అన్వేషించండి

KTR On Phule : పూలే ఆశయాలను కేసీఆర్ ఆచరణలో పెట్టారు - కాంగ్రెస్ ఏమీ చేయలేదన్న కేటీఆర్

Telangana News : పూలే ఆశయాలను కేసీఆర్ ఆచరణలోకి తెచ్చారని కేటీఆర్ అన్నారు. పూలే జయంతి సందర్భంగా కేటీఆర్ నివాళులర్పించారు.

KTR paid tribute to Jyoti Rao Phule :   బడుగు, బలహీన వర్గాలకు చిరస్మరణీయమైన సేవలతో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి పూలే అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  అన్నారు. కులవివక్ష, అసమానతలపై ఆనాడే ఫూలే పోరాడారని చెప్పారు. విద్యతోనే సమానత్వం వస్తుందని, సావిత్రిబాయితో కలిసి అందరికి విద్య అందించేందుకు కృషి చేశారని తెలిపారు. తెలంగాణలో భవన్‌లో మహాత్మా జ్యోతిరావ్‌ ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫూలే ఆశయాలను ఆచరణలో పెట్టిన నాయకుడు కేసీఆర్‌ అని చెప్పారు. వెయ్యికి పైగా గురుకులాలు ఏర్పాటుచేసి నాణ్యమైన విద్య అందించామన్నారు.                     

అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా బడుగు బలహీన వర్గాలకు సీట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఆర్‌ఎస్‌ అని చెప్పారు. అదేవిధంగా పార్లమెంట్‌ జనరల్‌ సీట్లలో సగం బీసీలకే ఇచ్చారని తెలిపారు. తద్వారా బీసీల పట్ల తనకున్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని చెప్పారు. కేవలం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసమే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయ అవకాశాల కోసం కూడా పాటుపడుతున్న పార్టీ తమదని చెప్పారు. బీసీ డిక్లరేషన్‌ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. ఎన్నికల ముందు బీసీలను ఓటు బ్యాంకుగా చూసి, వారి నుంచి ఓట్లు దండుకునేందుకు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై రూ.లక్ష 25 వేలు ఖర్చుచేశామని తెలిపారు. జ్యోతిబా ఫూలే స్ఫూర్తితోనే ఈ కార్యక్రమం కొనసాగిందని చెప్పారు. ప్రతి పాఠశాలను ఇంటర్మీడియట్‌ కాలేజీకి అప్‌గ్రేట్‌ చేశామని, బీసీ విద్యార్థుల కోసం 33 డిగ్రీ రెసిడెన్షియల్‌ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. విదేశాల్లో చదువుకునే వారికి రూ.20 లక్షల చొప్పున స్కాలర్‌షిప్‌ ఇచ్చామన్నారు. ఈ విషయంలో దళిత, గిరిజన, బహుజన, అగ్రవర్ణ పేదలనే వివక్ష చూడలేదని చెప్పారు. టాటాలు, బిర్లాలు మాత్రమే ముఖ్యంకాదని, తాతలనాటి కులవృత్తులు కూడా అంతే ముఖ్యమని ఆచరణాత్మకంగా వాటికి ఒక్క రూపును, గౌరవాన్ని అందించామని కేటీఆర్ గుర్తు చేశారు.                                                      

యాదవులు, ముదిరాజులు తమ వృత్తి నైపుణ్యం ద్వారా దేశంలోనే రాష్ట్రాన్ని తమ రంగాల్లో అగ్రగామిగా నిలిపారని చెప్పారు. అదేవిధంగా ఒకప్పుడు ఊపిరి తీసుకునే నేతన్నలను ఈరోజు ఊపిరి పీల్చుకునే విధంగా తయారు చేశామన్నారు. కేసీఆర్‌ పథకాలతో నేత కార్మికులు నిలబడ్డారని, గీత కార్మికులకు సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేశారని తెలిపారు. ఎంబీసీల కోసం వెయ్యి కోట్లతో కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామన్నారు. దళితబంధు, బీసీ బంధు, రైతుబంధు లాంటి పథకాలు ఆయా వర్గాల దశ మార్చాయని తెలిపారు. రాబోయే మూడేండ్లలో ద్విశతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మహాత్మ జ్యోతిబాపూలే సమున్నత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్  చేశారు.  

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Private Schools Fee: ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Embed widget