అన్వేషించండి

Kavitha Comments : 11న విచారణకు హాజరవుతా - మోదీ టార్గెట్ చేస్తున్నారన్న కవిత !

ప్రధాని మోదీ తమను టార్గెట్ చేస్తున్నారని కవిత ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించారని విమర్శించారు.

Kavitha Comments :  11వ తేదీన  విచారణకు వస్తానని ఈడీకి సమాచారం ఇచ్చానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమె ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమను కాకుండా నిరుద్యోగాన్ని, ధరల పెరుగుదలను టార్గెట్ చేయాలని సూచించారు.  తెలంగాణలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. 9న రావాలని ఈడీ తన నోటీసుల్లో ఆదేశిచిందని.. వేరే పనుల వల్ల 11వ తేదీన  వస్తానని చెప్పానన్నారు. ఐటీ, ఈడీ, సీబీఐ పేరుతో  బెదిరిపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. నోటీసు ఇచ్చిన తర్వాత రెండు రోజుల సమయం అయినా ఇవ్వరా అని ప్రశ్నించారు. ఈడీ దర్యాప్తునకు వంద శాతం సహకరిస్తానన్నారు. తన ఇంటికే వచ్చి విచారణ చేయాలని కోరామని.. కావాలంటే నిందితుల్ని కూడా ఇంటికే తీసుకు వచ్చి ప్రశ్నించమని చెప్పామన్నారు. కానీ ఈడీ అంగీకరించలేదన్నారు. మహిళలను ఇంటిలో విచారించాలనే నిబంధన ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. 

ముందు ప్రధాని  వెనుక అదానీ ఉన్నారని అందరికీ తెలుసని.. మోదీకి తాను భయపడనని బీజేపీ కుట్రలను ఎదుర్కొంటానని కవిత ధీమా వ్యక్తం చేశారు. మోదీ వన్ నేషన్ వన్ ఫ్రెండ్ అనే కొత్త స్కీమ్ తెచ్చారన్నారు. మద్యం కుంభకోణంపై దర్యాప్తునకు అంత తొందర ఎందుకని ప్రశ్నించారు. మోదీ ఎన్ని కుట్రలు చేసినా చివరికి ధర్మమే గెలుస్తుందని... న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని ప్రకటించారు. ఇది నా ఒక్క సమస్య మాత్రమే కాదని.. మా పార్టీ నేతలు 15-16 మందిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విరుచుకుపడుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించారని.. అది సాధ్యం కాకపోవడంతోనే తనను టార్గెట్ చేశారని కవిత ఆరోపించారు.  ఈ కుట్రన్నింటినీ రాజకీయంగా  ఢీ కొడతామమన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రయత్నించిన కేసులో బీఎల్ సంతోష్ విచారణకు ఎందుకు భయపడుతున్నారని కవిత ప్రశ్నించారు. 

ఈ ఏడాది చివరి వరకు తెలంగాణలో ఎన్నికలున్నాయని..అందుకే ప్రధాని మోడీ తమను టార్గెట్ చేశారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు ఉన్నా మోడీ వచ్చే ముందు ఈడీ రావడం కామన్ అని చెప్పారు. అందుకే తమను భయపెట్టేందుకే బీజేపీ ప్రభుత్వం ఈడీని తమపై ప్రయోగించిందన్నారు. తనను మాత్రమే కాదు..తనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నేతలు సహా 15 మందిని బీజేపీ ప్రభుత్వం విచారణ పేరుతో వేధిస్తోందన్నారు.  బీజేపీ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తులు చేయడం లేదన్నారు. ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరగానే.. వారిపై విచారణలు ఆగిపోతున్నాయని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎవరికీ బీ టీమ్ కాదని.. తమది ఎప్పటికీ ఏ టీమేనని కవిత స్పష్టం చేశారు. తన తండ్రి , సోదరుడి మద్దతే కాదని.. బీఆర్ఎస్ పార్టీ మొత్తం తనకు సపోర్టుగా ఉందని కవిత స్పష్టం చేశారు. 


విపక్షాలన్నీ ఐక్యంగా పోరాటం చేయడం లేదన్న అంశంపై జాతీయ మీడియా ప్రశ్నకు కవిత భిన్నంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ముందుగా తమ అహంకారాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ఆ పార్టీ వల్లనే విపక్షాల ఐక్యత లేదని విమర్శించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Moinabad Farmhouse Drug Case: మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణాం.. రోహిత్‌ రెడ్డికి హైకోర్టు హైకోర్టు బెయిల్
మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణాం.. రోహిత్‌ రెడ్డికి హైకోర్టు హైకోర్టు బెయిల్
Ashu Reddy Petition : హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి - పెళ్లి పేరిట మోసం కేసులో బిగ్ ట్విస్ట్
హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి - పెళ్లి పేరిట మోసం కేసులో బిగ్ ట్విస్ట్
BRS: గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!
గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!
Telangana 10th Class Results: రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్

వీడియోలు

RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు
Virat Kohli 9000 Runs in IPL | ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ విశ్వరూపం
DC vs RCB IPL 2026 Powerplay | పవర్ ప్లే లో చేతులెత్తేసిన ఢిల్లీ
Mitchell Santner Ruled Out IPL 2026 | ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్
Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Moinabad Farmhouse Drug Case: మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణాం.. రోహిత్‌ రెడ్డికి హైకోర్టు హైకోర్టు బెయిల్
మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణాం.. రోహిత్‌ రెడ్డికి హైకోర్టు హైకోర్టు బెయిల్
జంథ్యం ఏ సమయాల్లో తీయాలి? ఎప్పుడు మార్చుకోవాలి? యజ్ఞోపవీతం వేసుకుని ఏ పనులు చేయకూడదు?
జంథ్యం ఏ సమయాల్లో తీయాలి? ఎప్పుడు మార్చుకోవాలి? యజ్ఞోపవీతం వేసుకుని ఏ పనులు చేయకూడదు?
BRS: గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!
గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!
Nara Lokesh Speech: మనది గూగుల్... వాళ్లది గొడ్డలి! బోత్ ఆర్ నాట్ సేమ్ - విశాఖలో నారా లోకేష్ పంచ్‌లు
మనది గూగుల్... వాళ్లది గొడ్డలి! బోత్ ఆర్ నాట్ సేమ్ - విశాఖలో నారా లోకేష్ పంచ్‌లు
Crime News: చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
Punjab Crisis: పంజాబ్‌ ప్రభుత్వమూ బీజేపీ ఖాతాలోకి మారుతోందా? - అక్కడా విలీన వ్యూహం అమలు కాబోతోందా?
పంజాబ్‌ ప్రభుత్వమూ బీజేపీ ఖాతాలోకి మారుతోందా? - అక్కడా విలీన వ్యూహం అమలు కాబోతోందా?
Telangana 10th Class Results: రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
Honda ZR-V Mileage: ఫుల్ ట్యాంక్‌తో 1000 కి.మీ రేంజ్.. మోడ్రన్ ఫీచర్లతో విడుదల కానున్న హోండా SUV
ఫుల్ ట్యాంక్‌తో 1000 కి.మీ రేంజ్.. మోడ్రన్ ఫీచర్లతో విడుదల కానున్న హోండా SUV
Embed widget