అన్వేషించండి

Indian National Anthem: నిరంతర జాతీయ గీతాలాపన, ఎక్కడో కాదు మన దగ్గరే

National Anthem: భారత స్వత్రంత్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ మరోమారు జమ్మికుంట పట్టణం వార్తల్లోకి ఎక్కింది. దాదాపు ఐదేళ్ల నుంచి అక్కడ ప్రతి రోజూ జాతీయ గీతాలాపన చేస్తున్నారు. 

Indian National Anthem: దాదాపు ఐదేళ్ల కింద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పట్టణంలో ప్రారంభమైంది నిత్య జాతీయ గీతాలాపన. ప్రతి రోజు ఉదయం ఎనిమిది గంటలకు పట్టణంలో క్రమం తప్పకుండా జాతీయ గీతాన్ని మైకుల ద్వారా వినిపించే వారు. దీంతో వివిధ పనులపై బయటకు వచ్చినా ప్రజలు ఎక్కడికి అక్కడ నిలబడి తాము కూడా గొంతు కలిపే వారు. ఇలా మొట్ట మొదటి సారిగా బహిరంగ ప్రదేశంలో నిత్య జాతీయ గీతాలాపన మొదలు పెట్టిన పట్టణంగా జమ్మికుంట పేరు గాంచింది. అయితే కేవలం మొదలు పెట్టడమే కాదు.. అప్పటి నుండి ప్రతి రోజు జాతీయ గీతాలాపన వినిపిస్తూనే ఉన్నారు.

అలా మొదలైంది... 
2017 లో ఆగస్టు 15వ తేదీన జమ్మికుంట పట్టణంలో ప్రశాంత్ రెడ్డి నిత్య జనగణమనకు శ్రీకారం చుట్టారు. దీంతో ఈ విషయం వార్తల ద్వారా నాయకులను ప్రజలను ఆకర్షించడంతో ఇదే కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని వివిధ ప్రాంతాల్లో ఇదే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. యాభై రెండు సెకండ్ల పాటు వచ్చే పాటతో దేశభక్తిని చాటుకునేలా.. అప్పట్లో మొదలు పెట్టిన ఈ కార్యక్రమం పలువురి ప్రశంసలు పొందింది. ప్రశాంత్ రెడ్డి హైదరాబాదులోని శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ వారు రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ పురస్కారాన్ని అందజేశారు.

ప్రజలు స్వచ్ఛందంగా జాతీయ భావాన్ని పెంపొందించుకునేలా మొదలు పెట్టిన ఈ కార్యక్రమం తరువాత ఇతర రాష్ట్రాలు హరియాణా, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు సైతం విస్తరించింది. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే కరీంనగర్ కేంద్రంలోని టవర్ సర్కిల్ వద్ద, జగిత్యాల టవర్ సర్కిల్, రామడుగు మండలం గోపాల్ రావు పేట, జగిత్యాల జిల్లా కోరుట్ల, కొడిమ్యాల మండలం నల్లగొండ, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఉన్న చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీసులోనూ, సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు లో ఇలాంటి కార్యక్రమం ప్రారంభమైంది. అక్కడి ప్రజల్లో దేశభక్తిని నిరంతరం నింపుతోంది.

నిరంతర దేశభక్తి..

తాను సీఐగా ఉన్న సమయంలో ప్రజల్లో ఉన్న దేశభక్తిని నిరంతరం కొనసాగించాలనే తపనతో ఈ ఆలోచన చేశానని ప్రస్తుతం హైదరాబాద్ లో ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేస్తున్న అప్పటి జమ్మికుంట సీఐ ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రజలు జాతీయ గీతం మొదలవగానే సెల్యూట్ చేస్తూ పాడుతుండటంతో.. క్రమ క్రమంగా ఈ కార్యక్రమాన్ని పలు ప్రాంతాలకు విస్తరించారు. తన ఆలోచన సక్సెస్ కావడం పట్ల అమితమైన ఆనందం కలిగిందని సీఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సామూహికంగా చేసే ఈ గీతాలాపన ద్వారా సోదర భావం సమన్వయం పెరిగి శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని ఆయన అన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు దీనికి స్పందించి, అభినందించారని అయితే ప్రజలు చూపించే అభిమానం తన బాధ్యతలు మరింత పెంచిందని ఆయన వివరించారు. బిందువు బిందువు కలిస్తే సింధువు అవుతుంది అన్నట్లుగా ఒక ప్రాంతంలో ఉద్యమంలా మొదలైన సామూహిక జాతీయ గీతాలాపన ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించడం నిజంగా జిల్లాకు గర్వ కారణం అని స్పష్టం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
Bandi Sanjay vs Etala Rajender: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం! బండి, ఈటల మధ్య సయోధ్య చర్చలు! లక్ష్మణ్‌ ఇంట్లో భేటీ!
తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం! బండి, ఈటల మధ్య సయోధ్య చర్చలు! లక్ష్మణ్‌ ఇంట్లో భేటీ!
BRS Yuva Sangrama Sadassu: బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సుకు భారీగా తరలి వస్తున్న నేతలు! కీలక నేతల అరెస్టుతో టెన్షన్‌!
బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సుకు భారీగా తరలి వస్తున్న నేతలు! కీలక నేతల అరెస్టుతో టెన్షన్‌!
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Embed widget