అన్వేషించండి

ఓటేసి తప్పు చేశాం- ఎమ్మెల్యేపై కోపంతో చెప్పుతో కొట్టుకున్న ప్రజలు, ఎక్కడంటే?

ఎమ్మెల్యే సతీష్ కుమార్ గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ ప్రారంభించడం పట్ల నిర్వాసిత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మీద కోపంతో తమను తాము చెప్పులతో కొట్టుకున్నారు.  

Villagers Protest: ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆగమేఘాల మీద గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ నిర్వహించడం పట్ల నిర్వాసిత గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్‌కి ఓట్లు వేసి సతీష్‌ను ఎమ్మెల్యేగా చేయడం తమ తప్పని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ఇంకోసారి టీఆర్ఎస్‌కి ఓట్లు వేస్తే చూడండంటూ తీవ్ర ఆందోళన చేశారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ మీద కోపంతో తమను తాము చెప్పులతో కొట్టుకున్నారు. పూర్తి స్థాయిలో నష్ట పరిహారం ఇవ్వకుండానే ప్రాజెక్టు ప్రారంభించడానికి అధికారులు, ప్రభుత్వం అత్యుత్సాహం చూపిస్తోందని ఆరోపించారు. తమకు ఏదైనా శాశ్వత పరిష్కారం చూపించే వరకు పనులు ప్రారంభించకూడదని చెప్పారు. ఒకవేళ పనులు ప్రారంభిస్తే... తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.  

గతంలోనూ అదే తంతు..

గతంలోనూ హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు నినాదాలు చేశారు. సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో నిర్వాసితులు దీక్ష చేశారు. దాన్ని విరమించాలని కోరుతూ... ఎమ్మెల్యే అక్కడకు వెళ్లగా వారు ఆందోళన విరమించబోమని చెప్పారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని, ప్రాజెక్టు పనులు జరగనివ్వాలని ఎమ్మెల్యే కోరినా వారు వినలేదు. ఎమ్మెల్యే సతీష్ కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాకే పనులు చేపట్టాలని నిర్వాసితులు డిమాండ్‌ చేశారు. నిర్వాసితుల ఆందోళనతో ఎమ్మెల్యే సతీష్ కుమార్ వెనుదిరిగారు. 

అర్థరాత్రి పోలీసుల లాఠీఛార్జ్...

నెలన్నర క్రితం కూడా గుడాటిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు, మూడు రోజుల్లో గౌరవెల్లి ప్రాజెక్డుకు ట్రయల్ రన్ చేస్తారనగా.. నిర్వాసితులు గొడవకు దిగారు. పరిహారం చెల్లించకుండా ట్రయల్ రన్ ఎలా చేస్తారంటూ భూనిర్వాసితులు నిలదీస్తుండటంతో గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. ట్రయల్ రన్ అడ్డుకుంటారన్న ఉద్దేశంతో గుడాటిపల్లిలో సమారుగా 100 మంది భూ నిర్వాసితులను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చర్య వల్ల అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. గ్రామస్థులు, పోలీసుల మధ్య కాసేపు తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్ కూడా చేశారు. ఈ సందర్భంగా పలువురికి గాయాలు అయ్యాయి.  

మరో 84 ఏకరాలు అయితే..

మరోవైపు గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి సేకరించాల్సిన 3900 ఎకరాల భుసేకరణలో ఇంకా కేవలం 84 ఎకరాలు మాత్రమే మిగిలి పోయిందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ తెలిపారు. ఆ భూమిని సైతం అతి త్వరలో ఎకరానికి 15 లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లించి సేకరిస్తామని పేర్కొన్నారు. 500 మంది మేజర్లకు జీవో 68 ప్రకారం ఆర్ అండ్ ఆర్ కాలనీ ఏర్పాటు చేసి అందులో ఒక ప్లాన్.. ఎమ్మెల్యే కోటా నుంచి ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయల చొప్పున ఇస్తామని తెలిపారు. మరి ప్రాజెక్టు నిర్మాణం కాబోతుందా లేదో తెలియాలంటే ఇంకా కొంత ఆగాల్సిందే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:  బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి  రాజస్థాన్‌  గెలుపు
బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి రాజస్థాన్‌ గెలుపు
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Raja Singh: శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KKR vs RR Match Highlights | లాస్ట్ ఓవర్ థ్రిల్లర్..KKR పై రాజస్థాన్ సూపర్ విక్టరీ | IPL 2024 | ABPCivils Ranker Sahana Interview | యూపీఎస్సీ ఫలితాల్లో కరీంనగర్ యువతి సత్తా | ABP DesamCivils Ranker Arpitha Khola Interview | IPS అవుతున్నారుగా.. ఏం మార్చగలరు..! | ABP DesamCivils Ranker Dheeraj Reddy Interview | ప్లాన్ 'B' నమ్ముకున్నా.. అందుకే సివిల్స్ సాధించా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:  బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి  రాజస్థాన్‌  గెలుపు
బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి రాజస్థాన్‌ గెలుపు
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Raja Singh: శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
CM Jagan: కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Nidhhi Agerwal: 'రాజా సాబ్' సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ - షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
'రాజా సాబ్' సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ - షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Embed widget