అన్వేషించండి

Telangana Election: కామారెడ్డి కాంగ్రెస్ లో గందరగోళం, ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్న అసంతృప్త నేతలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ.. కాంగ్రెస్‌లో రోజురోజుకూ రెబల్స్ బెడద ఎక్కువ అవుతోంది. టికెట్ దక్కని నేతల్లో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ.. కాంగ్రెస్‌లో రోజురోజుకూ రెబల్స్ బెడద ఎక్కువ అవుతోంది. టికెట్ దక్కని నేతల్లో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. మరికొంత మంది పార్టీని వీడుతున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

టికెట్ దక్కకపోవడంతో బోరున విలపించిన ఎల్లారెడ్డి కాంగ్రెస్ కో ఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి.. పార్టీకి రాజీనామా చేశారు. రెబల్‌గా పోటీ చేస్తానని ప్రకటించడమే కాకుండా.. తనను మోసం చేసిన రేవంత్‌ను సైతం ఓడిస్తానని శపథం చేశారాయన. ఎల్లారెడ్డిలో కె.మదన్‌ మోహన్‌రావుకు టికెట్ కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది సుభాష్‌రెడ్డి వర్గం.

ఇక జుక్కల్‌లో మాజీ ఎమ్మెల్యే గంగారాం తన అనుచరులతో ఇవాళ సమావేశం కాబోతున్నారు. జుక్కల్ టికెట్ పెండింగ్‌లో పెట్టడంపై ఆయన అసంతృప్తిలో ఉన్నారు. దీనిపై అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఇక బాన్సువాడ టికెట్ కోసం రెండు వర్గాలు పోటీపడటంతో పెండింగ్‌లో పెట్టింది అధిష్టానం. దీంతో రెండు వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

పార్టీ ఔన్నత్యాన్ని పెంచిన తనకు టికెట్‌ ఇవ్వకుండా కాంగ్రెస్‌ ఇలా మోసం చేస్తుందనుకోలేదని సుభాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డిలో కాంగ్రెస్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్న సమయంలో తాను ఎన్నో కార్యక్రమాలు చేపట్టి పార్టీని బతికించానని తెలిపారు. ఇంతచేసినా తనకు ఎందుకు టికెట్‌ ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు. సర్వేల పేరు తో మోసం చేశారని, ఇవాళ పార్టీని తెలంగాణలో నాశనం పట్టించారని ఆగ్రహించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకోసం పనిచేసిన వారికి కాకుండా ఇతరులకు టికెట్లు ఇవ్వడం బాధగా ఉన్నదన్నారు. కార్యకర్తలతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు నిర్ణయాన్ని ప్రకటిస్తానని సుభాష్ రెడ్డి తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, తన అభిమానులు సంయమనం పాటించాలని, ఎలాంటి ఆందోళనలు చేపట్టవద్దని విజ్ఞప్తి చేశారు.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దుః కేటీఆర్

మరోవైపు అధికార పార్టీ బీఆర్ఎస్ అన్ని వర్గాలను కలుపుపోయే పనిలో పడింది. అసమ్మతి నేతలకు బుజ్జగింపులతో పాటు స్థానిక సమస్యలపై ఫోకస్ పెట్టారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే. తారక రామారావు. తననున కలిసిన కామారెడ్డి రైతు జేఏసీ బృందం కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేస్తున్నట్లు తెలిపారు కేటీఆర్. ఇప్పటికే రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్ ని రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్ శాఖ తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు కేటీఆర్.

మరోసారి డిటిసిపి అధికారులతో మాట్లాడిన కేటీఆర్.. ప్రస్తుతం అమలులో ఉన్న పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చిన కేటీఆర్.. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రద్దుకు సంబంధించి మునిసిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. కేటీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల రైతు జేఏసీ ధన్యవాదాలు తెలిపింది. అలాగే రైతు జేఏసీ నిరసన కార్యక్రమాల సందర్భంగా నమోదైన కేసులను కూడా సానుకూలంగా పరిశీలించి ఎత్తేసే చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Railway Guidelines For Ghee : రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
హైబ్రిడ్ SUVని లాంచ్ చేసిన చైనా కంపెనీ, పూర్తి ట్యాంక్‌తో 1700 KM జర్నీ చేయవచ్చు.. ధర ఎంతంటే
హైబ్రిడ్ SUVని లాంచ్ చేసిన చైనా కంపెనీ, పూర్తి ట్యాంక్‌తో 1700 KM జర్నీ చేయవచ్చు.. ధర ఎంతంటే
Embed widget