అన్వేషించండి

Breaking News Live: ఓటీఎస్ పై ఎమ్మెల్యే రోజాకు నిలదీసిన స్థానికులు 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live:  ఓటీఎస్ పై ఎమ్మెల్యే రోజాకు నిలదీసిన స్థానికులు 

Background

భూమి ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న కారణంగా గత 30 సంవత్సరాలుగా సముద్రపు వేడిగాలులు అధికమయ్యాయి. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో దీని ప్రభావం ఉంటుంది. నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎలాంటి వర్ష సూచన లేదు. దాంతో వాతావరణంలో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు ఏపీలో తక్కువ ఎత్తులో వేగంగా వీస్తున్నాయి. దీని ఫలితంగా ఏపీ మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుంది.

ఏపీలోని కోస్తాంధ్రలో వాతావరణం కాస్త వేడెక్కుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు వాతావరణం పొడిగా ఉంటుంది. కళింగపట్నంలో కనిష్ట ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోంది. నందిగామ, తుని, బాపట్ల, అమరావతి, విశాఖపట్నం ప్రాంతాల్లో చలి తీవ్రత కాస్త తగ్గుముఖం పడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. రాయలసీమ​, తెలంగాణ ప్రాంతాల్లో చలి ప్రభావం ఒకట్రెండు రోజుల్లో తగ్గనుంది. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఆంక్షలు లేవని వాతావరణ కేంద్రం పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వేడి గాలు వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంత్రం తెలిపింది. కొన్ని రోజుల కిందటి వరకు విశాఖ ఏజెన్సీ ఏరియాల కన్నా తక్కువ రాత్రిపూట ఉష్ణోగ్రతలు సీమలో నమోదయ్యాయి. ఆరోగ్యవరంలో, అనంతపురం, నంద్యాల, కర్నూలు, తిరుపతి ప్రాంతాల్లో వాతావరణంలో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి.

తెలంగాణలో తగ్గుతున్న చలి
తెలంగాణలో ఆకాశం పాక్షింగా మేఘాలతో కనిపిస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రెండు రోజుల కిందటి వరకు కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల వరకు నమోదయ్యేవి. నిన్న కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి గాలులు గంటలకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 31.6 డిగ్రీల మేర నమోదైంది.

బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా నేడు పెరిగింది. గ్రాముకు రూ.10 చొప్పున పెరిగింది. వెండి ధర మాత్రం నేడు తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.46,400 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.50,620 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.68,200గా నిలకడగా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.68,200 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,400 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.50,620గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.68,200గా ఉంది.

22:07 PM (IST)  •  16 Feb 2022

ఓటీఎస్ పై ఎమ్మెల్యే రోజాకు నిలదీసిన స్థానికులు 

చిత్తూరు జిల్లా నగిరి‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవం ఎదురైంది. నిండ్ర మండలం అగరం పేటలో మీతో మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే  రోజాను ఓటీఎస్ పై స్థానిక లబ్ధిదారులు నిలదీశారు. మేము గతంలో ఎప్పుడో నిర్మించుకున్న ఇంటికి ఎందుకు పది వేలు చెల్లించాలని ఎమ్మెల్యే రోజాను లబ్ధిదారురాలు అడుగగా మీరు పది వేలు చెల్లిస్తే ఇల్లు మీ సొంతం అవుతుందని తెలిపారు.  మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు, బ్యాంకులో మీరు అర్హులవుతారు ఆ ఇంటి పై సర్వ హక్కులు మీకు లభిస్తాయి అంటూ తమిళంలో నగిరి ఎమ్మెల్యే రోజా లబ్ధిదారులకు సమాధానమిచ్చారు.

21:59 PM (IST)  •  16 Feb 2022

హైకోర్టులో ఉద్యోగాల పేరిట ఫేక్ కాల్ లెటర్స్, పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు 

ఏపీ హైకోర్టులో ఉద్యోగాల పేరిట నకిలీ కాల్ లెటర్స్ పై తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో హైకోర్టు డిప్యూటీ ఎస్ఓ ప్రసాద్ రావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

15:01 PM (IST)  •  16 Feb 2022

KTR in Nizamabad: కేటీఆర్ పర్యటనను అడ్డుకొనే యత్నం.. అడ్డుకున్న పోలీసులు

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ శంకుస్థాపనకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ ను అడ్డుకొనేందుకు స్థానిక బీజేపీ నేతలు ప్రయత్నించారు. దీంతో బీజేపీ నాయకులను పోలీసులు నిలువరించారు. బీజేపీ నేతలు కేటీఆర్ కాన్వాయ్ వైపు వెళ్ళేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

14:49 PM (IST)  •  16 Feb 2022

కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీకి మరోసారి అవకాశం కల్పిస్తే మళ్లీ ఏపీలో తెలంగాణను కలిపేస్తారని వ్యాఖ్యనించారు. తెలంగాణ పుట్టుకను మోదీ ప్రశ్నిస్తున్నారని అన్నారు. తెలంగాణను మళ్లీ ఏపీలో కలిసే ప్రయత్నం జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. సిద్దాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. 

14:48 PM (IST)  •  16 Feb 2022

NSUI నేతల అరెస్ట్, నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలింపు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత  బిస్వ శర్మపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ ముట్టడికి తెలంగాణ NSUI యత్నించింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హిమంత బిస్వ శర్మ పై తెలంగాణ లోని అన్ని పోలీసు స్టేషన్స్ లో ఫిర్యాదు చేయగా పోలిసులు చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు NSUI రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ బల్మూర్ అధ్వర్యంలో హైదరాబాద్ బషీర్ బాగ్ లోని సిటీ పోలీస్ కమిషనరేట్ ముట్టడికి యత్నించారు. ముట్టడికి యత్నించిన NSUI నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని నారాయణగూడ పోలీస్ స్టేషన్ కి తరలించారు. రాహుల్ గాంధీపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎంపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలని, లేని పక్షంలో NSUI ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని తెలిపారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MLC Elections ఏపి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్న ఆధారాలు చూపిన శ్రీరాజ్Deputy CM Pawan Kalyan South India Temples Full Video | పవన్ తిరిగిన దక్షిణాది ఆలయాలు ఇవే | ABPDy CM Pawan Kalyan మురుగన్ ఆలయంలో ప్రత్యేక పూజలు | Tamil Nadu | ABP DesamKiran Royal Laxmi Comments On Pawan Kalyan | కిరణ్ రాయల్ వెనుక పవన్ ! | ABP DESAM

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Yashasvi Jaiswal:  ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
New Delhi Railway Station Stampede: ఢిల్లీలో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.