అన్వేషించండి

తెలంగాణ ఏ ఎన్నిక జరిగినా టీఆర్‌ఎస్‌వైపే ప్రజలంతా- ఎమ్మెల్సీ కవిత విశ్వాసం

కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్‌లోని నీలకంఠేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు చేశారు.

ఎన్నిక ఏదైనా ప్రజలంతా కేసీఆర్ వెంటే  ఉన్నారని అభిప్రాయపడ్డారు ఎమ్మెల్సీ కవిత. అవాకులు చవాకులు  పేలిన బిజెపి నేతలకు మునుగోడు ప్రజలు సరైన సమాధానం ఇచ్చారని విమర్శించారు. టిఆర్ఎస్ పార్టీని గెలిపించిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నల్గొండలో హ్యాట్రిక్ సాధించామని... తెలంగాణలో ఏ ఎన్నిక జరిగిన ప్రజలంతా టిఆర్ఎస్ వైపే ఉంటారని జోస్యం చెప్పారు. 

కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్‌లోని నీలకంఠేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు చేశారు. ప్రతి ఏడు లాగానే ఈసారి కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా నీలకంటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని చెప్పారు.. ఆలయంలో స్వామివారి రథం అవసరం ఉన్నట్లు ఆలయ కమిటీ వారు అడిగారని ఇందుకోసం 50 లక్షలతో రథాన్ని ఏర్పాటు చేయిస్తానని వెల్లడించారు.. ఎంతో మహిమగల నీలకంటేశ్వరున్ని కార్తీక పౌర్ణమి సందర్భంగా దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ తెలిపారు. 

గల్ఫ్‌ బాధితులకు అండగా కవిత 

బదుకు దెరువు కోసం ఖతార్ వెళ్లిన ఇద్దరు మహిళలకు ఎమ్మెల్సీ కవిత అండగా నిలిచారు. దేశం కాని దేశంలో నరకయాతన అనుభవించి జైల్లో చిక్కుకున్న బాధితులను క్షేమంగా స్వదేశానికి రప్పించారు. నిజామాబాద్ నగరం డ్రైవర్స్ కాలానీకి చెందిన ఆసియా బేగం, షేక్ నసీమాలు గత పది నెలల క్రితం బతుకు దెరువు కోసం ఖతర్ దేశానికి వెళ్లారు. అక్కడ ఓ ఇంట్లో పనికి చేరారు. కొన్ని రోజుల తర్వాత పనిలో చేర్చుకున్న వారు జీతం సరిగ్గా ఇవ్వకపోగా వేధింపులకు గురి చేశారు. ఇద్దరు మహిళతో పని చేయించుకుంటూ, అటు జీతం డబ్బులు ఇవ్వక, తిండి కూడా సరిగ్గా పెట్టకుండా నానా ఇబ్బందులు పెట్టారు. కనీసం తాగేందుకు మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా నరకం చూపించారని బాధితులు చెబుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన తమపై వేడి నీళ్లు పోసి నరకాయాతనకు గురిచేశారని తెలిపారు. బాధితులు అక్కడి పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. 

అయితే వేధింపులు తట్టుకోలేని వాళ్లు తప్పించుకొని బయటకు రావడంతో.. పోలీసులు రన్ అవే కేసు కింద వారిని జైల్లో పెట్టారు. బాధితులు ఈ విషయాన్ని నిజామాబాద్ నగరంలో ఉన్న వారి బంధువుల ద్వారా జాగృతి నాయకులకు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత పెద్ద మనసుతో వారికి అండగా నిలిచారు. అధికారులతో మాట్లాడి కేవలం 10 రోజుల్లో బాధితులను క్షేమంగా ఇంటికి చేర్చారు. ఇక్కడికి వచ్చేందుకు ఖర్చు మొత్తం కవితే భరించారని బాధితులు తెలిపారు. తమను క్షేమంగా ఇంటికి చేర్పించిన ఎమ్మెల్సీ కవితకు జీవితాంతం రుణపడి ఉంటామని వారు వివరించారు. బాధితులను ఈరోజు జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి అవంతి సుధాకర్ తదితరు వెళ్లి మాట్లాడారు.

గల్ఫ్ ఏజెంట్ల మోసాలతో.. నరకం చూస్తున్న వలసజీవులు!

గల్ప్ ఏజెంట్ల మోసాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. గ్రామాల్లో ఉండే నిరుద్యోగ యువతను టార్గెట్ చేసుకుని మోసాలకు తెగబడుతున్నారు. గల్ఫ్ దేశాలు, ఇతర విదేశాల్లో అధిక జీతాలు ఇప్పిస్తామని ఆశచూపి మోసాలకు పాల్పడుతున్నారు. భోజనంతో పాటు ఉచిత వసతి సదుపాయం ఉంటుందని నమ్మిస్తున్నారు. కాగితాలపై లెక్కలు బేరీజు వేసుకుంటున్న యువత వారు చెప్పిన వెంటనే పాస్ పోర్టు ఇతర గుర్తింపు కార్డులు అప్పగిస్తున్నారు. తీరా వీసా వచ్చేసిందని నమ్మించి రూ. 90 వేల నుంచి లక్ష దాకా వసూలు చేస్తున్నారు. ఇంటర్వ్యూలు, మెడికల్ పరీక్షల పేరిట నెలల తరబడి కాలయాపన చేస్తున్నారు. చివరకు గల్ఫ్ దేశాలకు పంపించకుండానే నిలువునా మోసగిస్తున్నారు. మోసపోయిన యువత పోలీసుల వద్దకు వెళితే పట్టించుకోవటం లేదని, తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Kadem Forest Missing Farmer: అడవిలోకి వెళ్లిన గేదెలు వచ్చాయి కానీ పశువుల కాపరి మాత్రం రాలేదు - అడవిలో తప్పిపోయిన వృద్ధ రైతు - డ్రోన్లతో పోలీసుల ముమ్మర గాలింపు!
అడవిలోకి వెళ్లిన గేదెలు వచ్చాయి కానీ పశువుల కాపరి మాత్రం రాలేదు - డ్రోన్లతో కడెం పోలీసుల ముమ్మర గాలింపు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget