అన్వేషించండి

Nizamabad: ఫ్రిడ్జ్ ఓపెన్ చేయబోతే షాక్ కొట్టి చిన్నారి మృతి, తల్లిదండ్రులూ బీ కేర్‌ఫుల్‌

Nizamabad: నిజామాబాద్ లోని ఎన్ మార్ట్ లో ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయబోతే కరెంట్ షాక్ తగిలి ఓ చిన్నారి మృతిచెందింది.

Nizamabad: తల్లిదండ్రులు పిల్లలతో పాటు ఎక్కడికైనా వెళ్తే.. అందులోనూ ముఖ్యంగా తరచూ వెళ్లే ప్రాంతమైతే.. వారిని అలా కాసేపు వదిలేస్తుంటారు. తమ పని పూర్తి అయ్యాక లేదా పిల్లలు ఏదైనా అల్లరి చేసినప్పుడు వారిని దగ్గరికి తీసుకుంటారు. అయితే ఈ ధోరణి వల్ల కొన్ని సార్లు ప్రమాదాల బారిన పడాల్సిన పరిస్థితి వస్తుంది. రెప్పపాటు కాలంలో కూడా ప్రమాదాలు జరిగి ప్రాణాల మీదకు వస్తుంది. అలాంటి ఓ ఘటన నిజామాబాద్ లో జరిగింది. అభం శుభం తెలియని ఓ చిన్నారి కరెంట్ షాక్ తో చనిపోయింది. ఓ సూపర్ మార్కెట్ లోకి తండ్రితో పాటు వెళ్లిన చిన్నారి.. చాక్లెట్ల కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించగా.. విద్యుదాఘాతానికి గురైంది. వెంటనే గమనించిన తండ్రి చిన్నారిని ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. నిజామాబాద్ నందిపేట్ లోని నవీపేటలో ఈ ప్రమాదం జరిగింది. అసలేం జరిగిందంటే...

నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లోని నవీపేటకు చెందిన రాజశేఖర్ తన నాలుగేళ్ల కూతురు రితీషతో కలిసి N సూపర్ మార్కెట్ వెళ్లారు. తండ్రి రాజశేఖర్ ఒక ఫ్రిడ్జ్ లో తనకు కావాల్సిన వాటి కోసం చూస్తున్న సమయంలోనే నాలుగేళ్ల రితీష.. పక్కనే ఉన్న మరో ఫ్రిడ్జ్ లో చాక్లెట్ల కోసం ఆ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించింది. అంతలో రుషితకు షాక్ తగలడంతో కదలకుండా అలాగే ఉండిపోయింది. చడీచప్పుడు కాకుండా ఉండిపోవడంతో.. పక్కనే ఉన్న తండ్రి కూడా వెంటనే స్పందించలేదు. తన పని పూర్తి చేసుకుని రితీషను గమనించి వెంటనే తనను లాగాడు. పాప స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆ చిన్నారిని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. పాప పరిస్థితి విషమంగా ఉందని నందిపేట వైద్యులు చెప్పడంతో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లేలోగా పాప మరణించిందని బంధువులు తెలిపారు.

దీంతో చిన్నారి రితీష శవంతో ఎన్ మార్ట్ సూపర్ మార్కెట్ వద్దకు తీసుకువచ్చి తమకు న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు. నవీపేట గ్రామానికి చెందిన సంయుక్త, శేఖర్ తమ కుమార్తె రితీషను తీసుకొని నందిపేట గ్రామంలోని అత్తమ్మ ఇంటికి వచ్చారు. అయితే ఈరోజు ఇంటికి వెళ్దామని అనుకొని మండల కేంద్రంలోని ఎన్ మార్ట్ లో షాపింగ్ చేసుకొని వెళ్దామని ఉదయం ఆరున్నర ప్రాంతంలో సూపర్ మార్కెట్ కు కూతురిని తీసుకొని వచ్చారు. షాపింగ్ చేస్తున్న సమయంలో రితీష ఫ్రిడ్జ్ ను ఓపెన్ చేయబోయి కరెంటు షాక్ తో మృతిచెందింది. చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులు, తల్లిదండ్రులు, మిత్రులు ఎన్ మార్ట్ సూపర్ మార్కెట్ ముందు ధర్నా చేపట్టారు. 

N మార్ట్ యజమానులు నిర్లక్ష్యమే కారణమా ?

ఎన్ మార్ట్ సూపర్ మార్కెట్ లోని ఫ్రిడ్జ్ కరెంట్ షాక్ తగలడంతోనే చిన్నారి మృతిచెందడంతో.. తన మృతికి ఎన్ మార్ట్ సూపర్ మార్కెట్ యజమానుల నిర్లక్ష్యమే కారణమని చిన్నారు తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఆరోపిస్తున్నారు. ఫ్రిడ్జ్ ను సరిగ్గా నిర్వహించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని.. తమకు న్యాయం చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. యజమానులు స్పందించక పోవడంతో అగ్రహంతో సూపర్ మార్కెట్ పై రాళ్లతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget