అన్వేషించండి

Nagoba Jatara: ఈ 21న నాగోబా మహపూజ, పవిత్ర జలం కోసం మెస్రం వంశీయులు పాదయాత్ర షురూ

ఆదివాసీల ఆరాధ్యదైవం ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ నాగోబా జాతర మహాపూజలకు కావాల్సిన పవిత్ర జలం కోసం మెస్రం వంశీయులు ఆదివారం కాలినడకన బయలుదేరారు.

రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదివాసీల ఆరాధ్యదైవం కేస్లాపూర్‌ నాగోబా జాతర మహాపూజలకు కావాల్సిన పవిత్ర జలం కోసం మెస్రం వంశీయులు ఆదివారం కాలినడకన బయలుదేరారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఇంటి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మెస్రం వంశీయులు గ్రామ పటేల్‌ ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావు అధ్యక్షతన సమావేశమై పవిత్ర జలం కోసం వెళ్లే రూట్‌ను ఎంపిక చేశారు. ముందుగా పవిత్ర జలం సేకరణ కళిశాన్ని పూజా సామాగ్రిని బయటకు తీసి ప్రత్యేక పూజలు చేశారు. 
అనంతరం కాలినడకన పవిత్రజలం కోసం బయల్దేరే వారికి మేస్రం వంశ పటెల్ పవిత్ర జలం పాదయాత్ర సాఫీగా కొనసాగి అందరు క్షేమంగా వెళ్ళి పవిత్ర జలం తీసుకురావాలని కళిశం చేతబట్టిన కటోడా నుంచి మొదలుకొని అలయ్ బలయ్ చేసుకొని మొక్కి పాదయాత్ర ప్రారంభించారు. ముందు మెస్రం వంశీయులు అక్క, చెల్లెళ్లకు కానుకలు సమర్పించి బయల్దేరారు. ఈ కాలినడకన చేపట్టిన పాదయాత్రలో వందకు పైగా మెస్రం వంశీయులు పాల్గొన్నారు. 


Nagoba Jatara: ఈ 21న నాగోబా మహపూజ, పవిత్ర జలం కోసం మెస్రం వంశీయులు పాదయాత్ర షురూ
కేస్లాపూర్ నుంచి ప్రారంభించిన పాదయాత్ర ఆదివారం రాత్రి ఇంద్రవెల్లి మండలంలోని పిట్టబొంగరంలో బస చేసుకొని, తిరిగి ఉదయం సోమవారం ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్ లో, జనవరి 3న గాదిగూడ మండలంలోని లోకారి, జనవరి 4న గాదిగూడ మండలంలోని బోడ్డిగూడ, జనవరి 5న గాదిగూడ మండలంలోని గణేష్ పూర్, జనవరి 6న కుమ్రం భీం జిల్లాలోని జైనూరు మండలంలోని లేండిజాల, జనవరి 7న జైనూరు, జనవరి 8న లింగాపూర్ మండలంలోని ఘుమ్నూరు, జనవరి 9న మంచిర్యాల జిల్లా దస్తురాబాద్ మండలంలోని మల్లాపూర్‌, జనవరి 10న జన్నారం మండలం గోదావరి హస్తిలమడుగు వద్దకు చేరుకుంటామని వివరించారు. జనవరి 10 వ తేదిన హస్తలమడుగులో గోదావరమ్మకు పూజలు నిర్వహించి పవిత్ర జలం సేకరిస్తామన్నారు. అనంతరం అక్కడ నుండి తిరుగు పయనంలో ఉట్నూర్‌ బస, జనవరి 11న దోడందా, జనవరి 12 నుంచి 16 వరకు పాదయాత్ర విశ్రాంతి చేపట్టి జాతరకు బయలుదేరేందుకు సిద్దమవుతారు. 

Nagoba Jatara: ఈ 21న నాగోబా మహపూజ, పవిత్ర జలం కోసం మెస్రం వంశీయులు పాదయాత్ర షురూ

జనవరి 17 తేదిన అంతా సకుటుంబ సమేతంగా ఎడ్ల బండ్లపై  ఇంద్రవెల్లి లోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుని పూజలు చేస్తామన్నారు. అదేరోజు సాయంత్రం కేస్లాపూర్‌లో ఉన్న వడమర (మర్రిచెట్టు) వద్దకు చేరుకొని, మర్రి చెట్టు వద్ద మూడు రోజుల పాటు బస చేశాక 21న ఆలయ సమపంలోని గోవాడకు చేరుకొని అదేరోజు అర్ధరాత్రి నాగోబాకు పవిత్ర జలాభిషేకం చేసి మహాపూజ చేస్తామన్నారు. ఆ రోజు నుండి నాగోబా జాతర ప్రారంభమువుతుందని మెస్రం వంశీయులు తెలిపారు.


Nagoba Jatara: ఈ 21న నాగోబా మహపూజ, పవిత్ర జలం కోసం మెస్రం వంశీయులు పాదయాత్ర షురూ

ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయులు ప్రధాన్‌ మెస్రం దాదారావు, కోటోడ మెస్రం కోసు, మెస్రం హన్మంత్‌రావు, మెస్రం వంశం ఉద్యోగుల సంఘం సభ్యులు మెస్రం మనోహర్‌, మెస్రం దేవ్‌ రావు, మెస్రం శేఖర్, మెస్రం తుకారం, మెస్రం నాగ్‌ నాథ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ నాగోబా జాతరకు, మహా పూజకు హాజరు కావాలని మంత్రి కేటీఆర్ ను ఇదివరకే ఆహ్వానించడం తెలిసిందే.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget