అన్వేషించండి

Sircilla: జనశక్తి మళ్లీ జీవం పోసుకుంటోందా? ఆ వార్తల లీక్‌తో కలకలం - తెరవెనుక ఏం జరుగుతోందంటే

Naxals Meeting: సిరిసిల్ల, కోనరావుపేట, ఎల్లారెడ్డి పేట్, గంభీరావుపేట్, ముస్తాబాద్ కు చెందిన పలువురు మాజీలతో ప్రస్తుతం ఉన్న కొందరు నేతలు సమావేశమైనట్లుగా తెలుస్తోంది.

కరీంనగర్ లో తీవ్ర కలకలం రేగింది. ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల అటవీ ప్రాంతంలో జనశక్తి నక్సల్స్ సమావేశం నిర్వహించారంటూ వార్తలు లీక్ అవడంతో అటు నిఘా వర్గాలు, ఇటు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. జనశక్తి సెక్రటరీ విశ్వనాథ్ నేతృత్వంలో సిరిసిల్ల సరిహద్దులో దాదాపు 8 మంది సాయుధులుగా ఉన్నటువంటి నక్సల్స్ మధ్య 65 మంది వరకూ సానుభూతిపరులు సమావేశం అయ్యారని తెలుస్తోంది. ఈ నెల 12వ తారీకు నుండి 14వ తారీఖు వరకు జరిగిన ఈ సమావేశాల విషయం ఆలస్యంగా బయటికి వచ్చింది. 

సిరిసిల్ల, కోనరావుపేట, ఎల్లారెడ్డి పేట్, గంభీరావుపేట్, ముస్తాబాద్ కు చెందిన పలువురు మాజీలతో ప్రస్తుతం ఉన్న కొందరు నేతలు సమావేశమైనట్లు సమాచారం. మరోవైపు, ఈ మీటింగ్ జరగలేదంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలిపారు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. జరిగిన సమావేశాన్ని నిర్ధారించలేదు పైగా ఎవరైనా జనశక్తి పేరుతో డబ్బులు వసూళ్లకు పాల్పడినా, బెదిరింపులకు గురి చేసినా తమకు సమాచారం ఇవ్వాలంటూ తెలిపారు. అయితే నిఘా వర్గాలు అప్రమత్తమై తిరిగి పార్టీకి గతంలో యాక్టివ్ గా పనిచేసిన వారి వివరాలు సేకరించడం మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది.

అప్పట్లో చందుర్తి మండలం బండపల్లి, రాజరావుపల్లి, సనుగుల, కిష్టంపేట గ్రామాల్లో సీపీఐ ఎం‌ఎల్‌ జనశక్తి పేరుతో పలుచోట్ల ఎర్రజెండాలు, వాల్ పోస్టర్లు వెలిశాయి. వాటిని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు అక్కడికి గ్రామానికి చేరుకుని ఎర్రజెండాలు, వాల్ పోస్టర్లను తొలగించారు.  మరో వైపు అడపాదడపా పలువురు జనశక్తి సానుభూతి పరులని, నాయకులని పోలీసులు అరెస్ట్ చేసారు.

జనశక్తి గురించి..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో ప్రభావితం చూపిన జనశక్తి పార్టీని ప్రారంభించింది కూర రాజన్న, అతని సోదరుడు కూర దేవేందర్. రాజన్న అయిన భార్య రంగవల్లి 11 నవంబర్ 1999న ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఇక దేవేందర్ భార్య ప్రఖ్యాత విప్లవ గాయని విమలక్క. వేములవాడలోని బోయివాడకు చెందిన కూర రాజయ్య అలియాస్‌ రాజన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత 1974లో నక్సలైట్ ఉద్యమంలో చేరి, ఆ తర్వాత సీపీఐ-ఎంఎల్ (జనశక్తి) రాజన్న వర్గాన్ని స్థాపించారు. 2004 అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన శాంతియుత చర్చల్లో రాజన్న సోదరుడు జనశక్తికి ప్రాతినిథ్యం వహించిన రాష్ట్ర కమిటీ కార్యదర్శి అమర్ అలియాస్ కూర దేవేందర్. 

2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సల్స్‌ మీద నిషేధం ఎత్తివేసి చర్చలు జరిపింది. చర్చల సమయంలో జనశక్తి దళకమాండర్ రణధీర్ అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 26 మంది దళ సభ్యులతో లొంగిపోయారు. అలా వరుస దెబ్బలతో కుదేలైన ఆ పార్టీ తిరిగి కదలికలు ఉదృతం చేయడంతో పోలీసు వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Deputy CM Pawan Kalyan: ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
Bollywood Actress: ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ

వీడియోలు

Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Deputy CM Pawan Kalyan: ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
Bollywood Actress: ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 మూవీస్... డ్యూడ్, కొన్ని వారాలుగా ట్రెండింగ్ ఫిల్మ్స్‌ లిస్ట్ ఇదుగో
నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 మూవీస్... డ్యూడ్, కొన్ని వారాలుగా ట్రెండింగ్ ఫిల్మ్స్‌ లిస్ట్ ఇదుగో
Telangana Assembly Sessions: ఈ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు? జలాల అంశంపై స్పెషల్ సెషన్.. హీటెక్కిన వాటర్ పాలిటిక్స్
ఈ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు? జలాల అంశంపై స్పెషల్ సెషన్.. హీటెక్కిన వాటర్ పాలిటిక్స్
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
Bhu Bharati Portal: భూభారతి పోర్టల్‌లో విప్లవాత్మక మార్పులు.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూ స‌మాచారం
భూభారతి పోర్టల్‌లో విప్లవాత్మక మార్పులు.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూ స‌మాచారం
Embed widget