అన్వేషించండి

Vemulawada: మారువేషంలో వేములవాడ ఆలయ ఈవో.. బెదిరిపోయిన కాంట్రాక్టర్, క్రిమినల్ కేసు నమోదు

ఆలయంలో పార్కింగ్‌ టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌.. అధికారులు నిర్ణయించిన ధరలకంటే అదనంగా వసూలు చేస్తున్నారు. దీనిపై ఆలయ అధికారులకు భక్తులు నుంచి ఫిర్యాదులు అందాయి.

వేములవాడ ఆలయ ప్రాంగణంలో పార్కింగ్ అక్రమ వసూళ్లపై ఆలయ ఈఓ రమాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తురాలిలా ఓ ప్రైవేటు వాహనంలో వెళ్లి పార్కింగ్ టికెట్‌ కొనుగోలు చేసి జరుగుతున్న మోసాన్ని గ్రహించారు. ఆలయ టికెట్లకు బదులు అధిక ధరలతో సొంత టికెట్లు విక్రయిస్తున్న గుత్తేదారుని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పార్కింగ్ ఫీజు 50 రూపాయలకు బదులు 80 రూపాయలు, 30 రూపాయలకు బదులు 60 రూపాయలు, రూ.100 టికెట్లను రూ.150లకు అమ్ముతున్నట్లు బహిర్గతం అయింది.

అనంతరం పార్కింగ్‌ టెండర్‌ను రద్దు చేసి ఉచిత పార్కింగ్ కల్పిస్తున్నామని ఆలయ ఈఓ రమాదేవి వెల్లడించారు. అక్రమ సంపాదనకు ఆలయమే దొరికిందా అని అక్రమార్కులను ఈవో నిలదీశారు.

ఆలయంలో పార్కింగ్‌ టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌.. అధికారులు నిర్ణయించిన ధరలకంటే అదనంగా వసూలు చేస్తున్నారు. దీనిపై ఆలయ అధికారులకు భక్తులు నుంచి ఫిర్యాదులు అందాయి. రెండు వారాల క్రితం ఆలయానికి రమాదేవి ఈవోగా వచ్చారు. రాగానే పార్కింగ్‌ అక్రమ వసూళ్ల సంగతేంటో తేల్చాలని డిసైడ్‌ అయ్యారు. అందుకో ఓ ప్లాన్‌ వేశారు. పార్కింగ్‌ కాంట్రాక్టర్‌ అక్రమాలను బయటపెట్టేందుకు ఆమె సాధారణ భక్తుల తరహాలో కారులో వెళ్లారు. టీటీడీ వసతి గదుల సముదాయంలోకి వెళ్లారు. కారు పార్కింగ్‌ ఎంతని అడగగా 80 రూపాయలంటూ అక్కడి సిబ్బంది తెలిపారు. దీంతో 80 రూపాయలు కారు పార్కింగ్‌ కోసం చెల్లించారు. అందుకు పార్కింగ్ సిబ్బంది రశీదు కూడా ఇచ్చారు.

80 రూపాయలు పార్కింగ్‌ ఫీజు చెల్లించినట్టు రశీదు ఇవ్వడంతో ఈవో రమాదేవి ఒక్కసారిగా శివంగిలా మారారు. పార్కింగ్‌ కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆలయ ఈవోనని.. చెప్పడంతో అక్కడి సిబ్బంది నీళ్లు నమిలారు. వాస్తవానికి ప్రతి కారుకు రూ.50 మాత్రమే వసూలు చేయాలి.. కానీ పార్కింగ్‌ కాంట్రాక్టర్‌ మాత్రం 80 రూపాయలు వసూలు చేస్తున్నారు. పార్కింగ్‌ రశీదుపై ఎలాంటి రుసుము లేకుండా ప్రింట్‌ చేయించారు. ఆలయ అధికారులు పార్కింగ్‌ ఫీజుతో ప్రింట్‌ చేసిన రశీదు పుస్తకాన్ని పక్కన పడేసి.. సొంతంగా ప్రింట్‌ చేయించుకుని ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నారు.

ఇక భారీ వాహనాలకు రూ.100 వసూలు చేయాల్సి ఉండగా.. రూ.150 వసూలు చేస్తున్నారు. అధిక పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తున్నట్టు తేలడంతో కాంట్రాక్టర్‌, సిబ్బంది వద్ద ఉన్న 20కి పైగా రశీదు బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. కాంట్రాక్టర్‌ లచ్చయ్యపై క్రిమినల్‌ కేసు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. సీఐకి ఫోన్‌ చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్ కేసులో మరో ట్విస్ట్.. కొత్తగా మరో సెక్షన్ చేర్చిన పోలీసులు.. దోషిగా తేలితే 10 ఏళ్ల జైలు!
బండి భగీరథ్ కేసులో మరో ట్విస్ట్.. కొత్తగా మరో సెక్షన్ చేర్చిన పోలీసులు.. దోషిగా తేలితే 10 ఏళ్ల జైలు!
TS EAPCET 2026 Results : తెలంగాణ ఎప్‌సెట్ 2026 ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ ఎప్‌సెట్ 2026 ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
Bandi Bhageerath POCSO Case: నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
Bandi Bhageerath Remand: పోక్సో కేసులో బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dollar vs Indian Rupee: డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటనతో భారత రూపాయి ఢమాల్.. ఆల్ టైమ్ కనిష్టానికి కరెన్సీ
డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటనతో భారత రూపాయి ఢమాల్.. ఆల్ టైమ్ కనిష్టానికి కరెన్సీ
Supreme Court: హైదరాబాద్‌లోని KBR పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
Supreme Court: హైదరాబాద్‌లోని KBR పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
AP Rajya Sabha Elections: ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
Viral News: చంద్రగిరిలో ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు కలకలం.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పులివర్తి నాని
చంద్రగిరిలో ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు కలకలం.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పులివర్తి నాని
India Hottest Cities: భగభగ మండుతున్న భారత్.. భూమిపై 50 వేడినగరాలు మనదేశంలోనే...!
భగభగ మండుతున్న భారత్.. భూమిపై 50 వేడినగరాలు మనదేశంలోనే...!
Indian Student Dies In US: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
US Iran War Updates: యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
Agri Gold Scam: ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం - ఏపీ ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్ - చేస్తే రాజకీయంగా మేలు!
6 నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం - ఏపీ ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్ - చేస్తే రాజకీయంగా మేలు!
Embed widget