అన్వేషించండి

Kishan Reddy: వికారాబాద్‌లోని అనంతగిరి అభివృద్ధికి రూ.100 కోట్లు ఖర్చు: కిషన్‌ రెడ్డి

Anantagiri in Vikarabad District: వికారాబాద్ జిల్లాలోని పర్యాటక కేంద్రం అనంతగిరికి కేంద్ర ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించనున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Anantha Padmanabha Swamy temple in Vikarabad: వికారాబాద్: జిల్లాలోని పర్యాటక కేంద్రం అనంతగిరికి కేంద్ర ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించనున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రైవేటు రంగాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు. వికారాబాద్‌ జిల్లా కోటిపల్లిని సోమవారం కిషన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అక్కడ బోటింగ్ చేశారు. పర్యాటక రంగానికి భారత్ (India) లో ఎంతో అనుకూలమైన ప్రదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. భారత్ టూరిజం మరింత అభివృద్ధి చెందాలంటే ప్రైవేట్ పెట్టుబడులు రావాలని అభిప్రాయపడ్డారు. 

పీఎం జన్మన్ పథకం ప్రారంభోత్సవంలో కిషన్ రెడ్డి
వికారాబాద్ జిల్లా తాండూరు చైతన్య నగర్ లో పీఎం జన్మన్ పథకం ప్రారంభోత్సవంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. గిరిజన జీవితాలలో నిజమైన క్రాంతి ఈ సంక్రాంతే అన్నారు. గిరిజన గ్రామాలలో అన్ని మౌలిక వసతుల కల్పననే పీఎం జన్మన్ ఉద్దేశమన్నారు. గత 15వ తేదీన క్యాబినెట్ లో జన్మన్ పై  ప్రణాళికలు సిద్ధం చేశారు. 75 సంవత్సరాలుగా కనీస వసతులు లేని గిరిజన గ్రామాలను.. నేటి నుంచి జన్మాన్ పథకం ద్వారా గిరిజన గ్రామాలలో అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. 

Kishan Reddy: వికారాబాద్‌లోని అనంతగిరి అభివృద్ధికి రూ.100 కోట్లు ఖర్చు: కిషన్‌ రెడ్డి
 
దేశంలో 18 రాష్ట్రాలలో 22 వేల గ్రామాలలో జన్మాన్ పథకం అమలు కానుంది. ప్రతి గ్రామంలో ఆధార్, రేషన్ జననా,మరణ ధ్రువపత్రాలు విద్యుదీకరణ మీటర్లు, 11రకాల మౌలిక వసతుల కల్పన జరుగుతుంది. 503 గ్రామాలలో మొబైల్ టవర్లు ఏర్పాట్లు, 300 అంగన్వాడీ కేంద్రాలు, 84 వేల ఆయుష్మాన్ భారత్ కార్డులు అందజేయనున్నారు. వాటి ద్వారా తెలంగాణలో 468 గ్రామాలలో 55 వేల మందికి లబ్ది చేకూరనుందని కిషన్ రెడ్డి తెలిపారు. 

పార్టీలకతీతంగా రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చెందే విధంగా పనిచేయాలి. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్ కు 100 కోట్ల రూపాయలతో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని పునరుద్ఘాటించారు. స్వదేశీ దర్శన్ పేరిట అనంతగిరి పర్యాటకం అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధి కోసం బడ్జెట్ ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు.

టాప్ హెడ్ లైన్స్

Viral Video: వీడియో కాల్‌లోనే కడసారి చూపులు - క్షీణిస్తున్న మానవ సంబంధాలపై సజ్జనార్ ఆవేదన
వీడియో కాల్‌లోనే కడసారి చూపులు - క్షీణిస్తున్న మానవ సంబంధాలపై సజ్జనార్ ఆవేదన
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Mancherial MLA Prem Sagar Rao: అవినీతి ఆరోపణలపై మంచిర్యాల ఎమ్మెల్యే సవాల్ - సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆగ్రహం
అవినీతి ఆరోపణలపై మంచిర్యాల ఎమ్మెల్యే సవాల్ - సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆగ్రహం

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
Embed widget