అన్వేషించండి

Mulugu Crime : ములుగు జిల్లాలో హైటెక్ దొంగలు, బంగారం కొట్టేసి బ్యాంక్ తనఖా పెట్టేశారు!

Mulugu Crime : మారుమూల ప్రాంతాల్లో దొంగలు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. సినీ ఫక్కీలో హంగామా చేస్తున్నారు. పట్టణాల్లోనే కాదు ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో కూడా దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు.

Mulugu Crime : ములుగు జిల్లా ములుగు మండలం మదనపల్లి గ్రామంలో దొంగతనానికి పాల్పడిన ఇద్దరిని ములుగు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు నెలలో మదనపల్లి గ్రామానికి చెందిన పోరిక గాంధీ నాయక్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటిపై కప్పు పెంకులు తీసి ఇంట్లోకి వెళ్లారు. స్క్రూ డ్రైవర్ సాయంతో బీరువాను తెరచి అందులో ఉన్న 9 తులాల బంగారాన్ని అదే గ్రామానికి చెందిన  వాంకుడోత్ వినోద్ కుమార్, పాడ్య చరణ్ కుమార్ అనే  ఇద్దరు యువకులు దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు దొంగ తనానికి పాల్పడిన యువకుల్ని పట్టుకున్నారు. యువకుల్ని విచారించి వారి వద్ద నుంచి 5 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

గోల్డ్ లోన్ 

 మిగతా బంగారాన్ని ప్రైవేట్ సంస్థలో గోల్డ్ లోన్ కింద తాకట్టు పెట్టారు నిందితులు. రికవరీ చేసిన బంగారాన్ని పోలీసులు మీడియా ముందు ఉంచారు. గ్రామాల్లో ఎవ్వరైనా అనుమానంగా సంచరిస్తే 100 కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.

ఇద్దరు అరెస్టు 
 
"మదనపల్లి గ్రామానికి ఓ వ్యక్తి తన తల్లి ఆరోగ్యం బాగాలేదని హన్మకొండ వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం. ఈ కేసును దర్యాపు చేసి ఇద్దరిని అరెస్టు చేశాం. వారి వద్ద నుంచి ఐదు తులాల బంగారం స్వాధీనం చేసుకున్నాం. అయితే మిగిలిన బంగారాన్ని నిందితులు బ్యాంక్ లో తాకట్టు పెట్టి ఫైనాన్స్ తీసుకున్నారు. ఆ డబ్బులను అవసరాలకు వాడుకున్నారు. నిందితులు ఇద్దరినీ కోర్టులో హాజరుపరుస్తాం"- మేకల రంజీత్ కుమార్ సీఐ 

బస్సుల్లో జర్నీ చేస్తున్నారా? బీ అలెర్ట్ 

హైదరాబాద్‌ లాంటి ప్రధాన నగరాల నుంచి వేర్వేరు ఊళ్లకు వెళ్లే బస్సులు భోజనాలు, టిఫెన్‌ చేయడానికి సిటీ దాటిన తర్వాత ఆపడం సర్వసాధారణం. అందులో చాలా మంది రెస్ట్‌రూమ్‌కని, భోజనం చేద్దామని దిగుతూ ఉంటారు. అలాంటి వాళ్లంతా అలర్ట్ అవ్వాల్సిన న్యూస్ ఇది. భోజనాలకు, రెస్ట్ కోసం ఇలా బస్‌ ఆపారో లేదో...  చాలా మంది హడావుడిగా దిగి వెళ్లిపోతుంటారు. అయితే ఇలాంటి వారినే టార్గెట్ చేసుకొని ఓ ముఠా చెలరేగిపోయింది. అంతా బస్‌ దిగిన తర్వాత బ్యాగ్‌లను వెతికి మరీ విలువైన వస్తువులను కొట్టేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయే ముఠా ఇది. అందరిలాగానే ఎక్కడికో ఒక చోటకు టికెట్ తీసుకుంటారు. మధ్యలో బస్ ఆగిన వెంటనే చేతికి పని చెప్పి... జారుకుంటారు. మరికొందరు బస్‌లు ఎక్కువ ఆగి... ఎక్కువ ప్రయాణికులు ఉండే దాబాలు, హోటల్స్ వద్దే రెక్కీ వేస్తుంటారు. ఇలాంటి కన్నింగ్ ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. 9 మందిని అరెస్టు చేసి వారి నుంచి నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

టిఫిన్ కోసం ఆపితే అంతే 

నార్కెట్ పల్లి శివారులోని ఓదాబా వద్ద కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరగడాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి వాళ్లను పట్టుకొని విచారిస్తే వాళ్లు చేసిన కంత్రీ పనుల చిట్టా విప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తాజ్, సర్ఫరాజ్ ఈ ముఠాను లీడ్ చేశారు. పదిహేను ఏళ్ల నుంచి యూపీతోపాటు బెంగళూరు, చెన్నై, తిరుపతి, విజయవాడ, వైజాగ్‌, గుంటూరు బస్‌స్టాండ్‌లలో చేతికి పని చెప్పారు. ప్రయాణీకుల బ్యాగ్‌ల నుంచి డబ్బులు, బంగారం మాయం చేసి ఎస్కేప్ అవుతారు. తాజ్, సర్ఫరాజ్ కలిసి తెలంగాణలో నల్లగొండ, నార్కెట్‌పల్లి, కోదాడ, షాద్‌నగర్, హైదరాబాద్ పరిధిలలో కూడా దొంగతనాలు చేశారు. ఇద్దరూ 9 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించినారు. జైలు నుంచి విడుదలైన తర్వాత బంధువులను కలుపుకొని ఓ ముఠాగా ఏర్పడ్డారు.  తొమ్మిదో నెల ఏడో తేదీన నార్కెట్‌పల్లి శివారులోని ఓ హోటల్ వద్ద బస్సు టిఫిన్ కోసం ఆపగా బస్ లాగేజి స్టాండ్‌లో ఉన్న 30 లక్షలు ఉన్న బ్యాగ్‌ను ఎత్తేశారు. దీంతో బాధితులు హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో కేసు నమోదు చేశారు. విచారణ కోసం ఆ కేసును నార్కెట్‌పల్లికి తరలించారు పోలీసులు.  ఈ కేసు దర్యాప్తు సాగుతుండగానే.. పోలీసులకు అనుమానితులు తిరుగుతున్నట్టు సమాచారం వచ్చింది. వారిని అరెస్టు చేసి విచారిస్తే అసలు గుట్టు వెలుగు చూసింది.  
 


 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Drug case remand report: పోలీసుల్ని చంపి అయినా తప్పించుకోవాలనుకున్నారా? - రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
పోలీసుల్ని చంపి అయినా తప్పించుకోవాలనుకున్నారా? - రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Regional Ring Rail Project: హైదరాబాద్‌కు గుడ్ న్యూస్! రీజనల్ రింగ్ రైల్ సర్వేకు గ్రీన్ సిగ్నల్, ఇక పట్టాలెక్కేనా?
హైదరాబాద్‌కు మరో మెగా ప్రాజెక్టు... రీజనల్ రింగ్ రైల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
MLA Mandula Samelu: తుంగతుర్తి ఎమ్మెల్యే వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు చిక్కులు -సామేలు వివరణ కోరుతామన్న పీసీసీ చీఫ్
తుంగతుర్తి ఎమ్మెల్యే వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు చిక్కులు -సామేలు వివరణ కోరుతామన్న పీసీసీ చీఫ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Embed widget