అన్వేషించండి

KCR News: నేడే విపక్షాల మీటింగ్, వెళ్లొద్దని కేసీఆర్ నిర్ణయం - హాజరైతే ఎదురయ్యే పరిణామాలివే అంటున్న పార్టీ నేతలు!

TRS ఈ సమావేశానికి హాజరైతే కాంగ్రెస్‌ ‌పార్టీకి దగ్గర అవుతుందనే తప్పుడు సంకేతాలను పంపుతుందని, అందుకే ఆ సమావేశానికి హాజరు కావొద్దని, పార్టీ నేతలు కేసీఆర్ కు చెప్పినట్లు తెలిసింది.

KCR Not Attending to Opposition Parties Meet: రాష్ట్రపతి ఎన్నికల వ్యూహాల కోసం త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో నిర్వహించనున్న విపక్ష పార్టీల సమావేశానికి టీఆర్ఎస్ హాజరు కావడం లేదు. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ కీలక నేతలతో వరుస సమావేశాలు నిర్వహించిన అనంతరం వారి అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు దేశవ్యాప్తంగా 19 విపక్ష రాజకీయ పార్టీలకు, సీఎంలకు మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో బుధవారం (జూన్ 15) మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరగనుంది. తాను హాజరు కాకూడదని నిర్ణయించుకోవడమే కాక, పార్టీ తరఫున ప్రతినిధి బృందాన్ని కూడా ఆ సమావేశానికి పంపకూడదని కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి కేసీఆర్ వ్యూహాలు రచిస్తూ చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

తొలుత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్‌ కె.కేశవరావుతో కూడిన టీఆర్‌ఎస్‌ ప్రతినిధి బృందాన్ని పంపాలని తొలుత భావించినా పార్టీ నేతలు అభిప్రాయాలు, హాజరైతే కలిగే పరిణామాలను అంచనా వేసి మొత్తానికే దూరంగా ఉండాలని కేసీఆర్‌ నిర్ణయించారు. 

కాంగ్రెస్, బీజేపీతో సమాన దూరం పాటించాలన్నది టీఆర్‌ఎస్ పార్టీలో మెజారిటీ నేతల అభిప్రాయం. ఒకవేళ టీఆర్‌ఎస్‌ ఈ సమావేశానికి హాజరైతే కాంగ్రెస్‌ ‌పార్టీకి దగ్గర అవుతుందనే తప్పుడు సంకేతాలను పంపుతుందని, అందుకే ఆ సమావేశానికి హాజరు కావొద్దని, పార్టీ నేతలు కేసీఆర్ కు చెప్పినట్లు తెలిసింది. ఆ విపక్షాల భేటీకి కాంగ్రెస్‌ను కూడా మమత ఆహ్వానించడం, అదే భేటీకి టీఆర్‌ఎస్‌ హాజరైతే రాష్ట్రంలో ఎదురు కాబోయే రాజకీయ పరిణామాలు, తద్వారా బీజేపీ చేయబోయే విమర్శలపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. అయితే, విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలబడితే కేసీఆర్ మద్దతిస్తారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

ఇటీవల పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ అధినేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించిన కేసీఆర్, జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో తనదైన శైలిలో వ్యూహం పాటిస్తారని టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18న జరగనుండగా, జూలై 21న ఫలితాలు వెలువడనున్నాయి. 

Also Read: Weather Updates: వేగంగా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు - నేడు ఆ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget