అన్వేషించండి

Kavitha Case: కవిత కేసు మార్చి 13కి వాయిదా - సమయం లేదని విచారణ చేపట్టని సుప్రీంకోర్టు !

upreme Court : సుప్రీంకోర్టులో కవిత కేసు మార్చి 13వ తేదీకి వాయిదా పడింది. సమయం లేకపోవడంతో నేడు ధర్మాసనం విచారణ జరపలేదు.

Kavitha case was adjourned to March 13 in the Supreme Court  :    సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు వచ్చేనెల 13కి వాయిదాపడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ పై బుధవారం విచారణ జరగాల్సి ఉండగా.. సమయం లేకపోవడంతో నేడు ధర్మాసనం విచారణ జరపలేదు. విచారణను న్యాయస్థానం మార్చి 13కు వాయిదా వేసింది. తనపై ఈడీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని సుప్రీంను కవిత కోరారు. అయితే సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. 

ఈ స్కామ్ కు సంబంధించి పలుమార్లు విచారణకు హాజరైన తర్వాత నిరుడు మార్చిలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఆమె తరపు అడ్వొకేట్  వందన సెఘల్  మొత్తం 105 పేజీలతో కూడిన రిట్  పిటిషన్ ను దాఖలు చేశారు. అప్పట్లో  ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం... కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి నళిని చిదంబరం, బెంగాల్  సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్  బెనర్జీ పిటిషన్లతో ట్యాగ్ చేసింది.  అయితే ఇటీవల ఈ పిటిషన్లు మరోసారి జస్టిస్ బెల ఎం.త్రివేది, జస్టిస్  పంకజ్ మిత్తల్ తో కూడిన బెంచ్  ముందుకు రాగా... ఎందుకు అన్ని పిటిషన్లను కలిపి విచారించాలని ధర్మాసనం ప్రశ్నించింది. అన్ని పిటిషన్లు కలిపి విచారణ చేపట్టాలని తాము భావించడం లేదని తెలిపింది. 

 తాజాగా సీబీఐ నోటీసుల నేపథ్యంలో కవిత దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి ఏర్పడింది.  ఈ పిటిషన్ పై తుది వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొనడంతో విచారణ జరుగుతుందని అనుకున్నారు. కానీ విచారణ వాయిదా పడింది.  ఈ పిటిషన్ ను చూపుతూ తాజాగా ఈడీ విచారణకు కవిత గైర్హాజరయ్యారు. అలాగే సీబీఐ ఇచ్చిన సమన్ల వ్యవహారంలో సమాధానం ఇచ్చిన కవిత ఈ కేసులోని అంశాలను వివరిస్తూ లేఖ రాసి విచారణకు హాజరయ్యేది లేదన్నారు.  ఈడీ కేసులో తనను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్  జనరల్  సుప్రీంకోర్టులో హామీ ఇచ్చారన్నారు.  ఇదే హామీ సీబీఐకి కూడా వర్తిస్తుందని తన రిప్లై లో ప్రస్తావించారు.              

సుప్రీంకోర్టులో విచారణ జరగకపోవడతో  ఈడీ విచారణకు పిలవడంపై ఆంక్షలు ఉన్నట్లే అనుకోవచ్చు. అయితే సీబీఐ విషయంలో మాత్రం స్పష్టత లేదు. విచారణకు  హాజరు కానందున సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపైనా స్పష్టత లేదు. మరోసారి నోటీసులు జారీ చేస్తుందా లేకపోతే.. సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణలో ఉన్నందున ఈడీ లాగే ఎదురు చూస్తుందా అన్నది తేలాల్సి ఉంది.                                                                       

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: ఎమర్జెన్సీని తలపించేలా సీఎం రేవంత్ పాలన - ఏడో గ్యారెంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న హరీష్ రావు
ఎమర్జెన్సీని తలపించేలా సీఎం రేవంత్ పాలన - ఏడో గ్యారెంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న హరీష్ రావు
Puspha Collections: పుష్పను తమ ఖాతాలో వేసుకున్న వైఎస్ఆర్‌సీపీ - అల్లు అర్జున్ క్లారిటీ ఇస్తారా ? మౌనం వహిస్తారా ?
పుష్పను తమ ఖాతాలో వేసుకున్న వైఎస్ఆర్‌సీపీ - అల్లు అర్జున్ క్లారిటీ ఇస్తారా ? మౌనం వహిస్తారా ?
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: ఎమర్జెన్సీని తలపించేలా సీఎం రేవంత్ పాలన - ఏడో గ్యారెంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న హరీష్ రావు
ఎమర్జెన్సీని తలపించేలా సీఎం రేవంత్ పాలన - ఏడో గ్యారెంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న హరీష్ రావు
Puspha Collections: పుష్పను తమ ఖాతాలో వేసుకున్న వైఎస్ఆర్‌సీపీ - అల్లు అర్జున్ క్లారిటీ ఇస్తారా ? మౌనం వహిస్తారా ?
పుష్పను తమ ఖాతాలో వేసుకున్న వైఎస్ఆర్‌సీపీ - అల్లు అర్జున్ క్లారిటీ ఇస్తారా ? మౌనం వహిస్తారా ?
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Youtube Income: యూట్యూబ్ నుంచి సంపాదించాలంటే ఇన్ని మార్గాలు ఉన్నాయా? - మీరు కూడా చూసేయండి!
యూట్యూబ్ నుంచి సంపాదించాలంటే ఇన్ని మార్గాలు ఉన్నాయా? - మీరు కూడా చూసేయండి!
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
Sukumar: 'ఆర్య' నుంచి 'పుష్ప 2' వరకూ... సుకుమార్ హీరోలలో ఈ లోపాలు గమనించారా?
'ఆర్య' నుంచి 'పుష్ప 2' వరకూ... సుకుమార్ హీరోలలో ఈ లోపాలు గమనించారా?
Embed widget