అన్వేషించండి

Bandi Sanjay: దొంగ ఓట్లు తొలగించి ఎన్నికలకు వెళదామా? కాంగ్రెస్ గెలిస్తే రాజకీయ సన్యాసం: బండి సంజయ్ ఛాలెంజ్

Telangana Politics | కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఓట్ల ఆరోపణలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామా అని మహేష్ కుమార్ గౌడ్‌కు సవాల్ విసిరారు.

Bandi Sanjay About Fake Votes | కరీంనగర్: దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న "దొంగ ఓట్లు" ఆరోపణలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) చేసిన "దొంగ ఓట్లతో బీజేపీ నేతలు గెలిచారు" అనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. తెలంగాణలో అధికారం మీ చేతిలో ఉంది కదా. అలాగైతే వెంటనే దొంగ ఓట్ల జాబితాను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దొంగ ఓట్లను తొలగించాలని ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాయాలని బండి సంజయ్ అన్నారు. దొంగ ఓట్ల రద్దు తరువాత అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళదాం. కాంగ్రెస్ కనుక ఎన్నికల్లో గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఛాలెంజ్ స్వీకరించగలదా? అని బండి సంజయ్ సవాల్ విసిరారు.

కరీంనగర్ ప్రజలను అవమానించడమే?

తాను కరీంనగర్ నుంచి 2,25,000 ఓట్ల మెజారిటీతో గెలిచానని.. దొంగ ఓట్ల వల్ల అని మాట్లాడడం, కరీంనగర్ ప్రజలను అవమానించడం కాకపోతే మరేంటి?" అని బండి సంజయ్ మండిపడ్డారు. మహేశ్ గౌడ్‌కు చరిత్ర గుర్తుండదు అని ఎద్దేవా చేశారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను చూస్తే 'గజిని' సినిమా గుర్తొస్తుంది. ఒక్కసారి బండి సంజయ్‌ను బీసీ అని విమర్శిస్తారు. మరి ఇప్పుడు దేశ్‌ముఖ్ అని నన్ను పిలుస్తున్నారు. అంటే మహేష్ గౌడుకు తాను చెప్పింది ఏమిటో కూడా గుర్తుండదు అని ఎద్దేవా చేశారు. ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గానైనా గెలవని టీపీసీసీ చీఫ్‌కు ఓట్ల చోరీ గురించి ఏమి తెలుస్తుంది?" అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

పంచాయతీలకు నిధులు ఇచ్చిందెవరు?

"20 నెలల పాలనలో ఒక్క పైసా కూడా పంచాయతీలకు నిధులు ఇవ్వని పార్టీ కాంగ్రెస్. కేంద్రం నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు జరుపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులిచ్చింది కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే. ఓట్ల కోసం యాచన చేయాల్సిన స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. హిందువులపట్ల చులకన ధోరణితో వ్యవహరిస్తూ, మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. నేను గెలిచానంటే అది హిందూ ఓట్లతోనే. తెలంగాణలో బలమైన హిందూ ఓటు బ్యాంకు నిర్మించడమే మా లక్ష్యం" అని బండి సంజయ్ స్పష్టం చేశారు.

మత రాజకీయాలపై విమర్శలు

కాంగ్రెస్ మతం పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్లలా మారింది. మసీదుల్లోకి వెళ్లి టోపీ పెట్టుకుని ప్రార్థనలు చేస్తూ కొందరు నేతలు నటిస్తారు. కానీ హిందువులు గణేశ్ ఉత్సవాల్ని జరుపుకోవాలన్నా కూడా షరతులు పెడతారు. బీజేపీ అధికారంలోకి వస్తే చట్టపరంగా గణేశ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం. హిందూ ధర్మ పరిరక్షణ కోసం బీజేపీ ఎల్లప్పుడూ పోరాడుతుంది" అన్నారు.

రోహింగ్యాలపై ఆరోపణలు 

"రోహింగ్యాలు 2014కి ముందే దేశంలోకి అక్రమంగా వచ్చారు. అప్పట్లో పాలకులెవరో మర్చిపోకండి. అప్పుడే దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నదని ఆ పార్టీ నేతలకే గుర్తులేదు. ఇప్పుడు వారిని వెనక్కి పంపిద్దామంటే కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి సహకరించడంలేదు. మేము అయితే సరిహద్దుల్లో ఫెన్సింగ్ పెట్టాము, అక్రమ వలసను అడ్డుకుంటున్నాం. విదేశీయులు పాస్‌పోర్టు, వీసా గడువు ముగిశాక వాళ్లను దేశం నుంచి వెనక్కి పంపిస్తున్నామని" బండి సంజయ్ అన్నారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Philippines Earthquake Videos: స్కూల్స్ నుంచి మాల్స్ వరకు ఎటు చూసినా హాహాకారాలు.. ఫిలిప్పీన్స్ భూకంపం విధ్వంసం వీడియోలు
స్కూల్స్ నుంచి మాల్స్ వరకు ఎటు చూసినా హాహాకారాలు.. ఫిలిప్పీన్స్ భూకంపం విధ్వంసం వీడియోలు
Israel Iran War: పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు
పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు
IND vs AFG Test Highlights: భారత స్పిన్‌కు అఫ్గాన్ విలవిల.. అరంగేట్రంలోనే మానవ్ సుతార్ సరికొత్త చరిత్ర.. 412 రన్స్ ఆధిక్యం
భారత స్పిన్‌కు అఫ్గాన్ విలవిల.. అరంగేట్రంలోనే మానవ్ సుతార్ సరికొత్త చరిత్ర.. 412 రన్స్ ఆధిక్యం
Pawan Kalyan Social Engineering: కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
Chepa Prasadam: నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Rajinikanth Annamalai New Party TN: అన్నామలైతో పాటు రజనీకాంత్ కూడా - ఇద్దరూ కలిసే కొత్త పార్టీ - తమిళనాడులో అంతా మారిపోతోందా?
అన్నామలైతో పాటు రజనీకాంత్ కూడా - ఇద్దరూ కలిసే కొత్త పార్టీ - తమిళనాడులో అంతా మారిపోతోందా?
RERA Rules: ఫ్లాట్ మీ చేతికి రాకున్నా EMIలు కడుతూనే ఉన్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
ఫ్లాట్ మీ చేతికి రాకున్నా EMIలు కడుతూనే ఉన్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
Carpal Tunnel Syndrome : యువతలో పెరుగుతున్న కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. ఫోన్, ల్యాప్‌టాప్ ఉపయోగించడమే కారణమా?
యువతలో పెరుగుతున్న కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. ఫోన్, ల్యాప్‌టాప్ ఉపయోగించడమే కారణమా?
Embed widget