అన్వేషించండి

Dharmapuri Arvind: కవితను అరెస్ట్ చేయలేదని, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతింది: అర్వింద్

Telangana News: నిజామాబాద్ ఎంపీగా తాను రెండోసారి నెగ్గుతానని, ప్రజల్లో క్రెడిబిలిటీ పెరిగిందన్నారు ధర్మపురి అర్వింద్. పసుపు బోర్డుకు టైమ్ పడుతుందని, స్పైసిస్ బోర్డు తెచ్చుకున్నామని స్పష్టం చేశారు. 

Nizamabad MP Dharmapuri Arvind | నిజామాబాద్: తెలంగాణలో కీలకమైన లోక్‌సభ స్థానాల్లో నిజామాబాద్ ఒకటి. బీజేపీ నేత, సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో బాండ్ అఫిడవిట్ ఇచ్చిన అర్వింద్ ఈసారి తన వ్యూహం ఏంటని అడిగితే సమయం వచ్చినప్పుడు తెలుస్తుందన్నారు. ఏబీపీ దేశం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ పలు విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ ఐదేళ్లలో పార్టీతో పాటు తన క్రెడిబిలిటీ పెరిగిందన్నారు. పసుపు బోర్డుకు టైమ్ పడుతుందని తెలియగానే, స్పైసిస్ బోర్డు తెచ్చుకున్నామని స్పష్టం చేశారు. 

‘ప్రధాని మోదీ దయవల్ల స్పైసిస్ బోర్డు తెచ్చుకున్నాం. పసుపు ఉత్పత్తికి డిమాండ్ తీసుకురావడం, మార్కెటింగ్ ఎలా చేయాలి, 7 రైల్వే ఓవర్ బ్రిడ్జిల పనులు జరుగుతున్నాయి. ఒకటి ప్రారంభించాం, మరొకటి సిద్ధంగా ఉంది. ఆర్మూరు నుంచి మంచిర్యాల వరకు, మరికొన్ని పనులు, రైల్వే వర్క్స్ జరుగుతున్నాయి. 2 కేంద్రీయ విద్యాలయాలు వచ్చాయి. ఒకటి ప్రారంభమైంది. జగిత్యాలకు నవోదయ పర్మిషన్ వచ్చిందన్నారు’ ఎంపీ అభ్యర్థి అర్వింద్.

బీజేపీకి 12 సీట్లు..
తెలంగాణలో గత ఎన్నికల్లో సారు కారు పదహారు అన్నారు. మాకు 4 సీట్లు వచ్చాయి. ఈ లోక్ సభ ఎన్నికల్లో మోదీ చరిష్మాతో 12 సీట్ల వరకు నెగ్గుతామని అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. కొందరు సింగిల్ డిజిట్ అన్నారు, కొన్ని సంస్థలు మాకు డబుల్ డిజిట్ వస్తుందని సర్వేలో వచ్చిందన్నారు. ఎవరిని, ఎప్పుడు ఎలా ఎన్నుకోవాలో ప్రజలకు తెలుసన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీని మళ్లీ చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా మోదీకి క్రేజ్ ఉంది. స్వయం సహాయక సంఘాలకు తన నియోజకవర్గంలోనే రూ.6300 కోట్ల రుణాలు. 70 వేల ఉజ్వల యోజన, 60 వేల సుకన్య సమృద్ధి యోజన, 6 లక్షల ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులు, 15 లక్షల 80 వేల మందికి ఉచిత రేషన్ వస్తుందన్నారు. 

నార్మల్ టైమ్ లో అభివృద్ది గురించి మాట్లాడతారు, ఎన్నికల సమయంలో మతతత్వ రాజకీయాలపై అర్వింద్ మాట్లాడారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో 4 శాతం రిజర్వేషన్లు అని చెప్పి, ముస్లింలను బీసీల్లో చేర్చారని గుర్తుచేశారు. మత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు. హిందువుల రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు ఇవ్వడం సరికాదన్నారు. ఎల్.కే అద్వానీ, వాజ్ పేయి హయాం నుంచి రామమందిరం బీజేపీ మేనిఫెస్టోలో ఉందని గుర్తుచేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆస్తులు బయటకు తీసి ప్రజలకు పంచాలన్నారు. ఎలక్టోరల్ బాండ్లు బహిర్గతం చేయడంతో పారదర్శత పెరుగుతుందన్నారు. ఎలక్టోరల్ బాండ్లలో అత్యధిక వాటా బీజేపీకి వచ్చాయి. 

అదానీ ఆస్తుల విలువ 2004 - 2014 మధ్య భారీగా పెరిగిందని, కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని అర్వింద్ ఆరోపించారు. రాహుల్ గాంధీకి ఏం మాట్లాడాలో కామన్ సెన్స్ లేదని, అందుకే అంబానీ, అదానీలను బీజేపీ తయారు చేసిందంటారని చెప్పారు. తెలంగాణలో 12 సీట్లు గెలిస్తే, కేంద్రంలో మరోసారి ఎక్కువ స్థానాల్లో నెగ్గితే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తుందా అని అడగగా.. ఇప్పుడు కూడా తమకు మెజార్టీ ఉన్నా ఆ పని చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి కాబోయే ఏక్ నాథ్ షిండే అనే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాని అడగాలన్నారు అర్వింద్. 

అప్పుడే కవితను అరెస్ట్ చేయకపోవడం మైనస్ అయింది

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అసెంబ్లీ ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయకపోవడం వల్లే బీజేపీ ఓడిపోయిందన్నారు. దర్యాప్తు సంస్థలు బీజేపీ, కేంద్రం ఆధీనంలో లేవన్నారు. బీజేపీ ఎంపీలు ఎందుకు అరెస్ట్ అవ్వరన్న దానిపై.. తమ పార్టీ నేతలు అవినీతి చేయరు కనుక జైళ్లకు వెళ్లరన్నారు. బీజేపీలో చేరిన సుజనా చౌదరి, ఎంపీ రమేష్ ల పైన ఉన్న ఈడీ కేసుల్లో ఎందుకు కదలిక లేదన్న ప్రశ్నకు.. ఏపీ సీఎం జగన్ పై కూడా ఈడీ కేసులు ఉన్నా.. ఆ కేసు కూడా మూవ్ కావడం లేదని గుర్తుచేశారు. ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో చెప్పలేమని, అక్కడ ఏం సర్కస్ జరిగినా తమకు అవసరం లేదన్నారు. 

నిజాం షుగర్స్ కోసం ప్రైవేట్ వ్యక్తులను తీసుకొస్తాం, రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గట్లు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్ధిగా ఫిరోజ్ ఖాన్ కు ఛాన్స్ ఇస్తే 100 శాతం గెలిచేవారని జోస్యం చెప్పారు. ఒక్క ఓటు మీద వాజ్ పేయి ప్రభుత్వం కూలిపోయింది, కానీ గోవా, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి పలు రాష్ట్రాల్లో సర్కార్ ను తాము కూల్చలేదన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారం కోల్పోతుందా అంటే బీజేపీ వస్తుందని అంటే తథాస్తు అన్నారు అర్వింద్.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget