అన్వేషించండి

కరీంనగర్‌ జిల్లాలో ఊపందుకోనున్న వరి కోతలు- ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధం

ధాన్యం సేకరణకు ప్రభుత్వం సర్వం సిద్దంగా ఉందన్నారు తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్‌లో మాట్లాడుతూ దాదాపు కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉంటుందన్నారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభం కానున్నాయి. మరో వారం రోజుల్లో ట్రాక్ హార్వెస్టర్లను సిద్ధం చేసుకుని రైతులు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 2.7 లక్షల పైచిలుకు ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ఈసారి సన్న బియ్యానికి డిమాండ్ పెరగడంతో దానికి తగినట్టుగా 30 వేల నుంచి 40 వేల ఎకరాల వరకు సన్న రకాలు సాగు చేశారు. దిగుబడి తక్కువగా ఉండడంతోపాటు డిమాండ్ కారణంగా వ్యాపారులు.. రైస్ మిల్లర్లు వీటిని ఎక్కువ ధరకు చెల్లించి నేరుగా కొనే అవకాశం ఉంది. 

ఈసారి నవంబర్ మొదటి వారంలో వరి కోతలు ప్రారంభమై చివర వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే ఎకరాకు 22 క్వింటాల చొప్పున దిగుబడి వచ్చినా ఆరు లక్షల మెట్రిక్ టన్నుల పంట అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని ప్రకారం దాదాపుగా ఆరు లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు దిగుబడి వచ్చినా 4.5 లక్షల టన్నుల ధాన్యాన్ని విక్రయానికి తీసుకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 

కరీంనగర్ హుజరాబాద్‌ను సెక్టార్లుగా విభజించి సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు ట్రాన్స్‌ పోర్ట్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు పూర్తి అయిన తర్వాత 24 గంటల్లోగా రైతులకు డబ్బు చెల్లించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ధాన్యంలో 17 శాతానికి మించి తేమ ఉండకుండా చూసుకోవాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు. ఆరు శాతం వరకు తాలు రంగు మారిన ధాన్యం ఉన్న అంగీకరిస్తామని తెలిపారు. రైతులు తమ పట్టాదారు పుస్తకం బ్యాంక్ పాస్‌బుక్‌తోపాటుప ఆధార్ కార్డుల జిరాక్స్‌లను కొనుగోలు సమయంలో అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు

ఈ వానాకాలం పంట సేకరణకు ప్రభుత్వం సర్వం సిద్దంగా ఉందన్నారు తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్‌లో మాట్లాడుతూ దాదాపు కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉంటుందని దీనికి అవసరమైన నిధుల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పౌరసరఫరాల సంస్థకు అందించారన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట సేకరణ ప్రక్రియ కొనసాగుతుందని, దాదాపు 7100లకుపైగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతోపాటు అవసరమైన చోట మరో వంద వరకూ ఏర్పాటు చేసుకోవడానికి కలెక్టర్లకు నిర్ధిష్ట ఆదేశాలు ఇచ్చామన్నారు మంత్రి గంగుల. 

ఈసారి పంట సేకరణకు 25 కోట్ల గన్నీబ్యాగులు అవసరమని ఇప్పటికే 14 కోట్ల గన్నీలను సేకరించామని, కొనుగోలు జరుగుతన్న క్రమంలో మిగతా గన్నీలు అందుబాటులోకి వస్తాయన్నారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన మాయిశ్చర్ మిషన్లు, పాడీ క్లీనర్లు, టార్పాలిన్లు తదితర సమగ్ర సామాగ్రీ అందుబాటులో ఉందన్నారు. రాబోయే రెండున్నర నెల్ల పాటు ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని, ఎక్కడ ఎలాంటి అవసరమున్నా తక్షణం స్పందించేలా యంత్రాంగాన్ని సిద్దం చేసామన్నారు, దీన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
SIR In Telangana: తెలంగాణలో నేటి నుంచి SIR ప్రక్రియ ప్రారంభం! ఇలా చేస్తేనే మీ ఓటు భద్రం!
తెలంగాణలో నేటి నుంచి SIR ప్రక్రియ ప్రారంభం! ఇలా చేస్తేనే మీ ఓటు భద్రం!
Revanth Reddy Warning: SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
Doctor Vikrant Singh Diet : డాక్టర్ విక్రాంత్ సింగ్ 6 ఏళ్లుగా ఫాలో అవుతున్న డైట్ ఇదే.. బీపీ, ప్రీడయాబెటిస్ రివర్స్ అయిందట, మరి నిపుణుల సలహా ఏంటి?
డాక్టర్ విక్రాంత్ సింగ్ 6 ఏళ్లుగా ఫాలో అవుతున్న డైట్ ఇదే.. బీపీ, ప్రీడయాబెటిస్ రివర్స్ అయిందట, మరి నిపుణుల సలహా ఏంటి?

వీడియోలు

NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Hardik Pandya To KKR For IPL 2027? | ముంబైని వీడనున్న హార్దిక్? KKR లోకి భారీ డీల్
Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్
ICC Rankings 2026 Shubman Gill | వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha Local Status Speech: గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
IAS Y Srilakshmi GAD Post: వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
Breaking News:పాస్‌పోర్ట్ ఫీజులను భారీగా పెంచిన కేంద్రం!
పాస్‌పోర్ట్ ఫీజులను భారీగా పెంచిన కేంద్రం!
Gold Price: పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
SEBI New Rules 2026: 5 లక్షల ఫాలోవర్స్‌ ఉంటే మీరు సెలబ్రిటీనే! సెబీ నుంచి బిగ్ అప్‌డేట్‌!
5 లక్షల ఫాలోవర్స్‌ ఉంటే మీరు సెలబ్రిటీనే! సెబీ నుంచి బిగ్ అప్‌డేట్‌!
Darshanam Mogilaiah Land Dispute: వివాదాల్లో ఉన్న భూమి ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం - కోర్టుల చుట్టూ తిరుగుతున్న దర్శనం మొగిలయ్య - ఆదుకోవాలని వేడుకోలు
వివాదాల్లో ఉన్న భూమి ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం - కోర్టుల చుట్టూ తిరుగుతున్న దర్శనం మొగిలయ్య - ఆదుకోవాలని వేడుకోలు
Dharman OTT : రజనీ ధర్మన్ ఓటీటీ డీల్ క్లోజ్ - రిలీజ్‌కు ముందే రికార్డులు
రజనీ ధర్మన్ ఓటీటీ డీల్ క్లోజ్ - రిలీజ్‌కు ముందే రికార్డులు
Embed widget