అన్వేషించండి

KTR Comments: BRS ఎమ్మెల్యేల్ని భయపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు: గవర్నర్ రాధాకృష్ణన్‌కు కేటీఆర్ ఫిర్యాదు

Telangana Politics | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని భయపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని, నిరుద్యోగులకు హామీ ఇచ్చి మోసం చేశారంటూ గవర్నర్ రాధాకృష్ణన్‌ను కలిసి కేటీఆర్ ఫిర్యాదు చేశారు.

Telangana Governor likely to write letter to state Government | హైదరాబాద్: తెలంగాణలో రాజ్యాంగంపై జరుగుతున్న దాడి జరుగుతోందని, ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్‌ను కలిసిన కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు వందల కోట్లు లాభం అని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎగ్జామ్స్ 4 నెలలు వాయిదా వేశారంటే, 4 వందల కోట్లు వస్తాయా ? అందులో సీఎం రేవంత్ వాటా ఎంత ? అని కేటీఆర్ ప్రశ్నించారు.

రాష్ట్రంలో భయానక వాతావరణం 
గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో రాజ్యాంగంపై జరుగుతున్న దాడి, కాంగ్రెస్ మోసపూరిత హామీలు, ఇతర అంశాలను గవర్నర్ రాధాకృష్ణన్ దృష్టికి తీసుకెళ్లాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ ఎమ్మెల్సీలు కొందరితో వెళ్లి గవర్నర్‌ను కలిశాం. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువత, గ్రూప్స్ అభ్యర్థులకు ఇచ్చిన హామీలను ఎలా తుంగలో తొక్కి, మోసం చేస్తుందో గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. హామీలు అమలు చేయాలని నిరసన తెలిపిన విద్యార్థుల నిర్భంధం, అణిచివేత, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులతో రాష్ట్రంలో భయానక వాతావరణం కల్పించారని ఫిర్యాదు చేశాం. 

చిక్కడపల్లి సిటి సెంట్రల్ లైబ్రరీలో, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు, నిరుద్యోగులపై పోలీసులు లాఠీఛార్జ్ చేస్తూ ఉద్యమం నాటి అణిచివేత వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అవలంభిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు కల్పన, జాబ్ క్యాలెండర్ విడుదలకు సంబంధించి ఇచ్చిన ప్రకటనలు, హామీలను గవర్నర్ కు తెలియజేశాం. తెలంగాణలో గ్రూప్ 1, 2, 3 పోస్టులు పెంచుతామన్న హామీలు పట్టించుకోవడం లేదు.  

గవర్నర్ సీరియస్, తెలంగాణ ప్రభుత్వానికి లేఖ !
రాష్ట్రంలో రాజ్యాంగం అమలు కావడం లేదని, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లను భయపెట్టి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని గవర్నర్ కు తెలిపాం. విద్యార్థులు, నిరుద్యోగులపై లాఠీఛార్జ్ లు, అక్రమ అరెస్టులపై సైతం గవర్నర్ సీరియస్ అయ్యారని కేటీఆర్ తెలిపారు. హోం శాఖ కార్యదర్శిని పిలిచి వివరాలు అడుగుతానని గవర్నర్ చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నెగ్గిన దానం నాగేందర్ మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసినట్లు, స్పీకర్ గారికి కూడా ఫిర్యాదు చేశామని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేల హక్కులకు భంగం వాటిల్లవద్దని గవర్నర్ అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వాలని లేఖ రాస్తా అని చెప్పారని కేటీఆర్ తెలిపారు. 

రాజ్యాంగాన్ని రక్షిస్తున్నట్లు రాహుల్ గాంధీ పోజులు కొడుతూ, మరోవైపు వేరే పార్టీ ఎమ్మెల్యేల్ని కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధమైన చర్యలను గవర్నర్ తో పాటు, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. తన పరిధిలో ఏ అంశంలో అయినా న్యాయం చేస్తామని గవర్నర్ అన్నారని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. 

కాళేశ్వరంలో లక్ష కోట్లు గంగ పాలు అయ్యిందని, ఇక మేడిగడ్డ కొట్టుకు పోయిందని దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు సిగ్గుతో తల దించుకోవాలన్నారు. కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి కావడంతో వరద లాగ నీళ్లు వస్తున్న మేడిగడ్డ తట్టుకోవటమంటే అదే కాళేశ్వరం గొప్పతనం అన్నారు. త్వరలోనే మేడిగడ్డను సందర్శించి ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. 

Also Read: తెలంగాణలో మరో కొత్త పథకం ప్రారంభం - వారికి రూ.లక్ష ఆర్థిక సాయం

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kavitha New Party: సర్వోదయ తెలంగాణ - కవిత పార్టీ నినాదం - ఏప్రిల్ 25న ప్రకటన
సర్వోదయ తెలంగాణ - కవిత పార్టీ నినాదం - ఏప్రిల్ 25న ప్రకటన
Telangana Praja Jagruthi: కవిత ప్రజా జాగృతి బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండం - గులాబీ శ్రేణుల్లో గుబులు!
కవిత ప్రజా జాగృతి బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండం - గులాబీ శ్రేణుల్లో గుబులు!
Telangana SSC Exams: తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నారా? విద్యా కమిషన్ చేసిన సిఫార్సులివే
తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నారా? విద్యా కమిషన్ చేసిన సిఫార్సులివే
Hyderabad Traffic Diversions: నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!
నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!

వీడియోలు

Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Shubman Gill Message to Critics | విమర్శకులకు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ కౌంటర్ | ABP Desam
Pat Cummins Update on IPL 2026 Return | SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam
Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్‌ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harshaveena: న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
Nellore Latest News: నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
Commercial gas: హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
Bellamkonda Sai Sreenivas : ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
GST scam busted: ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
Another new airport for Delhi: ఢిల్లీకి మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు - నోయిడా విమానాశ్రయం ప్రారంభానికి రెడీ
ఢిల్లీకి మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు - నోయిడా విమానాశ్రయం ప్రారంభానికి రెడీ
IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్‌పై ఈ పది విషయాలు గుర్తించారా? LSGకి అన్యాయం?
ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్‌పై ఈ పది విషయాలు గుర్తించారా? LSGకి అన్యాయం?
Embed widget