అన్వేషించండి

News: అంటార్కిటికాలోని ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణ రైతు కూతురు

Yadadri News: తెలంగాణలోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన ఓ 24 ఏళ్ల అమ్మాయి అంటార్కిటికాలోని ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి భారతీయ ఖ్యాతిని రెట్టింపు చేసింది.  

Yadadri News: సామాన్య రైతు కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి అంటార్కిటికాలోని ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి దేశంతో పాటు తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరికి చెందిన అన్విత పడమటి పర్వతారోహణలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆమె తండ్రి మధుసూదన్ రెడ్డి రైతు. తల్లి చంద్రకళ అంగన్వాడీ స్కూల్ లో పని చేస్తున్నారు. ఏడు ఖండాల్లో విస్తరించి ఉన్న ఏడు శిఖరాలను అధిరోహించాలన్న లక్ష్యంతో అన్విత ముందుకెళ్తోంది. అంటార్కిటికాలో ఈ ఘనత ఆమె నాలుగో విజయంగా చెప్పుకోవాలి. మౌంట్ మనుస్లూ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన మూడు నెలల తర్వాత అన్విత పడమటి అంటార్కిటికాలోని ఎత్తైన శిఖరాన్ని అధిరోహించింది.

డిసెంబర్ 17వ తేదీన అంటార్కిటికా ఖండంలోని ఎత్తైన శిఖరం సముద్ర మట్టానికి 4 వేల 892 మీటర్ల ఎత్తులో ఉన్న విన్సన్ పర్వతాన్నిఅన్విత అధిరోహించి మరో రికార్డును నెలకొల్పింది. డిసెంబర్ 3వ తేదీన హైదరాబాద్ నుంచి చిలీలోని పుంటా అరేనాస్ కు బయలుదేరిన ట్రాన్స్ సెండ్ అడ్వెంచర్స్ ఇంటియాతో అంటార్కిటికాలోని అంతర్జాతీయ యాత్ర బృందంలో అన్విత కూడా ఉంది. డాక్యుమెంటేషన్, ఇతర రాతపని పూర్తి చేసిన తర్వాత ఆమె డిసెంబర్ 7వ తేదీన అంటార్కిటికాలోని యూనియన్ గ్లేసియర్ కు వెళ్లింది. అయితే ఈ పర్వతాన్ని అధిరోహించడం అంత తేలికైన విషయం ఏం కాదు. తాను జట్టుతో కలిసి ఈ లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశానని అన్విత తెలిపింది. 

గతంలోని పర్వతారోహణ అనుభవం కూడా తనకు చాలా ఉపయోగపడిందని, 7 శిఖరాలను అధిరోహించాలన్నా తన లక్ష్యంలో ఇది 4వ శిఖరంగా అన్విత తెలిపారు. డిసెంబర్ 8వ తేదీ నుండి 15వ తేదీ వరకు అన్విత మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు, విపరీతమైన గాలులతో కూడిన పరిస్థితులను ఎదుర్కుంది. అంతటి కఠినమైన అంటార్కిటికా వాతావరణానికి అలవాటు పడింది. చివరకు డిసెంబర్ 16వ తేదీన ఆమె శిఖరారోహణకు ప్రయత్నించింది. 

"ఈరోజు చాలా గాలులు వచ్చాయి. దాదాపు మైనస్ 30 డిగ్రీల చలిలో శిఖరాన్ని ఎక్కడం చాలా కష్టంగా అనిపించింది. నా చేతులన్నీ చల్లగా అయ్యాయి. కనీసం నేను టెంట్ కూడా వేయలేకపోయాను. చాలా కష్టపడి అందరం కలిసి టెంట్ వేశాం. టెంట్ లోపల దాదాపు మైనస్ 35 డిగ్రీల చలి ఉంది. డిసెంబర్ 16వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో శిఖరం అధిరోహించడానికి బయలు దేరితే రాత్రి 9 గంటలకు పైకి చేరుకున్నాం. 4892 మీటర్ల ఎత్తులో ఉన్న ఆ శిఖరంపై భారతీయ జెండాను ఉంచి.. దాదాపు 20 నిమిషాల పాటు చాలా హ్యాపీగా గడిపాను. పైన ఉన్న పర్వతం అచ్చం పిరమిడ్ లా ఉంటుంది" అని అన్విత వెల్లడించింది.

అన్విత కోచ్, మెంటర్ శేఖర్ బాబు బాచినేపల్లి మాట్లాడుతూ... విన్సన్ పర్వతాన్ని ఎక్కడం టెక్నికల్ గా అంత కష్టం కాదు కానీ పర్వత ప్రదేశం రిమోట్ గా ఉంటుందని అన్నారు. అక్కడి వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు  మారుతూ ఉంటాయని తెలిపారు. నిమిషాల వ్యవధిలోనే గాలులు ఎక్కువ, తక్కువ అవుతుంటాయని, అక్కడికి వెళ్లే వాళ్లకు ఫిట్ నెస్ చాలా అవసరం అని చెప్పారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana private colleges strike ends:  ఇలా సీఎం వార్నింగ్ ఇచ్చారు -అలా కాలేజీలు దారికొచ్చాయి - ముగిసిన ప్రైవేటు కాలేజీల సమ్మె
ఇలా సీఎం వార్నింగ్ ఇచ్చారు -అలా కాలేజీలు దారికొచ్చాయి - ముగిసిన ప్రైవేటు కాలేజీల సమ్మె
US Visa: డయాబెటిస్ ఉన్న వాళ్లకి నో వీసా - మరో పులకేసీ ఉత్తర్వు జారీ చేసిన ట్రంప్
డయాబెటిస్ ఉన్న వాళ్లకి నో వీసా - మరో పులకేసీ ఉత్తర్వు జారీ చేసిన ట్రంప్
CM warns private colleges: విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే తాట తీస్తా - ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ -ఇక వాళ్లదే నిర్ణయం !
విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే తాట తీస్తా - ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ -ఇక వాళ్లదే నిర్ణయం !
India vs Australia: గబ్బాలో భారత్-ఆస్ట్రేలియా ఐదో టీ20 మ్యాచ్, టీమ్ ఇండియా ప్లేయింగ్ XI మారుతుందా? పిచ్ రిపోర్ట్‌ ఏంటీ?
గబ్బాలో భారత్-ఆస్ట్రేలియా ఐదో టీ20 మ్యాచ్, టీమ్ ఇండియా ప్లేయింగ్ XI మారుతుందా? పిచ్ రిపోర్ట్‌ ఏంటీ?
Advertisement

వీడియోలు

Harman Preet Kaur Smriti Mandhana | చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి | ABP Desam
గంభీర్ భాయ్.. నీకో దండం! బ్యాటింగ్‌ పొజిషన్ ఇలా సెలక్ట్ చేస్తున్నావా?
చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి
పీఎం మోదీని కలిసినప్పుడు అలా ఎందుకు చేసానంటే..!
అల్లటప్పా ఆటగాడనుకున్నారా.. రీప్లేస్ చేయాలంటే బాబులు దిగిరావాల!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana private colleges strike ends:  ఇలా సీఎం వార్నింగ్ ఇచ్చారు -అలా కాలేజీలు దారికొచ్చాయి - ముగిసిన ప్రైవేటు కాలేజీల సమ్మె
ఇలా సీఎం వార్నింగ్ ఇచ్చారు -అలా కాలేజీలు దారికొచ్చాయి - ముగిసిన ప్రైవేటు కాలేజీల సమ్మె
US Visa: డయాబెటిస్ ఉన్న వాళ్లకి నో వీసా - మరో పులకేసీ ఉత్తర్వు జారీ చేసిన ట్రంప్
డయాబెటిస్ ఉన్న వాళ్లకి నో వీసా - మరో పులకేసీ ఉత్తర్వు జారీ చేసిన ట్రంప్
CM warns private colleges: విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే తాట తీస్తా - ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ -ఇక వాళ్లదే నిర్ణయం !
విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే తాట తీస్తా - ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ -ఇక వాళ్లదే నిర్ణయం !
India vs Australia: గబ్బాలో భారత్-ఆస్ట్రేలియా ఐదో టీ20 మ్యాచ్, టీమ్ ఇండియా ప్లేయింగ్ XI మారుతుందా? పిచ్ రిపోర్ట్‌ ఏంటీ?
గబ్బాలో భారత్-ఆస్ట్రేలియా ఐదో టీ20 మ్యాచ్, టీమ్ ఇండియా ప్లేయింగ్ XI మారుతుందా? పిచ్ రిపోర్ట్‌ ఏంటీ?
Remove stray dogs: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - ఆ ప్రాంతాల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశం
వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - ఆ ప్రాంతాల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశం
Hyundai Venue : హ్యుందాయ్ వెన్యూకి పోటీగా వస్తున్న 5 కొత్త SUVలు, మరింత అడ్వాన్స్డ్‌గా ఫీచర్స్‌!
హ్యుందాయ్ వెన్యూకి పోటీగా వస్తున్న 5 కొత్త SUVలు, మరింత అడ్వాన్స్డ్‌గా ఫీచర్స్‌!
Airport operations disrupt: ఢిల్లీలోనే కాదు ముంబై ఎయిర్ పోర్టులోనూ గందరగోళం - వందల విమానాల రద్దు - అసలేం జరుగుతోంది?
ఢిల్లీలోనే కాదు ముంబై ఎయిర్ పోర్టులోనూ గందరగోళం - వందల విమానాల రద్దు - అసలేం జరుగుతోంది?
Bandi Sanjay : గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Embed widget