అన్వేషించండి

Dharmapuri Arvind: కవితను అరెస్ట్ చేయలేదని, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతింది: అర్వింద్

Telangana News: నిజామాబాద్ ఎంపీగా తాను రెండోసారి నెగ్గుతానని, ప్రజల్లో క్రెడిబిలిటీ పెరిగిందన్నారు ధర్మపురి అర్వింద్. పసుపు బోర్డుకు టైమ్ పడుతుందని, స్పైసిస్ బోర్డు తెచ్చుకున్నామని స్పష్టం చేశారు. 

Nizamabad MP Dharmapuri Arvind | నిజామాబాద్: తెలంగాణలో కీలకమైన లోక్‌సభ స్థానాల్లో నిజామాబాద్ ఒకటి. బీజేపీ నేత, సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో బాండ్ అఫిడవిట్ ఇచ్చిన అర్వింద్ ఈసారి తన వ్యూహం ఏంటని అడిగితే సమయం వచ్చినప్పుడు తెలుస్తుందన్నారు. ఏబీపీ దేశం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ పలు విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ ఐదేళ్లలో పార్టీతో పాటు తన క్రెడిబిలిటీ పెరిగిందన్నారు. పసుపు బోర్డుకు టైమ్ పడుతుందని తెలియగానే, స్పైసిస్ బోర్డు తెచ్చుకున్నామని స్పష్టం చేశారు. 

‘ప్రధాని మోదీ దయవల్ల స్పైసిస్ బోర్డు తెచ్చుకున్నాం. పసుపు ఉత్పత్తికి డిమాండ్ తీసుకురావడం, మార్కెటింగ్ ఎలా చేయాలి, 7 రైల్వే ఓవర్ బ్రిడ్జిల పనులు జరుగుతున్నాయి. ఒకటి ప్రారంభించాం, మరొకటి సిద్ధంగా ఉంది. ఆర్మూరు నుంచి మంచిర్యాల వరకు, మరికొన్ని పనులు, రైల్వే వర్క్స్ జరుగుతున్నాయి. 2 కేంద్రీయ విద్యాలయాలు వచ్చాయి. ఒకటి ప్రారంభమైంది. జగిత్యాలకు నవోదయ పర్మిషన్ వచ్చిందన్నారు’ ఎంపీ అభ్యర్థి అర్వింద్.

బీజేపీకి 12 సీట్లు..
తెలంగాణలో గత ఎన్నికల్లో సారు కారు పదహారు అన్నారు. మాకు 4 సీట్లు వచ్చాయి. ఈ లోక్ సభ ఎన్నికల్లో మోదీ చరిష్మాతో 12 సీట్ల వరకు నెగ్గుతామని అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. కొందరు సింగిల్ డిజిట్ అన్నారు, కొన్ని సంస్థలు మాకు డబుల్ డిజిట్ వస్తుందని సర్వేలో వచ్చిందన్నారు. ఎవరిని, ఎప్పుడు ఎలా ఎన్నుకోవాలో ప్రజలకు తెలుసన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీని మళ్లీ చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా మోదీకి క్రేజ్ ఉంది. స్వయం సహాయక సంఘాలకు తన నియోజకవర్గంలోనే రూ.6300 కోట్ల రుణాలు. 70 వేల ఉజ్వల యోజన, 60 వేల సుకన్య సమృద్ధి యోజన, 6 లక్షల ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులు, 15 లక్షల 80 వేల మందికి ఉచిత రేషన్ వస్తుందన్నారు. 

నార్మల్ టైమ్ లో అభివృద్ది గురించి మాట్లాడతారు, ఎన్నికల సమయంలో మతతత్వ రాజకీయాలపై అర్వింద్ మాట్లాడారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో 4 శాతం రిజర్వేషన్లు అని చెప్పి, ముస్లింలను బీసీల్లో చేర్చారని గుర్తుచేశారు. మత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు. హిందువుల రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు ఇవ్వడం సరికాదన్నారు. ఎల్.కే అద్వానీ, వాజ్ పేయి హయాం నుంచి రామమందిరం బీజేపీ మేనిఫెస్టోలో ఉందని గుర్తుచేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆస్తులు బయటకు తీసి ప్రజలకు పంచాలన్నారు. ఎలక్టోరల్ బాండ్లు బహిర్గతం చేయడంతో పారదర్శత పెరుగుతుందన్నారు. ఎలక్టోరల్ బాండ్లలో అత్యధిక వాటా బీజేపీకి వచ్చాయి. 

అదానీ ఆస్తుల విలువ 2004 - 2014 మధ్య భారీగా పెరిగిందని, కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని అర్వింద్ ఆరోపించారు. రాహుల్ గాంధీకి ఏం మాట్లాడాలో కామన్ సెన్స్ లేదని, అందుకే అంబానీ, అదానీలను బీజేపీ తయారు చేసిందంటారని చెప్పారు. తెలంగాణలో 12 సీట్లు గెలిస్తే, కేంద్రంలో మరోసారి ఎక్కువ స్థానాల్లో నెగ్గితే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తుందా అని అడగగా.. ఇప్పుడు కూడా తమకు మెజార్టీ ఉన్నా ఆ పని చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి కాబోయే ఏక్ నాథ్ షిండే అనే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాని అడగాలన్నారు అర్వింద్. 

అప్పుడే కవితను అరెస్ట్ చేయకపోవడం మైనస్ అయింది

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అసెంబ్లీ ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయకపోవడం వల్లే బీజేపీ ఓడిపోయిందన్నారు. దర్యాప్తు సంస్థలు బీజేపీ, కేంద్రం ఆధీనంలో లేవన్నారు. బీజేపీ ఎంపీలు ఎందుకు అరెస్ట్ అవ్వరన్న దానిపై.. తమ పార్టీ నేతలు అవినీతి చేయరు కనుక జైళ్లకు వెళ్లరన్నారు. బీజేపీలో చేరిన సుజనా చౌదరి, ఎంపీ రమేష్ ల పైన ఉన్న ఈడీ కేసుల్లో ఎందుకు కదలిక లేదన్న ప్రశ్నకు.. ఏపీ సీఎం జగన్ పై కూడా ఈడీ కేసులు ఉన్నా.. ఆ కేసు కూడా మూవ్ కావడం లేదని గుర్తుచేశారు. ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో చెప్పలేమని, అక్కడ ఏం సర్కస్ జరిగినా తమకు అవసరం లేదన్నారు. 

నిజాం షుగర్స్ కోసం ప్రైవేట్ వ్యక్తులను తీసుకొస్తాం, రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గట్లు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్ధిగా ఫిరోజ్ ఖాన్ కు ఛాన్స్ ఇస్తే 100 శాతం గెలిచేవారని జోస్యం చెప్పారు. ఒక్క ఓటు మీద వాజ్ పేయి ప్రభుత్వం కూలిపోయింది, కానీ గోవా, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి పలు రాష్ట్రాల్లో సర్కార్ ను తాము కూల్చలేదన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారం కోల్పోతుందా అంటే బీజేపీ వస్తుందని అంటే తథాస్తు అన్నారు అర్వింద్.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Embed widget