అన్వేషించండి

Cotton Price Record: ఉమ్మడి కరంనగర్ జిల్లాలో పత్తికి రికార్డు ధర, రైతులు ఖుషీ!

Cotton Price Record: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పత్తి ధర రికార్డు స్థాయిలో పలుకుతోంది. అమ్మకాలు ప్రారంభించగానే ధర అత్యధికంగా పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Cotton Price Record: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పత్తి ధర రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ఒకవైపు పెద్దపల్లి జిల్లాలో రూ.8400 పలకగా.. జమ్మికుంటలో ఏకంగా రూ.8700 పలికి రికార్డు సృష్టించింది. అసలే ఈసారి అధిక వర్షాలు రావడంతో చాలా వరకు పత్తి పంట దెబ్బతింది. అయితే ధరల విషయంలో పెరుగుదలతో పత్తి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు సీజన్ ప్రారంభమైన వెంటనే ఈ రేటు లభించడంతో రానున్న రోజుల్లో మరింత డిమాండ్ పెరుగుతుందని ఆశలు పెంచుకుంటున్నారు. గత ఏడాది పెద్దపల్లి జిల్లాలో 62,000 ఎకరాల్లో పత్తి సాగు చేశారు.

ఈసారి దాదాపుగా 8 ఎకరాలు పెంచాలని లక్ష్యంతో అధికారులు ప్రచారం చేయగా సాగు విస్తీర్ణం మాత్రం 63 వేల ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. అయితే వర్షాలు పడిన తరువాత పత్తి ధర లభించదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఈసారి దిగుబడి తగ్గడంతో పక్క దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనాలలో పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో దిగుమతులకు అవకాశం లేకుండా పోయింది. ఇక తక్కువ ధరకే దొరికే విదేశీ పత్తి లభించకపోవడంతో వ్యాపారులు మొదటి సీజన్ నుండే కొనుగోళ్ల కోసం పోటీపడ్డారు. దీంతో పత్తి ధర అమాంతం పెరిగింది ఒక వైపు పత్తి బేల్ లతోపాటు గింజలకు కూడా అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం బేల్ ధర రూ.65,000 వరకు పలుకుతుండగా గింజలకు కూడా మంచి ధర లభిస్తుందని కొనుగోలు సూచిస్తున్నాయి.

గణంకాలు ఇవీ...

ఈసారి పెద్దపల్లి మార్కెట్లో 10 రోజుల కిందట ప్రారంభమైన పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వ మద్దతు ధర రూ.6380గా ఉంది. అయితే మొదటి రోజే 7వేలకు పైగా ధర పలకగా తరువాత కొంత వరకు తగ్గుతూ వచ్చింది. అయితే ప్రభుత్వ మద్దతు ధర కంటే కూడా తగ్గిన ధర ఎక్కువగా ఉండడం విశేషం. ఇక మరోవైపు ఈనెల మూడవ తారీకు నుండి క్వింటాల్ కు 8000 మార్కులు దాటిన పత్తి ధర గురువారం  మరింత పెరిగి 8300 గా నమోదయింది. ఇక కనీస ధర 7300గా ఉంది. అలాగే శుక్రవారం ఏకంగా రూ.8410గా గరిష్ట ధర పెరిగింది. కనీస ధర రూ.7010 గా నమోదయింది. ఇప్పటి వరకు పెద్దపల్లి మార్కెట్లో గమనిస్తే నవంబర్ నెలలో లభించిన అత్యధిక ద్వారా ఇదే...

ఇక గత సంవత్సరంతో పోలిస్తే సెప్టెంబర్ చివరి వారంలో కొనుగోలు మొదలయితే డిసెంబర్ చివరి వారం పత్తి ధర రూ.8,000 కి చేరింది. ఫిబ్రవరిలో పదివేలు దాటి ఏప్రిల్ చివరి నాటికి రూ.13500 గా పెరిగింది. సాధారణంగా నవంబర్లో ప్రస్తుతం వచ్చిన ధర అత్యధికం అని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పత్తిలో తేమశాతం అధికంగా ఉండే నవంబర్, డిసెంబర్ లో ఈసారి ఇంత ధర లభిస్తే ఏప్రిల్ వరకు డిమాండ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు డిమాండ్ కు తగ్గట్టుగా సప్లై లేకపోవడంతో వ్యాపారులు సైతం వీళ్లంతా త్వరగా ఎక్కువ ధర పెట్టిన సరే కొనుగోలు చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో చివరి నిమిషంలో పత్తి కోసం పంట మార్పిడి చేసిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈసారి తేమ శాతాన్ని వ్యాపారులు పట్టించుకోకపోవడం కొసమెరుపు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
PM Kisan Yojana: హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
HPV Vaccine: రూ. 10 HPV వ్యాక్సిన్ ఉచితంగా నేటి నుంచి పంపిణీ! వ్యాక్సినేషన్‌కు 14 ఏళ్ల బాలికలకు అవసరమయ్యే పత్రాలివే! 
రూ. 10 HPV వ్యాక్సిన్ ఉచితంగా నేటి నుంచి పంపిణీ! వ్యాక్సినేషన్‌కు 14 ఏళ్ల బాలికలకు అవసరమయ్యే పత్రాలివే! 
KCR Petition: కాళేశ్వరం కేసులో సాక్షిగా పిలిచి దోషిగా తేల్చారు! జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రద్దు చేయాలని కేసీఆర్ న్యాయపోరాటం!
కాళేశ్వరం కేసులో సాక్షిగా పిలిచి దోషిగా తేల్చారు! జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రద్దు చేయాలని కేసీఆర్ న్యాయపోరాటం!

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
Money Laundering Case: జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
Iran New Supreme Leader: ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
Nawab Cafe OTT : ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
Affordable Mileage Bikes: 70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
Embed widget