![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
KCR in Banswada: మొండి కత్తి మాకు దొరకదా? మాకూ దమ్ముంది, దుమ్ము కూడా మిగలదు - కేసీఆర్ వార్నింగ్
బాన్సువాడ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ఎంపీపై జరిగిన దాడి గురించి మాట్లాడారు.
![KCR in Banswada: మొండి కత్తి మాకు దొరకదా? మాకూ దమ్ముంది, దుమ్ము కూడా మిగలదు - కేసీఆర్ వార్నింగ్ CM KCR warns opposition party leaders from banswada over attack on Kotha Prabhakar reddy KCR in Banswada: మొండి కత్తి మాకు దొరకదా? మాకూ దమ్ముంది, దుమ్ము కూడా మిగలదు - కేసీఆర్ వార్నింగ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/c89fe2a36740872b9cc5f73a8a0651901698663554355234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించారు. బాన్సువాడ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ఎంపీపై జరిగిన దాడి గురించి మాట్లాడారు. చేతకాని దద్దమ్మ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని కేసీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ఇది రాజకీయమా అరాచకమా అని ప్రశ్నించారు. కడుపు, నోరు కట్టుకొని పని చేస్తున్న వారిపై ఈ దాడులు ఏంటని ప్రశ్నించారు. పని చేతకాక, ఎన్నికలు ఎదుర్కొనే దమ్ము లేక ఈ దద్దమ్మలు కత్తులతో దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. వీరికి తెలంగాణ ప్రజానికమే ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపు ఇచ్చారు.
ఇది కేసీఆర్ పైన జరిగిన దాడి - సీఎం
‘‘కాంగ్రెస్ పాలకులు నిజాం సాగర్ కు ఏ గతి పట్టించారో తెలుసుకోవాలని అన్నారు. ‘‘పోచారం శ్రీనివాస్ రెడ్డికి తిరిగే కాలు ఊరుకోదు, చేసిన చెయ్యి ఊరుకోదు. ఆయనకు పని చేసే అలవాటు. నా నియోజకవర్గంలో కన్నా అధికంగా 11 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను బాన్సువాడ నియోజకవర్గానికి తెప్పించిన వ్యక్తి ఆయన. పోచారంను లక్ష పైచిలుకు మెజారిటీతో గెలిపించండి’’ అని కేసీఆర్ పిలుపు ఇచ్చారు.
ఫోన్లో వివరాలు తెలుసుకున్న సీఎం
ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజా తీర్పు ను ఎదుర్కోలేక ఇలాంటి భౌతిక దాడులు, హత్యా రాజకీయాలకు తెగబడడం సిగ్గుచేటు అని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల సమయం లో ఇటువంటి సంఘ విద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు బీఆర్ఎస్ నేతలకు, కార్యకర్తలకు అధినేత కేసీఆర్ పిలుపు ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై ఎవరు దాడులకు పాల్పడ్డా సహించేది లేదని సీఎం అన్నారు. ప్రస్తుతం నియోజకవర్గాల పర్యటనలో ఉన్న సీఎం
ఈ దుర్ఘటన పై మంత్రి హరీశ్ రావు ను సీఎం ఫోన్లోఆరా తీశారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి మెరుగైన చికత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నేడు సీఎం కేసీఆర్ జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో పర్యటించారు. తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్నందున సీఎం కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్లో రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాలను చుట్టి వస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)