అన్వేషించండి

Rahul Gandhi : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జీఎస్టీలో మార్పులు, మళ్లీ రైతు రుణ మాఫీ- రాహుల్ గాంధీ

Rahul Gandhi : మతం పేరుతో దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, అందరినీ ఐక్యమత్యంగా ఉంచేందుకు పాదయాత్ర చేస్తున్నానని రాహుల్ గాంధీ అన్నారు.

Rahul Gandhi : ఏఐసీసీ అగ్రనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో జోరుగా సాగుతోంది. రాహుల్ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొంటున్నారు. పాదయాత్ర అనంతరం రైతు సంఘాలు, ప్రజా సంఘాలతో రాహుల్ సమావేశాలు నిర్వహిస్తు్న్నారు.  దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని, తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొందని మహబూబ్‌నగర్  జిల్లా  మన్నెం కొండ కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధీ అన్నారు.  మతం పేరుతో దేశంలో విద్వేషం రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. దేశంలో ప్రజలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ఐక్యతంగా ఉంచేందుకు ఈ పాదయాత్ర చేస్తున్నానని తెలిపారు. జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన, సహకారం లభిస్తుందని రాహుల్ తెలిపారు. దేశంలో బీజేపీ పాలకుల అసంబద్ధ విధానాలతో అధోగతి పాలు చేస్తున్నారని మండిపడ్డారు.  నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో దేశంలో నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం నెలకొందని ఆరోపించారు. లక్షలాది పరిశ్రమలు మూతపడ్డాయని, కార్మికులు ఉపాధి కోల్పోయారని విమర్శించారు. 

జీఎస్టీ విధానంలో మార్పులు 

"కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో జీఎస్టీ విధానంలో మార్పులు తెస్తాం. రైతులకు అండగా ఉంటున్నాం. గత పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణ మాఫీ చేశాం. ఇప్పుడు కూడా రైతులకు భరోసా ఇస్తున్నాం. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ లు ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నాయి.  వీటికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. పాదయాత్ర చేస్తే 6,7 కిలోమీటర్లకు అలసట వస్తాది. కానీ నేను 25 కిలోమీటర్ల పాదయాత్ర చేసినా అలసట రావడం లేదు. మీ ప్రేమ, ఆప్యాయతలతోనే నేను ఎలాంటి అలసట లేకుండా యాత్ర చేయగలుగుతున్నాను. మీ ప్రేమకు ధన్యవాదాలు."- రాహుల్ గాంధీ 

తెలంగాణలో నియంత పాలన 

మహబూబ్‌నగర్  జిల్లా  మన్నెం కొండ కార్నర్ మీటింగ్ రాహుల్ గాంధీ పాల్గొన్నారు.   తెలంగాణలోని అన్నీ వర్గాలతో మాట్లాడి వాళ్ల సమస్యలు తెలుసుకుంటున్నానని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రజల మధ్య ద్వేషం, అహింస సృష్టిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ టీఆర్ఎస్ మధ్య రహస్య బంధాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. పార్లమెంట్ లో అన్నీ విషయాల్లో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్నారు.  హింస ద్వేషాన్ని అంతమోదించటమే జోడో యాత్ర ప్రధాన లక్ష్యమని రాహుల్ తెలిపారు. దేశంలో నిరుద్యోగం తారాస్థాయికి చేరిందన్నారు. రాష్ట్ర యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో సీఎం లేరని, ఒక  నియంత పాలన నడుస్తోందన్నారు.  ప్రజలను దోచుకోవడమే కేసీఆర్ లక్ష్యమని విమర్శించారు. ప్రతి సాయంత్రం కేసీఆర్ ధరణి పోర్టల్ ను చూస్తారని, భూములు ఎవరెవరు కొనుగోలు చేస్తున్నారు, ఎలా లక్కోవాలనేది చూస్తున్నారని ఆరోపించారు. 

మళ్లీ రైతు రుణ మాఫీ  

"లక్షలాది గిరిజనులకు భూమి హక్కు ఇచ్చింది కాంగ్రెస్.  కానీ కేసీఆర్ మన భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. దళితులకు 25 లక్షల ఎకరాలు కాంగ్రెస్ ఇచ్చింది. మన ప్రభుత్వం రాగానే అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తాం. భూమితో పాటు పూర్తి హక్కు వారికిచ్చేలా హామీ ఇస్తున్నాం. నిరుద్యోగానికి ప్రధాన కారణం నోట్ల రద్దు. నోట్ల రద్దు జీఎస్టీ వల్ల చిన్న మధ్య వ్యాపారులకు పెద్ద దెబ్బ. కాంగ్రెస్ సర్కార్ వస్తే జీఎస్టీలో మార్పులు తెస్తాం. దేశ వ్యాప్తంగా ఒకటే జీఎస్టీ అమలుచేస్తాం.  అధికారంలోకి రాగానే మళ్లీ రైతు రుణమాఫీ చేస్తాం. ఈ యాత్రలో హింస, ద్వేషానికి తావు లేదు. మీ అందరి ప్రేమ ఆప్యాయత, మద్దతు వల్ల ఎంత దూరం నడిచినా అలసట లేదు. బీజేపీ టీఆర్ఎస్ రెండు కలిసి పని చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయి."- రాహుల్ గాంధీ 

టాప్ హెడ్ లైన్స్

Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget