అన్వేషించండి

Kawal Tiger Reserve: చెక్ పోస్టుల వద్ద రాత్రిపూట వాహనాల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్, మంత్రి కొండా సురేఖ ఆదేశాలు

Konda Surekha | అటవీ శాఖ చెక్ పోస్టుల వద్ద రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలకు మంత్రి కొండా సురేఖ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Telangana News | ఆదిలాబాద్: జిల్లాలోని కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని అటవీ శాఖ చెక్ పోస్టుల వద్ద రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలను అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడంతో అటవీశాఖ అధికారుల చర్యలకు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అడ్డుకట్ట వేశారు. రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలను అడ్డుకోవద్దని సంబంధిత జిల్లాల అటవీ అధికారుకారులకు సూచనలు జారీ చేయాలని రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కంజర్వెటర్ ను కొండా సురేఖ ఆదేశించారు. 

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్ మంత్రి కొండా సురేఖను హైదరాబాద్ లో మంగళవారం కలిశారు. రాత్రి వేళల్లో అటవీ చెక్ పోస్టుల వద్ద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి ఎఫ్డిపీటీ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు రిక్వెస్ట్ లేఖపై స్పందించిన మంత్రి ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని పిసిసిఎఫ్ కు సూచించారు. రాత్రి వేళల్లో అటవీ శాఖ చెక్ పోస్టుల వద్ద వాహనాల రాకపోకలకు అనుమతించాలని పిసిసిఎఫ్ ను ఆదేశించారు.


Kawal Tiger Reserve: చెక్ పోస్టుల వద్ద రాత్రిపూట వాహనాల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్, మంత్రి కొండా సురేఖ ఆదేశాలు

జనవరి మొదటి వారంలో వాహనాలు నిలిపివేసిన అధికారులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు వాహనాలు వెళ్ళకూడదని అటవీ అధికారులు తీసుకొచ్చిన నిబంధనలు స్థానికులను ఇబ్బందులకు గురిచేశాయి. ఈ క్రమంలో జనవరి 4న రాత్రి ఉట్నూర్ మండలంలోని కొత్తగూడ చెక్ పోస్ట్ వద్ద పలు వాహనాలను చెక్ పోస్ట్ సిబ్బంది నిలిపివేశారు. ఆ సమయంలో వాహనాలను అనుమతించేది లేదని అటవీశాఖ అధికారులు, చెక్ పోస్ట్ సిబ్బంది చెప్పడంతో వాహనదారులు షాకయ్యారు. 

అర్థరాత్రి పూట చెక్ పోస్ట్ వద్దకు ఎమ్మెల్యే
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కు కొందరు వాహనదారులు ఫోన్ చేసి విషయం చెప్పారు. చెక్ పోస్ట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయని సమాచారంతో ఎమ్మెల్యే అర్ధరాత్రి  హుటాహుటిన కారులో కొత్తగూడ చెక్ పోస్ట్ కు చేరుకున్నారు. ప్రయాణికులతో మాట్లాడిన ఆయన.. తీవ్ర చలితో వారు పడుతున్న బాధలు చూసి చెక్ పోస్ట్ సిబ్బందిని నిలదీశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రాత్రివేళ వాహనాలు అనుమతించడం లేదని చెక్ పోస్ట్ సిబ్బంది చెప్పడంతో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు నిర్మల్ ఎఫ్డిపిటి శాంతారాంకు ఫోన్ చేసి విషయం చెప్పారు. తాను ఎమ్మెల్యేనే కాకుండా వైల్డ్ లైఫ్ బోర్డు సభ్యుడినని, తమకు తెలియకుండా కొత్త నిబంధనలు ఎలా తీసుకొచ్చారని ప్రశ్నించారు. 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత అధికమైంది. చలిలో అర్ధరాత్రి పూట కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని, వారిలో పసిపిల్లలు, వృద్ధులు సైతం ఉన్నారని తెలిపారు. ఆదిలాబాద్ డిఎఫ్ఓతో సైతం ఖానాపూర్ ఎమ్మెల్యే ఫోన్ చేసి మాట్లాడి పరిస్థితి వివరించారు. అధికారుల ఆదేశం మేరకు బిర్సాయిపేట రేంజ్ అధికారి వాహనాలు వెళ్లేందుకు అనుమతించారు. రాత్రిపూట వచ్చి తమకు సహాయం చేసిన ఎమ్మెల్యేకు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. తాను త్వరలోనే ఈ విషయాన్ని మంత్రి, లేక సీఎం దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఈ క్రమంలో సరిగ్గా నెల రోజులకు అటవీశాఖ మంత్రి కొండా సురేఖను కలిసి సమస్య వివరించి, లేఖ అందజేశారు. ఈ మేరకు మంత్రి కొండా సురేఖ చెక్ పోస్టుల వద్ద వాహనాల రాకపోకలకు సహకరించాలని అధికారులకు సూచించారు.

Also Read: Telangana Assembly: ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం నాకొచ్చింది - ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై రేవంత్ రెడ్డి ప్రకటన

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
Embed widget