అన్వేషించండి

Indian National Anthem: నిరంతర జాతీయ గీతాలాపన, ఎక్కడో కాదు మన దగ్గరే

National Anthem: భారత స్వత్రంత్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ మరోమారు జమ్మికుంట పట్టణం వార్తల్లోకి ఎక్కింది. దాదాపు ఐదేళ్ల నుంచి అక్కడ ప్రతి రోజూ జాతీయ గీతాలాపన చేస్తున్నారు. 

Indian National Anthem: దాదాపు ఐదేళ్ల కింద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పట్టణంలో ప్రారంభమైంది నిత్య జాతీయ గీతాలాపన. ప్రతి రోజు ఉదయం ఎనిమిది గంటలకు పట్టణంలో క్రమం తప్పకుండా జాతీయ గీతాన్ని మైకుల ద్వారా వినిపించే వారు. దీంతో వివిధ పనులపై బయటకు వచ్చినా ప్రజలు ఎక్కడికి అక్కడ నిలబడి తాము కూడా గొంతు కలిపే వారు. ఇలా మొట్ట మొదటి సారిగా బహిరంగ ప్రదేశంలో నిత్య జాతీయ గీతాలాపన మొదలు పెట్టిన పట్టణంగా జమ్మికుంట పేరు గాంచింది. అయితే కేవలం మొదలు పెట్టడమే కాదు.. అప్పటి నుండి ప్రతి రోజు జాతీయ గీతాలాపన వినిపిస్తూనే ఉన్నారు.

అలా మొదలైంది... 
2017 లో ఆగస్టు 15వ తేదీన జమ్మికుంట పట్టణంలో ప్రశాంత్ రెడ్డి నిత్య జనగణమనకు శ్రీకారం చుట్టారు. దీంతో ఈ విషయం వార్తల ద్వారా నాయకులను ప్రజలను ఆకర్షించడంతో ఇదే కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని వివిధ ప్రాంతాల్లో ఇదే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. యాభై రెండు సెకండ్ల పాటు వచ్చే పాటతో దేశభక్తిని చాటుకునేలా.. అప్పట్లో మొదలు పెట్టిన ఈ కార్యక్రమం పలువురి ప్రశంసలు పొందింది. ప్రశాంత్ రెడ్డి హైదరాబాదులోని శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ వారు రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ పురస్కారాన్ని అందజేశారు.

ప్రజలు స్వచ్ఛందంగా జాతీయ భావాన్ని పెంపొందించుకునేలా మొదలు పెట్టిన ఈ కార్యక్రమం తరువాత ఇతర రాష్ట్రాలు హరియాణా, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు సైతం విస్తరించింది. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే కరీంనగర్ కేంద్రంలోని టవర్ సర్కిల్ వద్ద, జగిత్యాల టవర్ సర్కిల్, రామడుగు మండలం గోపాల్ రావు పేట, జగిత్యాల జిల్లా కోరుట్ల, కొడిమ్యాల మండలం నల్లగొండ, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఉన్న చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీసులోనూ, సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు లో ఇలాంటి కార్యక్రమం ప్రారంభమైంది. అక్కడి ప్రజల్లో దేశభక్తిని నిరంతరం నింపుతోంది.

నిరంతర దేశభక్తి..

తాను సీఐగా ఉన్న సమయంలో ప్రజల్లో ఉన్న దేశభక్తిని నిరంతరం కొనసాగించాలనే తపనతో ఈ ఆలోచన చేశానని ప్రస్తుతం హైదరాబాద్ లో ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేస్తున్న అప్పటి జమ్మికుంట సీఐ ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రజలు జాతీయ గీతం మొదలవగానే సెల్యూట్ చేస్తూ పాడుతుండటంతో.. క్రమ క్రమంగా ఈ కార్యక్రమాన్ని పలు ప్రాంతాలకు విస్తరించారు. తన ఆలోచన సక్సెస్ కావడం పట్ల అమితమైన ఆనందం కలిగిందని సీఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సామూహికంగా చేసే ఈ గీతాలాపన ద్వారా సోదర భావం సమన్వయం పెరిగి శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని ఆయన అన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు దీనికి స్పందించి, అభినందించారని అయితే ప్రజలు చూపించే అభిమానం తన బాధ్యతలు మరింత పెంచిందని ఆయన వివరించారు. బిందువు బిందువు కలిస్తే సింధువు అవుతుంది అన్నట్లుగా ఒక ప్రాంతంలో ఉద్యమంలా మొదలైన సామూహిక జాతీయ గీతాలాపన ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించడం నిజంగా జిల్లాకు గర్వ కారణం అని స్పష్టం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Viral News: జనగామ జిల్లాలో సంచలనం.. మద్యం అమ్మిన వారి ఇళ్లకు కరెంట్ కట్! తీర్మానం ఉల్లంఘనపై చర్యలు
జనగామ జిల్లాలో సంచలనం.. మద్యం అమ్మిన వారి ఇళ్లకు కరెంట్ కట్! తీర్మానం ఉల్లంఘనపై చర్యలు
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
Breaking News:తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు! ఉత్తర్వులు జారీ
తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు! ఉత్తర్వులు జారీ

వీడియోలు

IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: జనగామ జిల్లాలో సంచలనం.. మద్యం అమ్మిన వారి ఇళ్లకు కరెంట్ కట్! తీర్మానం ఉల్లంఘనపై చర్యలు
జనగామ జిల్లాలో సంచలనం.. మద్యం అమ్మిన వారి ఇళ్లకు కరెంట్ కట్! తీర్మానం ఉల్లంఘనపై చర్యలు
Hyderabad Crime News: బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
Bengaluru Horror: పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
Idupu Kayitham Controversy : టైటిల్ మార్చే ప్రసక్తే లేదు - ఇడుపు కాయితం కాంట్రవర్సీపై బన్నీ వాస్ రియాక్షన్
టైటిల్ మార్చే ప్రసక్తే లేదు - ఇడుపు కాయితం కాంట్రవర్సీపై బన్నీ వాస్ రియాక్షన్
Jana Nayagan Producer: 'జన నాయగన్' ప్రొడ్యూసర్ నుంచి మరో సినిమా... బాలన్ సక్సెస్‌ తర్వాత బాలీవుడ్‌ మూవీ రిలీజ్
'జన నాయగన్' ప్రొడ్యూసర్ నుంచి మరో సినిమా... బాలన్ సక్సెస్‌ తర్వాత బాలీవుడ్‌ మూవీ రిలీజ్
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున సిటీ - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
US Iran War: ఇరాన్, అమెరికా మధ్య ముగింపు దశకు సీజ్‌ఫైర్ ఒప్పందం! దాడులతో తీవ్ర ఉద్రిక్తత
ఇరాన్, అమెరికా మధ్య ముగింపు దశకు సీజ్‌ఫైర్ ఒప్పందం! దాడులతో తీవ్ర ఉద్రిక్తత
Lionel Messi Record: బెంచ్ కే పరిమితమైనా తగ్గని మెస్సి క్రేజ్.. జొర్డాన్‌ను కుమ్మేసిన అర్జెంటీనా, వరుసగా ఏడో మ్యాచ్ లోనూ గోల్ కొట్టి సరికొత్త వరల్డ్ రికార్డ్!
బెంచ్ కే పరిమితమైనా తగ్గని మెస్సి క్రేజ్.. జొర్డాన్‌ను కుమ్మేసిన అర్జెంటీనా, వరుసగా ఏడో మ్యాచ్ లోనూ గోల్ కొట్టి సరికొత్త వరల్డ్ రికార్డ్!
Embed widget