అన్వేషించండి

తెలంగాణ ఏ ఎన్నిక జరిగినా టీఆర్‌ఎస్‌వైపే ప్రజలంతా- ఎమ్మెల్సీ కవిత విశ్వాసం

కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్‌లోని నీలకంఠేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు చేశారు.

ఎన్నిక ఏదైనా ప్రజలంతా కేసీఆర్ వెంటే  ఉన్నారని అభిప్రాయపడ్డారు ఎమ్మెల్సీ కవిత. అవాకులు చవాకులు  పేలిన బిజెపి నేతలకు మునుగోడు ప్రజలు సరైన సమాధానం ఇచ్చారని విమర్శించారు. టిఆర్ఎస్ పార్టీని గెలిపించిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నల్గొండలో హ్యాట్రిక్ సాధించామని... తెలంగాణలో ఏ ఎన్నిక జరిగిన ప్రజలంతా టిఆర్ఎస్ వైపే ఉంటారని జోస్యం చెప్పారు. 

కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్‌లోని నీలకంఠేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు చేశారు. ప్రతి ఏడు లాగానే ఈసారి కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా నీలకంటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని చెప్పారు.. ఆలయంలో స్వామివారి రథం అవసరం ఉన్నట్లు ఆలయ కమిటీ వారు అడిగారని ఇందుకోసం 50 లక్షలతో రథాన్ని ఏర్పాటు చేయిస్తానని వెల్లడించారు.. ఎంతో మహిమగల నీలకంటేశ్వరున్ని కార్తీక పౌర్ణమి సందర్భంగా దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ తెలిపారు. 

గల్ఫ్‌ బాధితులకు అండగా కవిత 

బదుకు దెరువు కోసం ఖతార్ వెళ్లిన ఇద్దరు మహిళలకు ఎమ్మెల్సీ కవిత అండగా నిలిచారు. దేశం కాని దేశంలో నరకయాతన అనుభవించి జైల్లో చిక్కుకున్న బాధితులను క్షేమంగా స్వదేశానికి రప్పించారు. నిజామాబాద్ నగరం డ్రైవర్స్ కాలానీకి చెందిన ఆసియా బేగం, షేక్ నసీమాలు గత పది నెలల క్రితం బతుకు దెరువు కోసం ఖతర్ దేశానికి వెళ్లారు. అక్కడ ఓ ఇంట్లో పనికి చేరారు. కొన్ని రోజుల తర్వాత పనిలో చేర్చుకున్న వారు జీతం సరిగ్గా ఇవ్వకపోగా వేధింపులకు గురి చేశారు. ఇద్దరు మహిళతో పని చేయించుకుంటూ, అటు జీతం డబ్బులు ఇవ్వక, తిండి కూడా సరిగ్గా పెట్టకుండా నానా ఇబ్బందులు పెట్టారు. కనీసం తాగేందుకు మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా నరకం చూపించారని బాధితులు చెబుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన తమపై వేడి నీళ్లు పోసి నరకాయాతనకు గురిచేశారని తెలిపారు. బాధితులు అక్కడి పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. 

అయితే వేధింపులు తట్టుకోలేని వాళ్లు తప్పించుకొని బయటకు రావడంతో.. పోలీసులు రన్ అవే కేసు కింద వారిని జైల్లో పెట్టారు. బాధితులు ఈ విషయాన్ని నిజామాబాద్ నగరంలో ఉన్న వారి బంధువుల ద్వారా జాగృతి నాయకులకు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత పెద్ద మనసుతో వారికి అండగా నిలిచారు. అధికారులతో మాట్లాడి కేవలం 10 రోజుల్లో బాధితులను క్షేమంగా ఇంటికి చేర్చారు. ఇక్కడికి వచ్చేందుకు ఖర్చు మొత్తం కవితే భరించారని బాధితులు తెలిపారు. తమను క్షేమంగా ఇంటికి చేర్పించిన ఎమ్మెల్సీ కవితకు జీవితాంతం రుణపడి ఉంటామని వారు వివరించారు. బాధితులను ఈరోజు జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి అవంతి సుధాకర్ తదితరు వెళ్లి మాట్లాడారు.

గల్ఫ్ ఏజెంట్ల మోసాలతో.. నరకం చూస్తున్న వలసజీవులు!

గల్ప్ ఏజెంట్ల మోసాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. గ్రామాల్లో ఉండే నిరుద్యోగ యువతను టార్గెట్ చేసుకుని మోసాలకు తెగబడుతున్నారు. గల్ఫ్ దేశాలు, ఇతర విదేశాల్లో అధిక జీతాలు ఇప్పిస్తామని ఆశచూపి మోసాలకు పాల్పడుతున్నారు. భోజనంతో పాటు ఉచిత వసతి సదుపాయం ఉంటుందని నమ్మిస్తున్నారు. కాగితాలపై లెక్కలు బేరీజు వేసుకుంటున్న యువత వారు చెప్పిన వెంటనే పాస్ పోర్టు ఇతర గుర్తింపు కార్డులు అప్పగిస్తున్నారు. తీరా వీసా వచ్చేసిందని నమ్మించి రూ. 90 వేల నుంచి లక్ష దాకా వసూలు చేస్తున్నారు. ఇంటర్వ్యూలు, మెడికల్ పరీక్షల పేరిట నెలల తరబడి కాలయాపన చేస్తున్నారు. చివరకు గల్ఫ్ దేశాలకు పంపించకుండానే నిలువునా మోసగిస్తున్నారు. మోసపోయిన యువత పోలీసుల వద్దకు వెళితే పట్టించుకోవటం లేదని, తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Embed widget