెండోరా మండలం బుస్సాపూర్ ఎస్బీఐ బ్యాంక్ లో చోరీ కలకలం సృష్టించింది. భారీగా నగదు, బంగారం అపరహణకు గురైంది. ఈ కేసులు పోలీసులు చోరీ అయిన సొత్తును రికవరీ చేసింది చాలా తక్కువే. ఇంకా నిందితులను పట్టుకునే పనిలో కొన్ని పోలీస్ బృందాలు ఉన్నట్లు సీపీ నాగరాజు తెలిపారు. ఈ ఏడాది ఓవరాల్ గా చూస్తే క్రైం సంఖ్య జిల్లాలో పెరిగిందనే చెప్పవచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసన, అభిజీత్ దీప్కే హాజరు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ 
జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసన, అభిజీత్ దీప్కే హాజరు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ 
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: జంతర్‌ మంతర్‌ వద్దకు అభిజీత్ దీప్కే !
జంతర్‌ మంతర్‌ వద్దకు అభిజీత్ దీప్కే !
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
CBSE Verification Last Date Extended: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Buchi Babu Sana: జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
Embed widget