అన్వేషించండి

ప్రైవేటు దవాఖానాల్లో నిబంధనల ఉల్లంఘన, అధికారుల నోటీసులు బేఖాతరు

కరీంనగర్ జిల్లా ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నా.. యాజమాన్యాల్లో మార్పు రావడం లేదు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ నాసిరకమైన సేవలు అందిస్తున్నారంటూ రోగులు ఆరోపిస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రిల్లో నిర్వహిస్తున్న తనిఖీలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. చూసే వాళ్లకు ఏదో జరగబోతుంది అన్నట్టుగా కనిపిస్తున్నా.. ఇదేదో రొటీన్ వ్యవహారం లాగే తీసుకుంటున్నాయి ప్రైవేటు ఆసుపత్రి యజమాన్యాలు. నిబంధనలు అన్నింటిని తుంగలో తొక్కి పేషెంట్ల నుంచి అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తున్నా.. ప్రైవేట్ ఆసుపత్రులు ఏమాత్రం తనిఖీలకు బెదరడం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నా.. అధికారులు తనిఖీలు చేసి మళ్లీ అటువైపు కూడా చూడటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ప్రైవేటు దవాఖానాల్లో నిబంధనల ఉల్లంఘన, అధికారుల నోటీసులు బేఖాతరు

పేరు గొప్ప ఊరు దిబ్బ

ఇప్పటి వరకు జిల్లాలో దాదాపుగా 293 ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో దాదాపు 87 హాస్పిటల్స్ కి నోటీసులు సైతం అందించారు. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే.. ఇవి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా మొదలు పెట్టడమే గమనార్హం. అంతే కాదు పూర్తి స్థాయిలో మార్కెటింగ్ పైనే ఆధారపడి పేషంట్లను జలగల్లా పట్టిపీడిస్తున్నాయి. దాదాపుగా 350కి పైగా ప్రైవేట్ ఆసుపత్రులు జిల్లాలో ఉండగా... పూర్తి స్థాయి తనిఖీలకు మరో మూడు రోజులు పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 100 ఆసుపత్రుల్లో కనీసం 30 ఆసుపత్రులకు అసలు రూల్స్ అనేవి ఏంటో తెలీదు. మరో వైపు బరితెగించి వీరు చేస్తున్న వైద్యాన్ని చూసి ఉన్నతాధికారులు సైతం నివ్వెరపోయారట. అసలు డాక్టర్లే లేని ఆసుపత్రులు బోలెడు ఉన్నాయి. తమ వద్ద ప్రతి స్పెషలిస్ట్ ఉన్నారంటూ బోర్డులు తగిలించుకొని కేవలం ఒకరిద్దరు డాక్టర్లతో కథ నడిపిస్తున్నారు. ఇందులో సొంతంగా హాస్పిటల్ పెట్టుకున్న వారు కొందరు కాగా.. మరికొందరు పెట్టుబడి పెట్టి వైద్యాన్ని పూర్తిగా వ్యాపార వస్తువుగా మార్చి వేశారు.

చాలామందికి అనుమతులు లేకపోవడం ఒక ఎత్తు అయితే ఇంకొన్ని గడువు దాటినా రెన్యువల్ మాత్రం చేయించుకోలేదు. ఇక భారీ ఎత్తున పేషెంట్లను చేర్చుకుంటూ ఉన్నా మూడు పెద్ద ఆసుపత్రులకు కనీసం గుర్తింపు కూడా లేదు. ఇక లైసెన్సు రద్దు అయినా ఆసుపత్రి యజమాన్యం  అదే చోట ఏ మాత్రం భయం లేకుండా ఆస్పత్రిని నడిపిస్తూనే ఉంది.

ఫైర్ సేఫ్టీ ఊసే లేదు?

చాలా వరకు హాస్పిటల్స్ ఇరుకైన భవనాల్లో నిర్మాణమై ఉన్నాయి. ఒకవేళ ఏదైనా అగ్ని ప్రమాదం లాంటిది జరిగితే తప్పించుకునే పరిస్థితి లేదు. ఇలాంటివి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్నో ప్రమాదాలు జరిగి పేషంట్ల ప్రాణాలు సైతం పోయిన పరిస్థితి. అయినా ఇక్కడి వైద్యాధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల ఇష్టారాజ్యం నడుస్తోంది. ఇక ఆలోపతితో పాటు డెంటల్, హోమియో, ఆయుర్వేద ఆసుపత్రిలో సైతం ఇదే రకమైన పరిస్థితి నెలకొని ఉండటాన్ని అధికారులు గుర్తించారు. గతంలో తప్పుడు సర్టిఫికెట్లతో పేషంట్లకు నెలల తరబడి వైద్యం చేసిన ఉదంతాలు సైతం జరిగాయి. చివరకు మీడియా వరుస కథనాలతో సదరు నకిలీ వైద్యులు ప్రాక్టీస్ మానుకున్నారు. నిజానికి ఈ తనిఖీలు రెగ్యులర్ గా జరుగుతూ ఉండాలని సామాన్యులు కోరుతున్నారు. దీనివల్ల కొత్తగా వైద్య వృత్తిలోకి వచ్చే వారు ఎవరో తెలిసిపోతుంది నకిలీ వైద్యుల్లో సైతం అంత ఇంతో భయం ఉంటుందని అంటున్నారు.

జలగల్లా రక్తాన్ని పీలుస్తున్న ప్రైవేటు ఆసుపత్రలు

గతంతో పోలిస్తే ఈసారి భారీ ఎత్తున తనిఖీలు నిర్వహించినప్పటికీ తీసుకునే చర్యలపైనే అధికారులపై ప్రజలకు నమ్మకం కుదురుతుంది. కరోనా సమయంలోనూ రోగాన్ని బూచిగా చూపి అనేక ఆసుపత్రులు చేసిన నిర్వాకం అందరికీ తెలిసిందే. పవిత్రమైన వైద్య వృత్తిని కాపాడాలంటే స్వీయ నియంత్రణ మేలు అని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వైద్యులు భగవంతుడితో సమానం అనే నానుడిని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ఎప్పుడో మర్చిపోయాయి. పేషెంట్ నడిచొచ్చే డబ్బుల యంత్రంలా వారికి కనిపించడమే దీనికంతటికీ కారణం.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
Congress Jeevan Reddy: జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
Telangana Indiramma Family Life Insurance Scheme : తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !
తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Formula E Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Embed widget