అన్వేషించండి

Nizamabad News: అన్నదాతను ఆగం చేస్తున్న వర్షం- నేలకొరిగిన పంటలు

వాన జోరు రైతన్నను బేజారు చేస్తోంది. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు చేతికొచ్చిన పంట పాడైపోతోంది. కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు.

నిజామాబాద్ జిల్లాలో రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. పంటను కోసి రోడ్లు, కల్లాల్లో ఆరబోసిన సోయా, మొక్కజొన్న ధాన్యాన్ని వానల నుంచి కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. రెండ్రోజులుగా కురిసిన వర్షానికి జిల్లాలోని పలు చోట్ల ధాన్యం తడిసింది. సోయాకు తడి తగిలితే మొలకలు వచ్చే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నాడు.
 
రాత్రులు, తెల్లవారుజామున వర్షం పడడంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ధాన్యం తడవకుండా కుప్పలు చేసి వాటిపై టార్పాలిన్లు కప్పి ఉంచుతున్నారు. వర్షపు నీరు లోపలికి రాకుండా అక్కడే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 59 వేల ఎకరాల్లో సోయా, 30,345 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారు.
 
గత నెల మొదటి వారం నుంచే సోయా, మొక్కజొన్న పంటను కోసి ఆరబెట్టడం ప్రారంభించారు. ఎండిన పంటను ఇప్పటికే వ్యవసాయ మార్కెట్లకు తీసుకువచ్చి అమ్ముతున్నారు. సాగు చేసిన దాంట్లో ఇప్పటి వరకు కేవలం 30 శాతం పంటను మాత్రమే మార్కెట్ కు తరలించారు రైతులు. ఇంకా 70 శాతం పంట రోడ్లు, కల్లాల్లోనే ఉంది. మరో రెండు రోజులైతే పంట పూర్తిగా ఎండేది. చివరి సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణితో జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి.
 
ఈ నెల 10 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ధాన్యాన్ని ఎలా కాపాడుకోవాలో అని రైతులు దిగాలు చెందుతున్నారు. ఇప్పటికే వానకాలం సీజన్లో కురిసిన వర్షాలకు సోయా, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. దిగుబడి తగ్గింది. పంటను అమ్మే సమయంలో కూడా వర్షాలతో నాణ్యతపై ప్రభావం పడే ఆవకాశముంది. 
 
జిల్లాలో వానకాలం సీజన్లో 3.77లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. దాదాపు 60 శాతం పంట ప్రస్తుతం కోతల దశకు చేరుకుంది. వర్ని, బోధన్, ఇతర ప్రాంతాల్లోనైతే వరి కోతలు మొదలయ్యాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కోతకు వచ్చిన పరిపంట నేలకి ఒరుగుతోంది. వర్షాలు ఇంకా ఇలాగే పడితే పంట భారీగా నష్టపోయే అవకాశముంది. దీంతో పంట కోతకు ఇబ్బంది. విత్తనాలు నేలరాలి దిగుబడి తగ్గే ప్రమాదముంది. నేలకొరిగిన వరి పంటను కింది నుంచి కోయాలంటే వరి కోత యంత్రాలకు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తుందని రైతులు అవే దన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో వరి ధర బాగా వస్తోంది. క్వింటాకు 1900 పైనే పలుకుతోంది. ఈ దశలో వరి కొస్తున్న రైతులకు ఈ వర్షాలు తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయ్. 
 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Bhimavaram Beat Song : సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
Mobile Bluetooth: ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
Bharat Taxi App: భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
Embed widget