అన్వేషించండి

Kishan Reddy: ఎన్నికలు ఎప్పుడో చెప్పిన కిషన్ రెడ్డి, మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు 

Lok Sabha Elections 2024: ప్రధాని నరేంద్రమోదీ మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Kishan Reddy comments On Lok Sabha Elections 2024: ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని కేంద్ర మంత్రి కిషన్ (Kishan Reddy) రెడ్డి అన్నారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ మొదటి వారంలో లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections 2024) జరుగుతాయని చెప్పారు. 350కి పైగా స్థానాల్లో బీజేపీ జెండా ఎగరబోతోందన్నారు. మోదీ మూడో సారి గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఏ పేపర్ చూసినా కుంభకోణాలు ఉండేవని విమర్శించారు. 

ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా భారత్
ప్రధాని నరేంద్ర మోదీ గత పదేళ్లుగా దేశాన్ని అగ్రదేశాలకు ధీటుగా నిలబెడుతున్నారని అన్నారు. ప్రపంచంలోనే 5వ బలమైన ఆర్థిక శక్తిగా భారత దేశం ఎదిగిందని చెప్పారు. మొట్టమొదటి సారిగా మోదీ నేతృత్వంలో చంద్ర మండలంపై అడుగుపెట్టామని అన్నారు. అంతరిక్ష ప్రయోగాలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. రహదారులు దేశ అభివృద్దికి చిహ్నాలు అని, బీజేపీ, మోదీ పాలనలో దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులను అద్భుతంగా నిర్మించారని అన్నారు. 

అప్పుల కుప్పగా తెలంగాణ
ఒక కుటుంబం చేతిలో పాలన ఉండటంతో తెలంగాణ అప్పుల పాలైందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రూటు మాప్ లేకుండా పాలన చేస్తుందని విమర్శించారు. కొత్త ప్రభుత్వానికి కూడా కొన్ని రోజులు గడువు ఇస్తున్నామని, ఆర్థికంగా ఇప్పుడున్న ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. 

బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మూసిలో వేసినట్లే
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మూసీ నదిలో వేసినట్లే అని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రంలో లేని.. ఇక ఎప్పటికీ రాష్ట్రంలో రాని బీఆర్ఎస్‌కు ఓటు వేసి ఏం లాభం లేదని ప్రశ్నించారు. తొమ్మిదిన్నరేళ్లు ప్రజలు అధికారం ఇచ్చినా బీఆర్ఎస్ ఏం చేయలేకపోయిందని విమర్శించారు. ఒక్క ఇళ్లు కూడా కట్టలేదని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 4 కోట్ల ఇళ్లు నిర్మించిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారని విమర్శించారు. 

కుక్కలు చింపిన విస్తరి అవుతుంది
గతంలో దేశంలో విద్యుత్ కోతలు ఉండేవని, మోదీ ప్రభుత్వం వచ్చాక ఎక్కడా కోతలు లేవని చెప్పారు. ఎగుమతుల్లో భారత్ దూసుకెళ్తోందని, భారత్ నుంచి 150 దేశాలకు సెల్ ఫోన్ ఎగుమతులను చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణా నుంచి బీజేపీ అత్యధిక సీట్లు గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఫ్రంట్‌ల పేరుతో  ఇతర పార్టీలు అధికారంలోకి వస్తే దేశాన్ని కుక్కలు చింపిన విస్తరి లాగా చేస్తారని విమర్శించారు.

భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక అయోధ్య రామ మందిరం
వచ్చే ఎన్నికల్లో బీజేపీని, నరేంద్ర మోదీని ప్రజలు, నాయకులు  బలపరచాలని కోరారు. దేశానికి బీజేపీ అవసరం ఎంతో ఉందన్నారు. అయోధ్య రామ మందిరం దేవాలయం మాత్రమే కాదని, భారతీయుల ఆత్మ గౌరవానికి ప్రతీక అన్నారు. ఈ వేడుకలను చూసేందుకు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నారు. అధునాతన టెక్నాలజీ‌తో అయోధ్య రామమందిరం కార్యక్రమాలను లైవ్‌లో చూపించబోతున్నట్లు చెప్పారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
Telangana EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
RBI Plastic Notes: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
Indian tourists Vietnam: రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
Embed widget