అన్వేషించండి

Minister Gangula: భాష్యం విజయ సారథి మరణం రాష్ట్రానికి తీరని లోటు: మంత్రి గంగుల కమలాకర్

Minister Gangula: పద్మశ్రీ భాష్యం విజయ సారథి సంస్మరణ సభలో మంత్రి గంగుల కమలాకర్ తో పాటు ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు. 

Minister Gangula: భాష్యం విజయ సారథి లేరన్న పదాన్ని తమతో పాటు తన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నామని రాష్ట్ర బీసీ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. విజయ సారథికి తమ కుటుంబానికి విడదీయరాని బంధం ఉందని.. ఆయన లేని లోటు రాష్ట్రానికి మన జిల్లాకు తీరని లోటని వివరించారు. కరీంనగర్ లోని యజ్ఞ వరాహ స్వామి దేవస్థానంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత  భాష్యం విజయ సారథి సంస్మరణ సభ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ గారితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ... భాష్యం విజయ సారథితో సమాలోచనలు చేయనిదే తాను ఏ కార్యక్రమం చేపట్టలేదని, ఎన్నికల్లో తన నామినేషన్ తో సహా తన సలహా మేరకే చేసేవాడిని అన్నారు. భాష్యం ఎప్పుడు కలిసినా దేశం కోసం ధర్మం గురించే ఎక్కువగా చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. 

భాష్యం విజయ సారథిని గౌరవించుకుంటే దేవుడిని గౌరవించినట్లేనని, ఎప్పుడు ఆయన గౌరవం తగ్గకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తరపున తనదేనని మంత్రి అన్నారు. ఆయన ఉన్నన్ని రోజులు తనకు ఏ అవకాశం ఇచ్చినా వరంగా భావించే వాడినని అన్నారు. భాష్యం విజయ సారథి గౌరవార్థం ఎస్.ఆర్.ఆర్ కళాశాలలో నిర్మించే అమృత వర్షిణి (కళాభారతి) పేరును భాష్యం విజయ సారథి కళా వేదికగా పేరు మార్పు చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. అలాగే ఈ కళావేదిక ముందు భాష్యం కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. భాష్యం ఉన్నటువంటి వరాహ స్వామి దేవస్థాన మార్గాన్ని భాష్యం విజయ సారథి మార్గంగా పెట్టుకుందామని అన్నారు . సంస్కృతంలో పద్మశ్రీ అందుకొని గొప్ప స్థాయిలో మన జిల్లాకు కీర్తి ప్రతిష్టలను అందించిన భాష్యం ఆలోచనలు, ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించటానికి కార్యక్రమాలు కూడా చేపడతామని తెలిపారు. భాష్యం రాసిన పుస్తకాలు చిరస్థాయిగా ఉండేలా  జిల్లా గ్రంథాలయంలో ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఉంచుతామని అన్నారు. ఆయన సాహిత్యాన్ని బాహ్య ప్రపంచానికి అందించేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు .

64.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు

సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో రైతులకు చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా అత్యద్భుతంగా వానాకాలం ధాన్యం కొనుగోళ్లు చేసామన్నారు మంత్రి గంగుల కమలాకర్. అక్టోబర్ 21న ప్రారంభమైన వానాకాలం పంట సేకరణ మూడునెల్లకు పైగా 94 రోజులు నిరంతరాయంగా నిర్వహించామని, మారుమూల ప్రాంతాల రైతులు సైతం రవాణా కోసం వెతలు పడకుండా, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందుబాటులోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసామన్నారు మంత్రి గంగుల. రాష్ట్రంలో 7024 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని వీటి ద్వారా 13,570 కోట్ల విలువ గల 64.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 9 లక్షల 76వేల మంది రైతుల నుండి సేకరించామన్నారు . ఓపీఎంఎస్లో నమోదైన 12,700 కోట్లను చెల్లించామని మిగతావారికి సైతం వారం రోజుల్లోనే డబ్బులు అందజేస్తామన్నారు మంత్రి గంగుల కమలాకర్. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget