అన్వేషించండి

Nizamabad News: నకిలీ పోలీస్ గుట్టు రట్టు చేసిన నిజామాబాద్ జిల్లా పోలీసులు

నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసిన దొంగపోలీస్ బాగోతం. పోలీసునని చెప్పి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు. స్పెషల్ పార్టీ పోలీస్ పేరుతో ఫోన్, డబ్బులు వసూలు చేసిన వ్యక్తి.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలీస్‌నని చెప్పుకుంటూ డబ్బులు వసూల్ చేస్తూ చోరీలకు పాల్పడిన వ్యక్తిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగుండా గ్రామానికి చెందిన కృష్ణ రాథోడ్ కరీంనగర్ జిల్లా కంట్రాపూర్లో నివాసం ఉంటున్నట్లు తెలిపారు సీపీ నాగరాజు. ఈ నెల 25న నగరంలోని నందివాడలోని దాత్రిక భీమన్న కిరాణాషాపులో గుట్కా అమ్ముతున్నారని స్పెషల్ పార్టీ పోలీస్ పేరుతో బెదిరించి అతని వద్ద ఉన్న సెల్ ఫోన్ చోరీ చేసి పరారయ్యాడు. దీనిపై మూడో టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశారు. నకిలీ పోలీస్ అంటూ చెప్పుకుని చోరీలకు పాల్పడుతున్నాడని గ్రహించిన ఖాకీలు స్పెషల్ ఫోకస్ పెట్టారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా పంబౌలీ రైల్వే క్వార్టర్స్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అరెస్టు చేసి పోలీసులు విచారించారు. దీంతో అసలు నిజాలు బయటపడ్డాయ్. అతని వద్ద ఉన్న బైక్ పేపర్స్ అడగ‌్గా... బైక్ ను ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలంలోని ఇందపల్లి ఎక్స్ రోడ్డు వద్ద దొంగతనం చేసినట్లు కృష్ణ రాథోడ్ ఒప్పుకున్నాడు. దీంతో నకిలీ పోలీస్ బాగోతం బయటపడింది. కృష్ణ రాథోడ్ నుంచి సెల్‌ఫోన్‌, బైక్ స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

మరోవైపు నిజామాబాద్ నగరంలో రాత్రుల్లో ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆటోనగర్‌లోని సతీష్ నగర్‌కు చెందిన మేకల సుదర్శన్ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 6 లక్షల 36 వేల 80 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ నాగరాజు తెలిపారు. ఈనెల 6న నిజామాబాద్ నగరంలోని రహమాన్ కట్ పీస్ సెంటర్ లో అర్దరాత్రి సమయంలో షట్టర్ ను కట్ చేసి కౌంటర్ నుంచి 9 లక్షల రూపాయలు చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. 15 రోజుల క్రితం ఓ ఐస్ క్రీమ్ షాప్ కౌంటర్ నుంచి 15000 రూపాయల నగదు చోరీకి సుదర్శన్ పాల్పడినట్లు తెలిపారు.

కామారెడ్డి జిల్లాలో దొంగల బెడద..

ఎల్లారెడ్డిలో సిగరెట్లు, పాన్ మెటీరియల్, ఇతర వస్తువులను దొంగలు చోరీ చేసినట్లు బాధితుడు అఖిల్ తెలిపారు. సోమవారం రాత్రి పాన్ షాపు మూసివేసి ఇంటికి వెళ్లి ఉదయం వచ్చి చూడగా చోరీ విషయం వెలుగులోకి వచ్చినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భిక్కనూరు మండలంలోని రామేశ్వర్పల్లికి చెందిన పైళ్ల రాజమణి ఇంట్లో మంగళవారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి టీవీని చోరీ చేసినట్లు ఎస్సై హైమద్ తెలిపారు. బాధితురాలు వేకువ జామున లేచి తమ ఇంటి ముందు వాకిలి ఊడ్చింది. అనంతరం తన కుమార్తె సువర్ణ హైదరాబాద్ వెళ్లడంతో ఆమె ఇంటి ముందు వాకిలిని ఊడ్చేందుకు వెళ్లి తిరిగి వచ్చేలోగా ఇంట్లో ఉన్న టీవీ కనిపించలేదు. సీసీ కెమెరా పుటేజీలు పరిశీలించగా అక్కడ ఓ వ్యక్తి బైక్‌పై అనుమానాస్పదంగా తిరిగినట్లు గుర్తించారు. రాజమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Adilabad Fake Aadhaar Certificate Gang Arreste: ఆదిలాబాద్‌లో ఘరానా నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు - ఐదుగురు కేటుగాళ్లు అరెస్ట్!
ఆదిలాబాద్‌లో ఘరానా నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు - ఐదుగురు కేటుగాళ్లు అరెస్ట్!
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget