అన్వేషించండి

Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!

Amit Shah Munugode Tour: ఈనెల 21వ తేదీన కేంద్ర మంత్రి అమిత్ షా మునుగోడులు జరగనున్న భారీ బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర వ్యవహారాల శాఖ ఇంఛార్జీ తరుణ్ చుగ్ తెలిపారు.

Amit Shah Munugode Tour: ఈనెల 21వ తేదీన రాష్ట్రంలోని మునుగోడు నియోజక వర్గంలో జరగబోయే బీజేపీ భారీ బహిరంగ సభకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ వెల్లడించారు. వచ్చే ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు జరగబోయే ఈ పార్టీ కార్యాలయంలో.. పార్టీ కార్యాచరణను అమిత్ షా ప్రకటిస్తారని బుధవారం దిల్లీలోని తన నివాసంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలిపారు.

అవినీతి గురించి మాట్లాడితే సీఎం వణికిపోతారు..

సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తరుణ్ చుగ్ ఆరోపించారు. రాష్ట్రానికి ప్రధాన శత్రువు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ యే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, కుటుంబ పాలనతో తెలంగాణను నిలువెల్లా దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. అవినీతి గురించి మాట్లాడితే చాలు సీఎంకు చెమటలు పడతాయని, ఎందుకంత భయం అంటూ ప్రశ్నించారు. దేశంలో ఇందిరా గాంధీ నియంతృత్వం ముగిసినట్టుగానే తెలంగాణలో కేసీఆర్ కేసీర్ నియంతృత్వ పాలన ముగుస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించి సీఎం కేసీఆర్ ప్రజలు బుద్ధి చెబుతారని వెల్లడించారు. 

ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నాలు..

గత కొంత కాలంగా టీఆర్ఎస్ పార్టీ నేతలకు, సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని తరుణ్ చుగ్ తెలిపారు. ఆ భయంతోనే చాలా మంది ఎమ్మెల్యే ఆ పార్టీని వీడుతున్నారని వివరించారు. తెలంగాణలో జరగబోయే అమిత్ షా సభతో రాష్ట్రం కుటుంబ రాజకీయాల నుంచి విముక్తి పొందుతుందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం జరగబోయే బీజేపీ భారీ బహిరంగ సభలో ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు అమిత్ షా చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకోబోతున్నట్లు వివరించారు. 

ఈనెల 27న హన్మకొండలో.. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు నియోజక వర్గంలో ఉప ఎన్నిక రాబోతుంది. ఈ క్రమంలోనే బీజేపీ పెద్ద సంఖ్యలో చేరికలకు రంగం సిద్ధం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన రాజగోపాల్ రెడ్డి 21వ తేదీన అమిత్ షా సమక్షంలో బేజీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అలాగే ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రతినిధి తేజావత్ రామచంద్రు నాయక్, మాజీ డీజీపీ కృష్ణ ప్రసాద్, నర్సాపూర్ మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్ మురళీ యాదవ్, మునుగోడులోని పలువురు టీఆర్ఎస్ నేతలు కూడా బేజీపీలో చేరబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర-3 ముగింపు సందర్భంగా ఈనెల 27వ తేదీన హన్మకొండలో బహిరంగ సభ నిర్వహించబోతన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాగానీ, యూపీ సీఎం యేగి ఆదిత్య నాథ్ గానీ ఈ సభలో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. ఇదే సభలో మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న కుమారుడు బొమ్మ శ్రీరాం తదితరులు బీజేపీ చేరుతారని అంటున్నాయి. 

మునుగోడు పర్యటన షెడ్యూల్ ఇలా

అమిత్ షా 21న మునుగోడు పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖారారైందని బీజేపీ వర్గాలు తెలిపాయి. 21న సాయంత్రం 4.30 గంటలకు మునుగోడుకు అమిత్ షా చేరుకోనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. బహిరంగ సభ తర్వాత ఢిల్లీకి పయనం అవుతారు.

టాప్ హెడ్ లైన్స్

Dharavath Nikhil Death Case: ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
Delhi Dehradun Expressway Accident: ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
CBI Investigation Credibility: సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
Union Cabinet Reshuffle: త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
Power Vs Opposition Mindset: మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
White Rice vs Brown Rice : వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
Embed widget