అన్వేషించండి

Dharmapuri Arvind: కవితను అరెస్ట్ చేయలేదని, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతింది: అర్వింద్

Telangana News: నిజామాబాద్ ఎంపీగా తాను రెండోసారి నెగ్గుతానని, ప్రజల్లో క్రెడిబిలిటీ పెరిగిందన్నారు ధర్మపురి అర్వింద్. పసుపు బోర్డుకు టైమ్ పడుతుందని, స్పైసిస్ బోర్డు తెచ్చుకున్నామని స్పష్టం చేశారు. 

Nizamabad MP Dharmapuri Arvind | నిజామాబాద్: తెలంగాణలో కీలకమైన లోక్‌సభ స్థానాల్లో నిజామాబాద్ ఒకటి. బీజేపీ నేత, సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో బాండ్ అఫిడవిట్ ఇచ్చిన అర్వింద్ ఈసారి తన వ్యూహం ఏంటని అడిగితే సమయం వచ్చినప్పుడు తెలుస్తుందన్నారు. ఏబీపీ దేశం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ పలు విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ ఐదేళ్లలో పార్టీతో పాటు తన క్రెడిబిలిటీ పెరిగిందన్నారు. పసుపు బోర్డుకు టైమ్ పడుతుందని తెలియగానే, స్పైసిస్ బోర్డు తెచ్చుకున్నామని స్పష్టం చేశారు. 

‘ప్రధాని మోదీ దయవల్ల స్పైసిస్ బోర్డు తెచ్చుకున్నాం. పసుపు ఉత్పత్తికి డిమాండ్ తీసుకురావడం, మార్కెటింగ్ ఎలా చేయాలి, 7 రైల్వే ఓవర్ బ్రిడ్జిల పనులు జరుగుతున్నాయి. ఒకటి ప్రారంభించాం, మరొకటి సిద్ధంగా ఉంది. ఆర్మూరు నుంచి మంచిర్యాల వరకు, మరికొన్ని పనులు, రైల్వే వర్క్స్ జరుగుతున్నాయి. 2 కేంద్రీయ విద్యాలయాలు వచ్చాయి. ఒకటి ప్రారంభమైంది. జగిత్యాలకు నవోదయ పర్మిషన్ వచ్చిందన్నారు’ ఎంపీ అభ్యర్థి అర్వింద్.

బీజేపీకి 12 సీట్లు..
తెలంగాణలో గత ఎన్నికల్లో సారు కారు పదహారు అన్నారు. మాకు 4 సీట్లు వచ్చాయి. ఈ లోక్ సభ ఎన్నికల్లో మోదీ చరిష్మాతో 12 సీట్ల వరకు నెగ్గుతామని అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. కొందరు సింగిల్ డిజిట్ అన్నారు, కొన్ని సంస్థలు మాకు డబుల్ డిజిట్ వస్తుందని సర్వేలో వచ్చిందన్నారు. ఎవరిని, ఎప్పుడు ఎలా ఎన్నుకోవాలో ప్రజలకు తెలుసన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీని మళ్లీ చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా మోదీకి క్రేజ్ ఉంది. స్వయం సహాయక సంఘాలకు తన నియోజకవర్గంలోనే రూ.6300 కోట్ల రుణాలు. 70 వేల ఉజ్వల యోజన, 60 వేల సుకన్య సమృద్ధి యోజన, 6 లక్షల ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులు, 15 లక్షల 80 వేల మందికి ఉచిత రేషన్ వస్తుందన్నారు. 

నార్మల్ టైమ్ లో అభివృద్ది గురించి మాట్లాడతారు, ఎన్నికల సమయంలో మతతత్వ రాజకీయాలపై అర్వింద్ మాట్లాడారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో 4 శాతం రిజర్వేషన్లు అని చెప్పి, ముస్లింలను బీసీల్లో చేర్చారని గుర్తుచేశారు. మత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు. హిందువుల రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు ఇవ్వడం సరికాదన్నారు. ఎల్.కే అద్వానీ, వాజ్ పేయి హయాం నుంచి రామమందిరం బీజేపీ మేనిఫెస్టోలో ఉందని గుర్తుచేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆస్తులు బయటకు తీసి ప్రజలకు పంచాలన్నారు. ఎలక్టోరల్ బాండ్లు బహిర్గతం చేయడంతో పారదర్శత పెరుగుతుందన్నారు. ఎలక్టోరల్ బాండ్లలో అత్యధిక వాటా బీజేపీకి వచ్చాయి. 

అదానీ ఆస్తుల విలువ 2004 - 2014 మధ్య భారీగా పెరిగిందని, కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని అర్వింద్ ఆరోపించారు. రాహుల్ గాంధీకి ఏం మాట్లాడాలో కామన్ సెన్స్ లేదని, అందుకే అంబానీ, అదానీలను బీజేపీ తయారు చేసిందంటారని చెప్పారు. తెలంగాణలో 12 సీట్లు గెలిస్తే, కేంద్రంలో మరోసారి ఎక్కువ స్థానాల్లో నెగ్గితే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తుందా అని అడగగా.. ఇప్పుడు కూడా తమకు మెజార్టీ ఉన్నా ఆ పని చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి కాబోయే ఏక్ నాథ్ షిండే అనే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాని అడగాలన్నారు అర్వింద్. 

అప్పుడే కవితను అరెస్ట్ చేయకపోవడం మైనస్ అయింది

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అసెంబ్లీ ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయకపోవడం వల్లే బీజేపీ ఓడిపోయిందన్నారు. దర్యాప్తు సంస్థలు బీజేపీ, కేంద్రం ఆధీనంలో లేవన్నారు. బీజేపీ ఎంపీలు ఎందుకు అరెస్ట్ అవ్వరన్న దానిపై.. తమ పార్టీ నేతలు అవినీతి చేయరు కనుక జైళ్లకు వెళ్లరన్నారు. బీజేపీలో చేరిన సుజనా చౌదరి, ఎంపీ రమేష్ ల పైన ఉన్న ఈడీ కేసుల్లో ఎందుకు కదలిక లేదన్న ప్రశ్నకు.. ఏపీ సీఎం జగన్ పై కూడా ఈడీ కేసులు ఉన్నా.. ఆ కేసు కూడా మూవ్ కావడం లేదని గుర్తుచేశారు. ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో చెప్పలేమని, అక్కడ ఏం సర్కస్ జరిగినా తమకు అవసరం లేదన్నారు. 

నిజాం షుగర్స్ కోసం ప్రైవేట్ వ్యక్తులను తీసుకొస్తాం, రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గట్లు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్ధిగా ఫిరోజ్ ఖాన్ కు ఛాన్స్ ఇస్తే 100 శాతం గెలిచేవారని జోస్యం చెప్పారు. ఒక్క ఓటు మీద వాజ్ పేయి ప్రభుత్వం కూలిపోయింది, కానీ గోవా, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి పలు రాష్ట్రాల్లో సర్కార్ ను తాము కూల్చలేదన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారం కోల్పోతుందా అంటే బీజేపీ వస్తుందని అంటే తథాస్తు అన్నారు అర్వింద్.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Nirmal Supari Murder Case: సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
526km కియా సైరోస్‌ EV ఎంట్రీ - టాటా ఎక్సాన్‌ EV, మహీంద్రా XUV 3XO EV కంటే బెటరా?
Kia Syros EV వర్సెస్‌ Nexon EV వర్సెస్‌ XUV 3XO EV - A టు Z కంపారిజన్‌, ఏ ఎలక్ట్రిక్‌ SUV కొంటారు?
Jana Nayagan Collections: 150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Embed widget