అన్వేషించండి

KTR Comments: BRS ఎమ్మెల్యేల్ని భయపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు: గవర్నర్ రాధాకృష్ణన్‌కు కేటీఆర్ ఫిర్యాదు

Telangana Politics | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని భయపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని, నిరుద్యోగులకు హామీ ఇచ్చి మోసం చేశారంటూ గవర్నర్ రాధాకృష్ణన్‌ను కలిసి కేటీఆర్ ఫిర్యాదు చేశారు.

Telangana Governor likely to write letter to state Government | హైదరాబాద్: తెలంగాణలో రాజ్యాంగంపై జరుగుతున్న దాడి జరుగుతోందని, ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్‌ను కలిసిన కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు వందల కోట్లు లాభం అని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎగ్జామ్స్ 4 నెలలు వాయిదా వేశారంటే, 4 వందల కోట్లు వస్తాయా ? అందులో సీఎం రేవంత్ వాటా ఎంత ? అని కేటీఆర్ ప్రశ్నించారు.

రాష్ట్రంలో భయానక వాతావరణం 
గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో రాజ్యాంగంపై జరుగుతున్న దాడి, కాంగ్రెస్ మోసపూరిత హామీలు, ఇతర అంశాలను గవర్నర్ రాధాకృష్ణన్ దృష్టికి తీసుకెళ్లాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ ఎమ్మెల్సీలు కొందరితో వెళ్లి గవర్నర్‌ను కలిశాం. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువత, గ్రూప్స్ అభ్యర్థులకు ఇచ్చిన హామీలను ఎలా తుంగలో తొక్కి, మోసం చేస్తుందో గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. హామీలు అమలు చేయాలని నిరసన తెలిపిన విద్యార్థుల నిర్భంధం, అణిచివేత, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులతో రాష్ట్రంలో భయానక వాతావరణం కల్పించారని ఫిర్యాదు చేశాం. 

చిక్కడపల్లి సిటి సెంట్రల్ లైబ్రరీలో, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు, నిరుద్యోగులపై పోలీసులు లాఠీఛార్జ్ చేస్తూ ఉద్యమం నాటి అణిచివేత వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అవలంభిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు కల్పన, జాబ్ క్యాలెండర్ విడుదలకు సంబంధించి ఇచ్చిన ప్రకటనలు, హామీలను గవర్నర్ కు తెలియజేశాం. తెలంగాణలో గ్రూప్ 1, 2, 3 పోస్టులు పెంచుతామన్న హామీలు పట్టించుకోవడం లేదు.  

గవర్నర్ సీరియస్, తెలంగాణ ప్రభుత్వానికి లేఖ !
రాష్ట్రంలో రాజ్యాంగం అమలు కావడం లేదని, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లను భయపెట్టి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని గవర్నర్ కు తెలిపాం. విద్యార్థులు, నిరుద్యోగులపై లాఠీఛార్జ్ లు, అక్రమ అరెస్టులపై సైతం గవర్నర్ సీరియస్ అయ్యారని కేటీఆర్ తెలిపారు. హోం శాఖ కార్యదర్శిని పిలిచి వివరాలు అడుగుతానని గవర్నర్ చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నెగ్గిన దానం నాగేందర్ మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసినట్లు, స్పీకర్ గారికి కూడా ఫిర్యాదు చేశామని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేల హక్కులకు భంగం వాటిల్లవద్దని గవర్నర్ అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వాలని లేఖ రాస్తా అని చెప్పారని కేటీఆర్ తెలిపారు. 

రాజ్యాంగాన్ని రక్షిస్తున్నట్లు రాహుల్ గాంధీ పోజులు కొడుతూ, మరోవైపు వేరే పార్టీ ఎమ్మెల్యేల్ని కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధమైన చర్యలను గవర్నర్ తో పాటు, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. తన పరిధిలో ఏ అంశంలో అయినా న్యాయం చేస్తామని గవర్నర్ అన్నారని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. 

కాళేశ్వరంలో లక్ష కోట్లు గంగ పాలు అయ్యిందని, ఇక మేడిగడ్డ కొట్టుకు పోయిందని దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు సిగ్గుతో తల దించుకోవాలన్నారు. కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి కావడంతో వరద లాగ నీళ్లు వస్తున్న మేడిగడ్డ తట్టుకోవటమంటే అదే కాళేశ్వరం గొప్పతనం అన్నారు. త్వరలోనే మేడిగడ్డను సందర్శించి ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. 

Also Read: తెలంగాణలో మరో కొత్త పథకం ప్రారంభం - వారికి రూ.లక్ష ఆర్థిక సాయం

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

EV offer for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఆఫర్ - ఈవీలపై 20 శాతం వరకు రాయితీ!
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఆఫర్ - ఈవీలపై 20 శాతం వరకు రాయితీ!
Good news for vehicle buyers in Telangana: తెలంగాణ వాహనదారులకు బంపర్ ఆఫర్ - రెండో వాహనంపై 2 శాతం అదనపు పన్ను రద్దు!
తెలంగాణ వాహనదారులకు బంపర్ ఆఫర్ - రెండో వాహనంపై 2 శాతం అదనపు పన్ను రద్దు!
Gaddar Awards 2026: గద్దర్ అవార్డుల్లో గోల్‌మాల్... రెండు కోట్లు నొక్కేశారా? బీఆర్ఎస్ నేత సంచలన ట్వీట్
గద్దర్ అవార్డుల్లో గోల్‌మాల్... రెండు కోట్లు నొక్కేశారా? బీఆర్ఎస్ నేత సంచలన ట్వీట్
Madhavi Latha BJP leader: ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రేయర్ రూంలో హైదరాబాద్ బీజేపీ నేత మాధవీలత ప్రార్థనలు - ముస్లింల నమాజ్‌కు ఆటంకం కలిగించారని విమర్శలు
ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రేయర్ రూంలో హైదరాబాద్ బీజేపీ నేత మాధవీలత ప్రార్థనలు - ముస్లింల నమాజ్‌కు ఆటంకం కలిగించారని విమర్శలు

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Assembly Elections 2026: పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Embed widget