అన్వేషించండి

Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల ఆందోళన - ఆసిఫాబాద్‌ లో పరిస్థితి ఉద్రిక్తం!

Adilabad News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. పత్తికి కనీస మద్దతు ధర రూ.15,000 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

Adilabad News: పత్తికి కనీస మద్దతు ధర రూ.15,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో సోమవారం రైతులు బంద్ చేపట్టగా.. ఆసిఫాబాద్‌, వాంకిడిలో రైతుల బంద్ సంపూర్ణంగా కొనసాగింది. అనంతరం ఆసిఫాబాద్‌ - వాంకిడి జాతీయ రహదారిపై రైతులు మూడు గంటల పాటు రాస్తారోకో చేపట్టారు. జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు రైతులను అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రహదారి లైన్ క్లీయర్ అయ్యాక పోలీసులు రైతులను వదిలి పెట్టారు. అటు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, ఇంద్రవెల్లి మండలాల్లోనూ రైతులు రాస్తారోకో చేపట్టారు.

గత కొన్ని రోజులుగా కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ రైతులు అన్నదాతలు పోరాటం కొనసాగిస్తున్నారు. అయితే ముందుగానే రైతులు ఆసిఫాబాద్ జిల్లా బంద్ కు పిలుపునివ్వగా... ఆసిఫాబాద్‌ వాంకిడి మండలాల్లో రైతులు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. అనంతరం ఆసిఫాబాద్‌ - వాంకిడి మద్య పెద్దవాగు సమీపంలో పత్తి రైతులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. మూడు గంటలపాటు రాస్తారోకో చేపట్టగా జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు రైతులను ఆందోళన విరమింప జేసేందుకు ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రైతులను పోలీసులు అరెస్ట్ చేసి వాహనాలలో స్థానిక పోలిస్ స్టేషన్ కు తరలించారు. రహదారి లైన్ క్లీయర్ అయ్యాక రైతులను వదలిపెట్టారు. 

అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా..

ఆదిలాబాద్ లో ఆందోళన చేపట్టిన పత్తి రైతులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతు సంఘం నాయకులు మద్దతు తెలుపుతూ రాస్తారోకో చేశారు. పత్తికి కనీస మద్దతు ధర రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో రైతులకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. రైతు సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే రాష్ట్ర సర్కారు అన్నదాతల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఏఐసీసీ సభ్యులు నరేష్ జాదవ్ ఆరోపించారు. పత్తి రైతుకు మద్దతు ధరను పెంచాలని, సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చోడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా గంట పాటు రోడ్డును నిర్బంధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధిక వర్షపాతంతో ఈసారి పంట దిగుబడి అంతంత మాత్రమే వచ్చిందని, దీంతో పెట్టుబడులు సైతం ఎల్లక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నాయని ఫైర్ అయ్యారు. రోజు రోజుకు పత్తి ధర తగ్గుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు.

అటు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోను రాస్తారోకో చేపట్టారు. పత్తి పంటకు మద్దతు ధర రూ 15 వేల వరకు పెంచేంత వరకు రైతుల పక్షాన నిలబడి కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఏఐసీసీ రీసెర్చ్ డిపార్ట్మెంట్ రాష్ట్ర కో ఆర్డినేటర్ వినోద్ నాయక్ అన్నారు. సోమవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పాలిట శాపంగా మారాయని అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పండించిన పత్తి పంటకు ధర పెంచకపోవడం దారుణం అన్నారు. కేంద్ర ప్రభుత్వం అంబానీ, అధాని చేతులతో దేశాన్ని పెట్టీ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకునే నాథుడే కరువయ్యాడని అన్నారు. రైతులకు ఎల్లపుడూ అండగా ఉంటుందని అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Soyam Bapu Rao: ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget