అన్వేషించండి

Nizamabad News: అన్నదాతలను ఆగం చేసిన అకాల వర్షం - వరి, మామిడి రైతులకు తీరని నష్టం

Nizamabad News: అకాల వర్షంతో నిజామాబాద్ అన్నదాతలు ఆగమయ్యారు. ఈదురుగాలులతో కురిసిన వర్షానికి పంటలన్నీ నాశనం అయ్యాయి. ముఖ్యంగా మామిడి, వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. 

Nizamabad News: ద్రోణి ప్రభావంతో కురిసిన వానలకు అన్నదాతలకు తీరని నష్టం వాటిల్లింది. భారీగా వరి పంట నష్టపోయారు రైతులు. పంట కోతల సమయంలో.. వర్షాలు పడడంతో ధాన్యమంతా వర్షం పాలయ్యింది. కోతకు వచ్చిన వందల ఎకరాల్లో నువ్వులు, జొన్నలు, మామిడి, కూరగాయల పంటలు పండించిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురిసిన వడగళ్ల వాన రైతులను వణికించింది. వరి, నువ్వు, సజ్జ, పంటలు నేలమట్టం అయ్యాయి. కల్లాలపై ఆరబెట్టిన ధాన్యం రైతుల కళ్లెదుటే వరద నీటికి కొట్టుకుపోయింది. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల రాశులు, బస్తాలు తడిసి ముద్దయ్యాయి. దీంతో కొనుగోళ్ల ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. 447 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వ్యవసాయ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పంట నష్టం అంచనాలు రూపొందించాలని జిల్లా వ్యవసాయాధికారి ఆదేశించారు. వరుస వానలతో పొలాల్లో నీరు చేరడంతో కోత యంత్రాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

అకాల వర్షానికి ఆరబెట్టిన ధాన్యమే కాకుండా.. కొనుగోలు చేసిన వడ్లు తడిశాయి. 20 కేంద్రాల్లోని 9 వేల క్వింటాళ్లు తడిసినట్లు అధికారులు గుర్తించారు. దీన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపే విధంగా చర్యలు చేపట్టారు. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని పలు చోట్ల లారీల సమస్య కూడా ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. ధర్పల్లి మండలంలోని ఓ కేంద్రంలో ఇద్దరు రైతులకు చెందిన 75 బస్తాల వడ్లు.. ఆరు రోజుల క్రితం తూకం వేసినా ఇంకా తడుస్తూనే ఉన్నాయి. మరోవైపు రానున్న 3 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉందని కృషి విజ్ఞాన కేంద్రం వాతావరణ శాఖ తెలిపింది. దీంతో కేంద్రాల నిర్వాహకులు, వివిధ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సమీక్షా సమావేసం నిర్వహించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

అటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రెండ్రోజులుగా కురుస్తున్న వడగళ్ల వానతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆరబెట్టిన ధాన్యంలో నిలిచిన వర్షం నీటిని బయటకు బయటకు తీసేందుకు అవస్థలు పడ్డారు. కొన్ని చోట్ల తూకం వేసిన బస్తాలు తడిసిపోయాయి. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది. రాళ్ళ వానకు మామిడి నేల రాలిపోయింది. జొన్నలు, సజ్జలు, మినుములు, పెసర్లు పంట నష్ట పోయారు రైతులు.

ఏ మేర పంటనష్టం జరిగిందో అంచనా వేయాలన్న సీఎం

రాష్ట్రంలో గత రెండు రోజులుగా అక్కడక్కడ కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలు కురిసిన సంగతి తెలిసిందే. అక్కడక్కడా పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్‌, చొప్పదండి, నిజామాబాద్ సహా మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన వడగళ్ల వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయి. అందుకే ఏయే ప్రాంతాల్లో ఎంత మేరకు పంటలు దెబ్బతిన్నాయో అంచనా వేయడానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీ శాంతి కుమారికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ఆయా జిల్లాల్లో దెబ్బతిన్న పంటలకు సంబంధించిన రిపోర్టులు తెప్పించాలని ఆదేశించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు

వీడియోలు

India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
Embed widget