అన్వేషించండి
Advertisement
MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం
దుర్గం చిన్నయ్య పని కోసం తన వద్దకు వచ్చే మహిళలను లొంగదీసుకున్నారని, రౌడీయిజం చేస్తున్నారని, భూకబ్జాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని లేఖలో ఆరోపించారు.
మంచిర్యాల జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు మావోయిస్టు పార్టీ అనుబంధ కార్మిక సంఘం సికాస కార్యదర్శి ప్రభాత్ హెచ్చరిక లేఖను విడుదల చేశారు. దుర్గం చిన్నయ్య పని కోసం తన వద్దకు వచ్చే మహిళలను లొంగదీసుకున్నారని, రౌడీయిజం చేస్తున్నారని, భూకబ్జాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా చిన్నయ్య మారారని, మోసం చేసే కంపెనీలతో చేతులు కలిపి రైతులను మోసం చేశారని లేఖలో ఆరోపించారు. వెంటనే నష్టపోయిన రైతులకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. దుర్గం చిన్నయ్య అనుచరులు గడ్డం బీమా గౌడ్, సాన శ్రావణ్, సన్నిబాబు, సుదర్శన్, మాధవ్, ప్రకాష్ లు తమతీరు మార్చుకోకుంటే ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పాలిటిక్స్
క్రికెట్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets
Nagesh GVDigital Editor
Opinion